- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
AP PSC: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు.
అమరావతి: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బుధవారం ఆమోదించినట్టు సమాచారం. వైకాపా హయాంలో సవాంగ్ కొంతకాలం డీజీపీగా కొనసాగారు. 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు పదవిలో ఉన్న ఆయన ఉద్యోగ విరమణకు రెండేళ్ల ముందే రాజీనామా చేశారు. అనంతరం సవాంగ్ను అప్పటి వైకాపా ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్గా నియమించింది. 2022 మార్చిలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
వైకాపాతో అంటకాగిన అధికారిగా గౌతమ్ సవాంగ్ ముద్ర వేసుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో డీజీపీగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైకాపా నేతలు రాళ్ల దాడికి యత్నిస్తే.. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని సవాంగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా ఎమ్మెల్యే చెప్పారు.. నేనే పనులు చేస్తా..!
ప్రభుత్వం మారినా.. జలవనరుల శాఖలో గుత్తేదారుల తీరు మారలేదు. గత వైకాపా హయాంలో చక్రం తిప్పినవారే తాజా టెండర్లలో జోక్యం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి పేరు చెప్పి సిండికేట్కు ప్రయత్నిస్తున్నారు. -
సత్యదేవుని చెంత సరిదిద్దడం సవాలే
ఎంతో ప్రముఖమైన..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి పనులంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.. ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. -
మహానందిలో చిరుత సంచారం
మహానందిలో మళ్లీ చిరుతపులి సంచరించింది. మనుషుల ప్రాణాలు పోయేంత వరకు చిరుతను పట్టుకోరా..?అంటూ మహానంది ప్రజలు అటవీశాఖ తీరుతెన్నులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.