- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Revanth Reddy: చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ కీలక సూచన.. అలాగైతేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి!
తెలంగాణలో ఉన్న సినిమా థియేటర్ల యజమానులు సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమ సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సూచించారు. దీనికి సంబంధించిన వీడియోలను థియేటర్లలో కచ్చితంగా ప్రదర్శించాలన్నారు. అలా ప్రదర్శించిన థియేటర్లకే భవిష్యత్తులో అనుమతులు జారీ చేస్తామన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
‘‘సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు నా సూచన. కొత్త సినిమా విడుదలైనప్పుడు టికెట్ రేట్లు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ, సామాజిక సమస్యలైన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీ వంతు బాధ్యత వహించడం లేదని మా ప్రభుత్వం భావిస్తోంది. నేను మా అధికారులకు ఒక సూచన చేస్తున్నా. ఇక నుంచి ఎవరైనా కొత్త సినిమా విడుదలవుతున్న సందర్భంగా టికెట్ ధరలు పెంచమంటూ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే, వాళ్లు డ్రగ్స్, సైబర్ క్రైమ్ నియంత్రణకు కృషి చేస్తూ ఒక వీడియో చేయాలి. మీరు విడుదల చేస్తున్న సినిమాలోని స్టార్స్తో ఆ వీడియో రూపొందించాలి. ఇది కచ్చితమైన షరతు. ఇండస్ట్రీలో ఎంత పెద్ద వాళ్లు వచ్చి రిక్వెస్ట్ చేసినా సరే, ఆ మూవీ తారగణంతో ఒకట్రెండు నిమిషాల నిడివి గల వీడియో విజువల్స్ తీసుకొచ్చి ఇస్తేనే వాళ్లకు వెసులుబాటు, రాయితీలు ఇవ్వండి. ఎందుకంటే సమాజం నుంచి వాళ్లు ఎంతో తీసుకుంటున్నారు. సమాజానికి వాళ్లు కొంతైనా ఇవ్వాలి. అది వాళ్ల బాధ్యత. సినిమా కోసం వందల కోట్లు పెట్టుబడి పెట్టి, టికెట్లు రేట్లు పెంచుకుని సంపాదించుకుంటామన్న ఆలోచన మంచిదే. అది వ్యాపారం. కానీ, సామాజిక బాధ్యత కూడా అవసరం. డ్రగ్స్, సైబర్ క్రైమ్ను నియంత్రించకపోతే సమాజం నిర్వీర్యమవుతుంది. ఈ సమాజాన్ని కాపాడటానికి సహకరించాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉంది. ప్రభుత్వ నుంచి సహకారం కోరే వారు సమాజానికి సహకరించాలి. ఇదొక్కటే మా కండీషన్. సినిమా షూటింగ్ల అనుమతి కోసం వచ్చినప్పుడే ఈ సూచన చేయాల్సిందిగా పోలీస్శాఖను కోరుతున్నా. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం రోజు ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) ముందుకొచ్చి ఓ వీడియోను రికార్డు చేసి పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా’’
‘‘60 ఏళ్ల పోరాటం, వందలాది విద్యార్థుల త్యాగంతో తెలంగాణ ఏర్పాటైంది. సమాజంలో వచ్చిన మార్పు, బలహీనతలను ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని నేరాలకు పాల్పడుతున్నారు. నేరాల కట్టడికి అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం. సిబ్బందితో పాటు నిధులు కేటాయిస్తున్నాం. సైబర్ నేరాలు అతిపెద్ద సమస్యగా మారాయి. వీటి నియంత్రణకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎంతో కృషి చేస్తున్నారు. బాధితులు పోగొట్టుకున్న సొమ్మును తిరిగి ఇస్తున్నారు. ఇందుకు వారిని అభినందిస్తున్నాను’’
‘‘గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యం వల్ల నేడు కళాశాలలు, స్కూళ్లలోనూ గంజాయి దొరుకుతోంది. వీటిపై చర్యలు తీసుకునేందుకు సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నాం. కేవలం సంపన్నులే కాకుండా మధ్యతరగతి, పేద యువకులు కూడా గంజాయికి బానిసలుగా మారుతున్నారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ అరికట్టడంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి పదోన్నతులు కల్పిస్తాం. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి దీనికి సంబంధించిన విధివిధానాలు సిద్ధం చేస్తాం. మీడియా కూడా రాజకీయ వ్యవహారాలే కాకుండా డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి కృషి చేయాలని కోరుతున్నాం’’ అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ దంపతుల మాటతో నా సంతోషం వెయ్యి రెట్లు పెరిగింది: జానీ మాస్టర్
రామ్ చరణ్ దంపతులు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. డ్యాన్స్ర్స్ యూనియన్లోని కుటుంబాలకు సాయం చేయనున్నారు. -
రజనీకాంత్, విజయ్ల రికార్డులు బ్రేక్ చేసిన ప్రభాస్.. ‘కల్కి’ వసూళ్లు ఎంతంటే!
ప్రభాస్ ‘కల్కి’ రజనీకాంత్, విజయ్ చిత్రాల రికార్డులను బ్రేక్ చేసింది. ఆరు రోజుల్లోనే ఈ చిత్రాల వసూళ్లను అధిగమించడం విశేషం. -
అమ్మాయిగా ‘విష్వక్ సేన్’.. కొత్త సినిమా రిలీజ్ ఎప్పుడంటే!
విష్వక్ సేన్ కొత్త సినిమా ‘లైలా’ పోస్టర్ను చిత్రబృందం విడుదల చేసింది. విష్వక్ ఇందులో అమ్మాయిగా కనిపించనున్నారు. -
ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?
ఈ ఏడాది విడుదలై, ప్రస్తుతం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న ప్రయోగాత్మక చిత్రాలపై ప్రత్యేక కథనం. -
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
పవన్ కల్యాణ్కు తాను వీరాభిమానినని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవన్ చరిత్ర సృష్టించారని ప్రశంసించారు. -
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
Mirzapur Season 3: గత రెండు సీజన్లుగా యువతను విశేషంగా ఆకట్టుకున్న వెబ్సిరీస్ ఏదైనా ఉందంటే అది ‘మీర్జాపూర్’ మాత్రమే. ఇప్పుడు ‘మీర్జాపూర్: సీజన్3’ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
హీరో - విలన్?
అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన తదుపరి సినిమా పనుల్ని ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియని పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. -
సన్నద్ధమవుతున్న మోక్షజ్ఞ
నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడి తెర ప్రవేశం ఖాయమైనట్టే. అగ్ర కథానాయకుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఈ ఏడాదే కెమెరా ముందుకొస్తున్నారు. -
‘మహారాజ’ దర్శకుడితో నయన్?
నయనతార ప్రస్తుతం తన సినీ కెరీర్ను రాకెట్ వేగంతో పరుగులు తీయిస్తోంది. ఇప్పటికే ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. -
ఈటీవీ విన్లో శశి మథనం
‘దాగుడు మూతలు దండా కోర్.. ఎక్కడి ప్రేమికులు అక్కడే గప్చుప్’’ అంటూ తమ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఓ యువజంట వారి ప్రేమను దక్కించుకోవడానికి తాపత్రయపడుతున్నారు. -
టాక్సిక్ కోసం 1950 కాలంలోకి!
యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘టాక్సిక్’. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్.. అన్నది ఉపశీర్షిక. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. -
‘సన్ ఆఫ్ సర్దార్2’కి జోడీగా మృణాల్..?
‘సన్ ఆఫ్ సర్దార్’తో నవ్వులు పంచిన అజయ్ దేవగణ్, సంజయ్ దత్లు దాని సీక్వెల్ ‘సన్ ఆఫ్ సర్దార్2’ కి సిద్ధమవుతున్నారు. ఇందులో కూడా వాళ్లు జస్సీ సింగ్, బిల్లు సింగ్లుగా కనిపించనున్నారు. -
చేరాలమ్మా తారా తీరాలే..
‘డార్లింగ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు నభా నటేశ్, ప్రియదర్శి. ఈ ఇద్దరూ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అశ్విన్రామ్ తెరకెక్కించారు. కె.నిరంజన్ రెడ్డి, చైతన్య సంయుక్తంగా నిర్మించారు. -
హాలీవుడ్లో కిల్!
దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో.. నిఖిల్ నగేశ్ భట్ తెరకెక్కించిన చిత్రం ‘కిల్’. లక్ష్య కథానాయకుడు. రాఘవ్ జుయిల్, ఆశిష్ విద్యార్థి, తాన్యా మాణిక్తల ఇతర కీలక పాత్రలు పోషించారు. -
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా ‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’
‘గర్ల్స్ విల్ బీ గర్ల్స్’ చిత్రం విశ్వవేదికపై మరోసారి సత్తా చాటింది. లాస్ ఏంజెలిస్లో జరిగిన భారతీయ చలన చిత్రోత్సవాల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచి, గ్రాండ్ జ్యూరీ ప్రైజ్ అందుకుంది. -
సుహాస్.. ‘జనక అయితే గనక’!
ఇటీవలే ‘ప్రసన్న వదనం’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు సుహాస్. ఇప్పుడాయన హీరోగా సందీప్రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
టాటూ రూమర్స్పై దిశా పటానీ అలా.. వెంకటేశ్ సినిమాలో ఐశ్వర్య ఇలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
టాలీవుడ్కు సీఎం రేవంత్ సూచన.. స్పందించిన మోహన్ బాబు
టాలీవుడ్కు సీఎం రేవంత్ ఇచ్చిన కీలక సూచనపై నటుడు మోహన్ స్పందించారు. ఏమన్నారంటే?
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైనల్ను చివరివరకూ చూశా.. భారత్ బ్రాండ్ క్రికెట్ అద్భుతం: పాక్ పేసర్
-
ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తాం: భట్టి
-
సరికొత్త గరిష్ఠాలకు సూచీలు.. సెన్సెక్స్ 80 వేలు తాకి వెనక్కి
-
రాజ్యసభలో సుధామూర్తి తొలి ప్రసంగం.. కృతజ్ఞతలు చెప్పిన మోదీ
-
132 సీట్ల బస్సు.. విమానం తరహాలో సౌకర్యాలు.. పైలట్ ప్రాజెక్టుపై నితిన్ గడ్కరీ!
-
ప్రపంచంలోనే అతిపెద్ద భూసేకరణ ప్రాజెక్టు అమరావతి: చంద్రబాబు