AP News: మాజీ సీఎస్‌ జవహర్‌రెడ్డి ఉద్యోగ విరమణ తేదీ నోటిఫై చేసిన ప్రభుత్వం

మాజీ సీఎస్‌ జవహర్‌ రెడ్డి సహా పలువురు ఐఏఎస్‌ అధికారుల ఉద్యోగ విరమణ తేదీని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 28 Jun 2024 21:16 IST

అమరావతి: మాజీ సీఎస్‌ జవహర్‌ రెడ్డి సహా పలువురు ఐఏఎస్‌ అధికారుల ఉద్యోగ విరమణ తేదీని నోటిఫై చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30న జవహర్‌ రెడ్డి ఉద్యోగ విరమణ చేయనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెలవుపై వెళ్లిన ఆయనకు వెనుకబడిన వర్గాల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సోమవారం పోస్టింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జవహర్‌ రెడ్డి చూస్తున్న విభాగం అదనపు బాధ్యతలను అనంతరాముకు అప్పగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి పూనం మాలకొండయ్య ఉద్యోగ విరమణను సైతం నోటిఫై చేసింది. సాధారణ పరిపాలన జీపీఎం-ఏఆర్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆమె కొనసాగుతుండగా.. ఆమె అదనపు బాధ్యతలు పోల భాస్కర్‌కు అప్పగిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ అరుణ్‌, కె.వెంకటరమణారెడ్డి ఉద్యోగ విరమణను జూన్‌ 30గా నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని