Pawan Kalyan: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్‌ కల్యాణ్‌..

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

Updated : 29 Jun 2024 16:09 IST

కొండగట్టు: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు.

ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన పవన్‌కు.. మార్గమధ్యలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద జనసేన నాయకులు గజమాలతో ఆయనను సత్కరించారు. పవన్‌ రాక నేపథ్యంలో.. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్‌ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు