- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Andhra news: కలకలం రేపిన ఏపీఎండీసీ దస్త్రాలు దహనం.. పెద్దిరెడ్డి అనుచరులపై అనుమానం
విజయవాడ శివారు పెదపులిపాక కరకట్ట వద్ద ఫైల్స్ దహనం ఘటన కలకలం రేపింది.
అమరావతి: విజయవాడ శివారు పెదపులిపాక కరకట్ట వద్ద ఫైల్స్ దహనం ఘటన కలకలం రేపింది. అవి మైనింగ్శాఖకు చెందిన దస్త్రాలుగా అనుమానిస్తున్నారు. కృష్ణా నది ఇసుక తిన్నెల వద్ద కారు ఆపి ఫైల్స్ తగలబెడుతుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో అక్కడి వెళ్లి ప్రశ్నించడంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. ఈ సమాచారం ఎమ్మెల్యే బోడె ప్రసాద్కు తెలియడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. దగ్ధమైన ఫైళ్లు గనులశాఖకు చెందినవిగా గుర్తించారు. ఏపీ ఎండీసీ దస్త్రాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దహనం చేయాలని చూశారని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వాటిని కాల్చిపారేసే యత్నం చేసినట్లు తెలుస్తోంది. పలు దస్త్రాలు, హార్డ్ డిస్కులు కాలిపోయాయని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. అధికారులు విచారణ చేపడితే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిర్యాలగూడ స్టేషన్లో నిలిచిన ఫలక్నుమా సూపర్ఫాస్ట్ రైలు
హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మా ఎమ్మెల్యే చెప్పారు.. నేనే పనులు చేస్తా..!
ప్రభుత్వం మారినా.. జలవనరుల శాఖలో గుత్తేదారుల తీరు మారలేదు. గత వైకాపా హయాంలో చక్రం తిప్పినవారే తాజా టెండర్లలో జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి పేరు చెప్పి సిండికేట్కు ప్రయత్నిస్తున్నారు. -
సత్యదేవుని చెంత సరిదిద్దడం సవాలే
ఎంతో ప్రముఖమైన..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి పనులంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.. ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. -
మహానందిలో చిరుత సంచారం
మహానందిలో మళ్లీ చిరుతపులి సంచరించింది. మనుషుల ప్రాణాలు పోయేంత వరకు చిరుతను పట్టుకోరా..?అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.