- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandrababu: నేడు పోలవరంపై శ్వేతపత్రం.. విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై ఏపీ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాల విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరంపై ఏపీ ప్రభుత్వం నేడు శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఏడు ప్రభుత్వశాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పోలవరంపై సీఎం చంద్రబాబు (Chandrababu) శ్వేతపత్రం విడుదల చేసి వివరాలను వెల్లడించనున్నారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం తరువాత చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటనకు పోలవరం వెళ్లారు. అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసంపై వివరాలను శ్వేతపత్రం ద్వారా వెల్లడించనున్నారు. ప్రాజెక్టు విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేయనున్నారు. జగన్ విధానాల వల్ల జరిగిన నష్టం, ముందున్న సవాళ్లపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం రూపొందించారు. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖలపై నేటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలు నిర్వహించనున్నారు. అమరావతి సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై శుక్రవారం తొలి సమీక్ష చేయనున్నారు. శాఖలో వెంటనే చేపట్టాల్సిన చర్యలు, దీర్ఘకాల ప్రణాళికపై మంత్రి సత్యకుమార్ యాదవ్, అధికారులతో చర్చించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు
తితిదే పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈవో శ్యామలరావు చర్యలు చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వెంకయ్యనాయుడి వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరు: ప్రధాని మోదీ
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. -
డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది: సీఎం రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి డి.శ్రీనివాస్ (డీఎస్) ఎంతో సేవ చేశారని.. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) అన్నారు. -
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నలుగురు నిపుణులు.. ఆదివారం ఉదయం ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. -
బొటానికల్ గార్డెన్లో రామోజీరావు సంస్మరణ సభ
కొండాపూర్ బొటానికల్ గార్డెన్లో రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రపంచకప్ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్ అభిమానులు కేరింతలు కొట్టారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/06/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రశ్నించే విద్యార్థులు, నిరుద్యోగులపై కేసులా?: హరీశ్రావు
-
దేశ అత్యున్నత అధికారులుగా..చిన్ననాటి స్నేహితులు
-
తితిదే ఈవో ఆగ్రహం.. అందుబాటులోకి గత పాలకమండలి తీర్మానాలు
-
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
-
‘రోబో’, ‘2.ఓ’ల్లో కమల్ హాసన్ అందుకే నటించలేదు.. కారణాలివే
-
16ఏళ్లు ఎదురు చూశాం.. ప్రాణాల కోసం నిమిషాలు ఓపిక పట్టలేమా..పోస్ట్ వైరల్