- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Wheeler Island: ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది..
ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం: ‘‘సార్.. మన దేశం స్వావలంబనతో క్షిపణులను తయారుచేస్తోంది. ప్రయోగాలకు సరైన దీవి మీ రాష్ట్రంలోనే ఉంది. మాకు కేటాయించండి’’ - క్షిపణి కేంద్ర డైరెక్టర్ అబ్దుల్ కలాం అభ్యర్థన.
‘‘మీ క్షిపణి చైనాలోని లక్ష్యాలను ఛేదించగలదా? అలా అయితేనే వీలర్ దీవిని కేటాయిస్తాను’’- అప్పటి ఒడిశా సీఎం బిజూపట్నాయక్ సమాధానం.
‘‘కచ్చితంగా సార్. అంతకంటే ఎక్కువ దూర లక్ష్యాలను ఢీకొట్టగల క్షిపణులను కూడా తయారుచేస్తాం’’- అబ్దుల్ కలాం.
ఆ వెంటనే ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించారు బిజు బాబు.
కాలగమనంలో భారత క్షిపణి పితామహుడిగా ఖ్యాతికెక్కిన కలాం దేశ రాష్ట్రపతిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆ దీవిని కేటాయించిన బిజు బాబుకు దేశభక్తి ఎక్కువ. రక్షణ రంగంలో భారత్ అసమానమైన ప్రతిభ చూపించాలన్నదే ఆయన అభిమతం.
క్షిపణి ప్రయోగ కేంద్రంగా..
అంతకు ముందు చిన్న క్షిపణులను చాందీపుర్ నుంచి ప్రయోగించేవారు. అయితే భారీ క్షిపణుల ప్రయోగానికి ప్రజానివాసాలకు దూరంగా ఉండేందుకు దీవి ఉంటే బాగుంటుందని శాస్త్రవేత్తలు యోచించారు. చాందీపుర్ సముద్ర తీరానికి సమీపంలోని వీలర్ దీవిని గుర్తించారు. దీన్ని పరిశీలించేందుకు ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక నాటుపడవలో వెళ్లారు. ఒక రోజు రాత్రి అక్కడే విశ్రమించి పూర్తిగా అధ్యయనం చేసి అన్నివిధాలుగా క్షిపణి ప్రయోగాలకు సరిపోతుందని భావించారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్ కలాంకు తెలపడంతో ఆయన పట్నాయక్ దగ్గరకు వెళ్లడం, ఆయన అంగీకరించడం వెంటనే జరిగిపోయాయి.
ఇంతింతై..
అబ్దుల్ కలాం చొరవతో ప్రారంభమైన క్షిపణి కేంద్రం ఖండాంతర క్షిపణులను కూడా ప్రయోగించే స్థాయికి చేరుకుంది. రక్షణ రంగానికి చెందిన ఎలాంటి ఆయుధాలకయినా పరీక్షలు ముఖ్యం. పరీక్షలతోనే వాటి లోటుపాట్లు తెలుస్తాయి. ఇలా పలు ప్రయోగాల అనంతరం భారత అమ్ములపొదిలో చేరుతున్నాయి. వీలర్ దీవికి ‘అబ్దుల్ కలాం దీవి’గా పేరుపెట్టారు.
అన్నట్టు బిజు బాబుకు హమీ ఇచ్చినట్టుగానే మన దేశ క్షిపణులు చైనాలోని ఏ లక్ష్యాన్నయినా ఛేదించగలవు. కొన్నాళ్ల క్రితం వరకు ఆసియాలో క్షిపణుల రంగంలో తిరుగులేదని భావించిన చైనా.. మన ఖండాంతర క్షిపణి ‘అగ్ని’ పరీక్ష విజయవంతం కావడంతో ఆందోళన చెందుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు. -
రోజుకు 10వేల అడుగులు మంచిదేనా? నిపుణుల మాట ఇదే..!
10,000 steps a day: ఒక్క అడుగు.. ఆరోగ్యానికి ముందడుగు. రోజుకు 10వేల అడుగులు వేస్తే మంచిదని చాలా మంది చెప్పే మాట. ఇది నిజమేనా? ఈ సలహా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? -
ఆ రక్తంతో వేల మందికి హెచ్ఐవీ.. ఏంటీ ‘రక్తం కుంభకోణం’?
దేశ ఆరోగ్య విభాగం చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటనగా నిలిచిన కలుషిత రక్తం ఉదంతంపై బ్రిటన్ ప్రభుత్వం తాజా నివేదిక విడుదల చేసింది. -
మనల్ని ముక్కలు చేస్తామన్నారు.. వారే ముక్కలుగా మిగలనున్నారు!
భారత్ను ముక్కలు చేయాలని పలు ప్రాంతాల్లో వేర్పాటువాదాన్ని ఎగదోసిన పాకిస్థాన్.. నేడు ముక్కలుగా చీలిపోయేందుకు సిద్ధంగా ఉంది. -
ఇడియట్ సిండ్రోమ్.. ‘ఇంటర్నెట్ వైద్యాన్ని’ ఆశ్రయించొద్దు !
IDIOT Syndrome: ఇంటర్నెట్లో అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉండటంతో చాలామంది అనారోగ్య సమస్యల నిర్ధరణకూ దాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇది ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం తేవొచ్చు. -
దౌత్య పాస్పోర్టుతో విదేశాలకు ప్రజ్వల్ రేవణ్ణ.. అసలేంటీ పాస్పోర్టు..? ఎవరికి ఇస్తారు..?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు.. గుజరాత్ కుర్రాడి సక్సెస్ స్టోరీ!
Donkey Farm: ఉపాధిలేక గాడిదల ఫామ్ ప్రారంభించిన గుజరాత్ కుర్రాడు ధీరేణ్ సోలంకీ నెలకు రూ.2-3 లక్షల వరకు సంపాదిస్తున్నాడట. మరి ఆయన స్టోరీ ఏంటో చూద్దాం..! -
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్ ఎన్నికలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
-
సామాన్యుడిలా సూపర్ మార్కెట్కు బిలియనీర్.. ఇంతకీ ఎవరీయన?
-
జమ్ముకశ్మీర్లో నలుగురు ఉగ్రవాదుల హతం.. అమరులైన ఇద్దరు జవాన్లు
-
హిమాచల్ను ముంచెత్తుతున్న వర్షాలు.. ధర్మశాలలో 214.6మి.మీ వర్షపాతం
-
తెలంగాణలో ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష
-
ఆసియా కప్.. భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ