Andhra News: పోలీసులపై మంత్రి భార్య దురుసు ప్రవర్తన.. సీఎం చంద్రబాబు సీరియస్‌

ఏపీ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసులతో ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Published : 02 Jul 2024 00:08 IST

రాయచోటి: ఏపీ రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి సతీమణి హరితారెడ్డి పోలీసులతో ప్రవర్తించిన తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులతో ఆమె మాట్లాడిన తీరును తప్పుబట్టారు. మంత్రి రామ్‌ప్రసాద్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కోరారు. అధికారులు, ఉద్యోగుల పట్ల అందరూ గౌరవంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తే ఉపేక్షించబోనని హెచ్చరించారు.

పోలీసుల పట్ల తన భార్య ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి రామ్‌ప్రసాద్‌ రెడ్డి.. ఇలాంటి పొరపాట్లు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటానన్నారు. రాయచోటిలో పోలీసులు తనకూ ఎస్కార్ట్‌గా రావాలంటూ హరితారెడ్డి వారితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారితో దురుసుగా ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని