- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అశ్రునయనాల మధ్య ముగిసిన అట్లూరి రామమోహనరావు అంత్యక్రియలు
ఈనాడు దినపత్రిక, రామోజీ ఫిల్మ్సిటీలకు ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన అట్లూరి రామమోహనరావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో రామోజీ గ్రూప్ సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది, బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హైదరాబాద్: ఈనాడు దినపత్రిక, రామోజీ ఫిల్మ్సిటీలకు ఎండీగా సుదీర్ఘకాలం పనిచేసిన అట్లూరి రామమోహనరావు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో రామోజీ గ్రూప్ సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది, బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అంతకుముందు జూబ్లీహిల్స్లోని రామమోహనరావు నివాసంలో ఆయన భౌతికకాయానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, జేఎండీ డాక్టర్ సుచిత్ర ఎల్లా, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ తదితరులు రామమోహనరావు పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఆయన నివాసం నుంచి మహా ప్రస్థానం వరకు జరిగిన అంతిమయాత్రలో బంధువులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.