Ramoji rao: అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు: సీఎం రేవంత్ ఆదేశాలు
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
హైదరాబాద్: ఈనాడు అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత చెరుకూరి రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
‘‘రామోజీరావు మరణం చాలా బాధాకరం. పత్రికలు, ప్రసార మాధ్యమాల రంగంలో దేశానికే ఆయన ఆదర్శంగా నిలిచారు. పత్రికలు, ప్రసార సాధనాలు కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాయని నిరూపించారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాటం చేశారు. తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశానికే ఆయన మృతి తీరని లోటు’’ అని రేవంత్ అన్నారు.
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు సీఎస్ ద్వారా ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు మంగళవారం ఉదయం 5 గంటల సమయంలో పట్టాలు తప్పింది. -
సరికొత్త లూటీ!
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతూ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా.. ఎవరూ ఊహించని విధంగా ఫోన్లలోకి చొరబడుతున్నారు. -
అక్కకు అమ్మైంది
హాలహర్వి మండలం గూళ్యం గ్రామానికి చెందిన పింజరి ఖాసీంసాబు, షేకమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. మొదటి కుమార్తె అసాబికి 15 ఏళ్లు వచ్చినా మానసికంగా ఎదుగుదల లేదు. -
పోలీసుల చేతిలోనే గంజాయి గుట్టు..!
జిల్లాలో గంజాయి రవాణా చాప కింద నీరులా సాగుతోంది.. గ్రామస్థాయి నుంచి విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ దందాలో వైకాపాకు చెందిన ఓ వ్యక్తి ముఠా నేతగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇచ్ఛాపురం, పాతపట్నం, పలాస, ఆమదాలవలస నుంచి పెద్ద మొత్తంలో ప్రణాళికాబద్ధంగా రవాణా సాగుతోంది. -
మిస్ యూనివర్స్ ఆంధ్రాగా శాంతిపురం అమ్మాయి
మిస్ యూనివర్స్ తెలంగాణ, ఏపీ, కర్ణాటక స్టేట్ 1వ ఆడిషన్ ఫినాలే పోటీలు హైదరాబాదులోని శ్రీనగర్కాలనీలో ఆదివారం నిర్వహించారు. -
మసాజ్ సెంటర్లో మస్కా
ఒంగోలులోని కొన్ని స్పా, మసాజ్ కేంద్రాల్లో అనైతిక కార్యకలాపాలు సాగుతున్నాయంటూ పోలీసులకు ఫిర్యాదులందాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ అసెంబ్లీలో సలహాలివ్వాలని కోరుకుంటున్నాం!
-
మదనపల్లెలో కీలక రెవెన్యూ దస్త్రాలు మాయం?
-
‘బావా తప్పు జరిగిపోయింది.. నన్ను క్షమించు’.. వివాహిత విషాదాంతం
-
తితిదేకు నాణ్యతలేని నెయ్యి సరఫరా.. గుత్తేదారుపై చర్యలకు ఆదేశాలు
-
నెల్లూరు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
-
రూ.కోటిన్నర ఇవ్వు... లేదంటే రెండు ఫ్లాట్లు రాసివ్వు!