Ramoji Rao: బొటానికల్‌ గార్డెన్‌లో రామోజీరావు సంస్మరణ సభ

కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌లో రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు.

Published : 30 Jun 2024 11:00 IST

హైదరాబాద్‌: కొండాపూర్‌ బొటానికల్‌ గార్డెన్‌లో రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డాక్టర్‌ సోమరాజు, సినీనటుడు మురళీమోహన్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు, ‘ఈనాడు’ తెలంగాణ ఎడిటర్ డి.ఎన్‌.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రామోజీరావు ఆత్మకు శాంతి చేకూరాలని వారు మౌనం పాటించారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ.. మీడియా, తదితర రంగాలకు రామోజీరావు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు