- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Revanth Reddy: త్వరలో వారానికో జిల్లా పర్యటన.. కలెక్టర్లు ఆఫీసు దాటడం లేదు: రేవంత్
తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ప్రజలకు ఉపయోగపడే కొత్త కార్యక్రమాలపై ఆలోచించాలని చెప్పారు. రెండు వారాల్లో ప్రతి అధికారి ఒక ఫ్లాగ్షిప్ ఐడియా ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్య కార్యదర్శులు వారానికొకసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలన్నారు.
చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని సీఎం రేవంత్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకోసారి జిల్లా అధికారులతో పనుల పురోగతిపై చర్చించాలని సూచించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, స్కూళ్లను కలెక్టర్లు తప్పనిసరిగా సందర్శించాలన్నారు. ప్రజా సమస్యలు, దుర్ఘటనలపై అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. పనితీరు ఆధారంగానే అధికారులకు ఉన్నత అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. త్వరలో వారానికొక జిల్లా పర్యటనకు వెళ్తానని సీఎం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నతోడు.. అరాచకమే చూడు
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ఆర్థిక వనరులను గత జగన్ పాలనలో పూర్తిగా నిర్వీర్యం చేశారు. -
తీరంలో ఘోరం!
ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలు, ఇతర ఉల్లంఘనలపై ఫిబ్రవరి నెలలోనే నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని హైకోర్టుఆదేశించింది. ఏప్రిల్ నెలలో మరోసారి కేసు విచారణకు వచ్చిన సమయంలో తీసుకున్న చర్యల మీద నివేదిక కోరింది. -
స్తంభం ఎక్కితేనే కొలువు నిలిచేది
వైకాపా హయాంలో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారిన రెస్కో మారింది. ఛైర్మన్, అతని అనుచరులు, పార్టీ కార్యకర్తలే అర్హతలుగా భావించి అక్రమంగా చాలా మందికి కొలువులు ఇచ్చేశారు -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలు పుట్టడంలేదని వివాహిత ఆత్మహత్య
-
అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్పై స్పందించిన నాగ్ అశ్విన్
-
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు భంగపాటు.. అధికారం దిశగా లేబర్ పార్టీ
-
ద్వారంపూడి వారి కాలుష్య పరిశ్రమ
-
వైకాపా విధేయుల్లో వణుకు.. అంటకాగిన అధికారులపై కూటమి ప్రభుత్వం ఆరా
-
అనుమతి లేకున్నా ఉన్నట్లు చూపి ప్లాట్ల విక్రయం.. కాకాణి సొంతూరిలో భారీ మోసం