Andhra news: ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ రాజీనామా

ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు.

Updated : 28 Jun 2024 15:29 IST

విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్‌ స్టీఫెన్‌సన్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. ఇన్‌ఛార్జ్‌ రిజిస్ట్రార్‌గా ప్రొ. కిశోర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్లలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి యూనివర్సిటీని భ్రష్టు పట్టించారంటూ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, వీసీ ఛాంబర్‌ను, వర్సిటీని వైకాపా కార్యాలయంగా మార్చేశారని, వైకాపా పెద్దల కనుసన్నల్లోనే పనిచేశారనే అభియోగాలు ఉన్నాయి. వైకాపా గెలుపు కోసం పరిశోధకులను ఉపయోగించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం రావడంతో వీసీ తన పదవికి రాజీనామా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని