- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Stampedes: కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే..
ఇంటర్నెట్డెస్క్: ఉత్తర్ప్రదేశ్లోని (Uttarpradesh) హాథ్రస్లో (Hathras) చోటు చేసుకున్న పెనువిషాదంలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రతిభాన్పుర్లో నిర్వహించిన సామూహిక శివారాధన కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరగడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మనదేశంలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న భారీ తొక్కిసలాట ఘటనల్లో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో గతంలో భారత్ చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలు కొన్నింటిని పరిశీలిస్తే..!
- ప్రయాగ్రాజ్: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ వద్ద 1954లో జరిగిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 800 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 2 వేల మందికి గాయాలయ్యాయి.
- నాగ్పుర్: 1994 నవంబర్ 23న మహారాష్ట్రలోని నాగ్పుర్లో గోవారి తెగకు చెందిన సుమారు 50 వేల మంది సమావేశమయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 114 మంది మృతి చెందారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పటి మహారాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి మధుకర్ తన పదవికి రాజీనామా చేశారు.
- శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి దేశ నలుమూలల నుంచి భక్తులు వెళ్తుంటారు. మకర జ్యోతి దర్శనానికి 1999 జనవరి 14న పంబ బేస్ క్యాంప్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు శబరిమల కొండపైకి పయనమయ్యారు. ఒకేసారి పెద్ద ఎత్తున భక్తులు నడక మార్గంలో వెళ్లడంతో తొక్కిసలాట జరిగి 53 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే తరహా ఘటన 2011 జనవరి 14న మళ్లీ చోటు చేసుకుంది. 106 మంది భక్తులు మృతి చెందగా.. 100 మందికిపైగా గాయపడ్డారు.
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య
- చెన్నై: వరద బాధితులకు చెన్నైలోని ఎంజీఆర్ నగర్ పాఠశాలలో 18, జనవరి 2005న అక్కడి ప్రభుత్వం నిత్యావసర సరకులను పంపిణీ చేసింది. బాధితులంతా ఒక్కసారిగా దూసుకురావడంతో జరిగిన తొక్కిసలాటలో 42 మంది మృతి చెందారు. మరో 37 మందికి గాయాలయ్యాయి.
- జోధ్పుర్: రాజస్థాన్లోని జోధ్పుర్లో 15వ శతాబ్దం నాటి చాముండీ దేవి ఆలయం ఉంది. దసరా నవరాత్రుల ప్రారంభాన్ని పురస్కరించుకొని 2008 సెప్టెంబర్ 30న దాదాపు 25 వేల మంది భక్తులు ఆలయానికి వెళ్లారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకొని 224 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 425 మందికి పైగా గాయపడ్డారు.
- మధ్యప్రదేశ్: నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 2013 అక్టోబర్ 13న దటియా జిల్లాలోని రత్నగఢ్ మాతను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివెళ్లారు. అదే సమయంలో దేవాలయానికి సమీపాన ఉన్న వంతెన కూలిపోవడంతో 115 మంది ప్రాణాలు కోల్పోయారు. 110 మందికి పైగా గాయపడ్డారు.
ఎవరీ ‘భోలే బాబా’..? హాథ్రస్ తొక్కిసలాటకు కారణమేంటి?
- పట్నా: దసరా వేడుకల్లో భాగంగా గాంధీ మైదాన్లో నిర్వహించిన ‘రావణ వధ’ను తిలకించేందుకు 2014 అక్టోబర్ 3న భారీ సంఖ్యలో భక్తులు వెళ్లారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రాజమహేంద్రవరం: గోదావరి పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలోని పుష్కర్ఘాట్కు పెద్ద ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. 2015 జులై 14న జరిగిన ఈ ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి గాయాలయ్యాయి.
- ముంబయి: ముంబయిలోని ఎల్ఫిన్స్టోన్ రైల్వేస్టేషన్లో ఫ్లాట్ఫామ్లపైకి వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేసిన మెట్ల మార్గంలోకి ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రయాణికులు రావడంతో అది కూలిపోయింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 23 మంది మృతి చెందారు. మరో 39 మందికి గాయాలయ్యాయి. 2017 సెప్టెంబర్ 29న ఈ ఘటన జరిగింది.
- అమృత్సర్: దసరా నవరాత్రుల్లో భాగంగా అమృత్సర్లో 2018 అక్టోబర్ 19న రావణ దహనం ఏర్పాటు చేశారు. దీనిని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చారు. బాణసంచా నుంచి తప్పించుకునేందుకు దూరంగా పరుగులు తీశారు. దీంతో అటువైపుగా వస్తున్న రైలు వారిని ఢీ కొట్టింది. అదే సమయంలో పక్క ట్రాక్పై వేరే రైలు రావడంతో చాలా మందికి తప్పించుకోవడం వీలుకాలేదు. ఈ ఘటనలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు.
- జమ్ముకశ్మీర్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 2022 జనవరి 1న జమ్ముకశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకొని 12 మంది ప్రాణాలు విడిచారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు. -
రోజుకు 10వేల అడుగులు మంచిదేనా? నిపుణుల మాట ఇదే..!
10,000 steps a day: ఒక్క అడుగు.. ఆరోగ్యానికి ముందడుగు. రోజుకు 10వేల అడుగులు వేస్తే మంచిదని చాలా మంది చెప్పే మాట. ఇది నిజమేనా? ఈ సలహా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? -
ఆ రక్తంతో వేల మందికి హెచ్ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
దేశ ఆరోగ్య విభాగం చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచిన కలుషిత రక్తం ఉదంతంపై బ్రిటన్ ప్రభుత్వం తాజా నివేదిక విడుదల చేసింది. -
మనల్ని ముక్కలు చేస్తామన్నారు.. వారే ముక్కలుగా మిగలనున్నారు!
భారత్ను ముక్కలు చేయాలని పలు ప్రాంతాల్లో వేర్పాటువాదాన్ని ఎగదోసిన పాకిస్థాన్.. నేడు ముక్కలుగా చీలిపోయేందుకు సిద్ధంగా ఉంది. -
ఇడియట్ సిండ్రోమ్.. ‘ఇంటర్నెట్ వైద్యాన్ని’ ఆశ్రయించొద్దు !
IDIOT Syndrome: ఇంటర్నెట్లో అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉండటంతో చాలామంది అనారోగ్య సమస్యల నిర్ధరణకూ దాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం తేవొచ్చు. -
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కలకలం రేపిన ఏపీఎండీసీ దస్త్రాలు దహనం.. పెద్దిరెడ్డి అనుచరులపై అనుమానం
-
నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక సూత్రధారి అరెస్టు
-
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా
-
ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి అవకాశం: సినీనటుడు నరేశ్
-
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. మార్చి 1న భారత్-పాక్ మ్యాచ్!
-
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!