Andhra News: జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు

ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 29 Jun 2024 11:35 IST

అమరావతి: ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ ఓఎస్డీ బి.అనిల్ కుమార్ రెడ్డి, ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్ ఇన్కాప్ ఎండీ నీలకంఠారెడ్డి, సంప్రదాయేతర ఇంధన వనరులు కార్పొరేషన్ ఎండీ నంద కిషోర్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ముగ్గురిని సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని