YVU: రాజీనామాపై దోబూచులాట.. వైవీయూ వీసీ, రిజిస్ట్రార్లు తప్పుకోవాలని ఆందోళన
విశ్వవిద్యాలయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో యోగి వేమన, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి, రిజిస్ట్రార్ వంటి కీలక పదవుల్లో నియమితులైన వారిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయిన చింతా సుధాకర్
యోగి వేమన విశ్వవిద్యాలయం
న్యూస్టుడే, వైవీయూ(కడప): విశ్వవిద్యాలయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గత ప్రభుత్వ హయాంలో యోగి వేమన, డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి, రిజిస్ట్రార్ వంటి కీలక పదవుల్లో నియమితులైన వారిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకూ వైకాపా నేతల అండదండలతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారని విద్యానిపుణులు, విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల నుంచి అధికారులు తప్పుకొంటున్న నేపథ్యంలో పైరెండు విశ్వవిద్యాలయాలపై అందరి దృష్టిపెడింది. వైకాపా ప్రభుత్వం అక్రమాలకు నిలయంగా మారిన విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాజీనామా చేయకుండా...
వీసీ సుధాకర్
యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ తానుంటున్న ఇంటిని ఖాళీ చేసి సొంతూరు అనంతపురానికి వెళ్లినట్లు సిబ్బంది చెబుతున్నారు. కారు కూడా సంబంధిత వర్గాలకు అప్పగించినట్లు తెలుస్తోంది. వీసీ రాజీనామా చేయకుండా వెళితే కార్యకలాపాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు ఆచార్యులు, అధ్యాపకులు చెబుతున్నారు. రిజిస్ట్రార్ వైపీ వెంకటసుబ్బయ్య కూడా తన రాజీనామాపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అధికార కార్యకలాపాలకు మాత్రం దూరంగా ఉంటున్నారు.
ఇంకా రెండేళ్లు ఉండగానే.. : ప్రస్తుత వీసీ చింతా సుధాకర్ను గత ప్రభుత్వం గతేడాది మే 11న నియమించింది. అంతకుముందు ఆయన అనంతపురం ఎస్కే యూనివర్సిటీ ఆచార్యునిగా ఉద్యోగ విరమణ చేశారు. ఈయన మాజీ సీఎం జగన్ సమీప బంధువు, ఆర్కిటెక్చర్ వర్సిటీ రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్రెడ్డికి గురువు. ఆయన అండదండలతోనే వీసీగా నియమితులయ్యారు.
ఆర్థిక బిల్లులకు ఇబ్బందే
వైవీయూ అధికారులు రాజీనామా చేయకుండా, విధులకు దూరంగా ఉండటంతో ప్రస్తుత బోధన, బోధనేతర సిబ్బంది జీతాలకు ఇబ్బంది కలగడమే కాకుండా ఆర్థిక బిల్లులను కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంటుంది. ఇప్పటివరకు వేతనాలకు సంబంధించి బిల్లులు అప్లోడ్ చేయలేదు. మరోవైపు రూసా ప్రాజెక్టులు ఈ నెల 30వ తేదీలోపు సమర్పించాలి. వీటికి సంబంధించి దాదాపు రూ.4 కోట్లు నిధులు రావాల్సి ఉంది. దీనికితోడు పీజీ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రిన్సిపల్ కూడా ఆన్డ్యూటీ మీద వెళ్లిపోయారు.
ఇటీవల రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్యను నిలదీస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు
తీవ్ర ఆరోపణలు : గత ప్రభుత్వం అనుసరించిన విధానాలు, అధికారుల నిర్ణయాలు వైవీయూ, ఏఎఫ్యూలకు శాపంగా మారాయి. దీనికితోడు ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగం, అక్రమ నియామకాలతో విద్యా ప్రమాణాలను పూర్తిగా దిగజారాయి. దీనిపై విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో వీసీ, రిజిస్ట్రార్లు పదవి నుంచి దిగిపోవాలంటూ ఇటీవల వారి ఛాంబర్లను ముట్టడించి ధర్నా చేశారు. అనంతరం కొన్ని రోజులు ఇంటికే పరిమితమైన వీసీ తాజాగా ఖాళీ చేసి సొంతూరు వెళ్లిపోయారు. వీరి రాజీనామాలపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యం వధ.. ధర్మం చెర!
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. -
శీతంపేటలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
[ 01-07-2024]
అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని తాటిగుంటపల్లి పంచాయతీ శీతంపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెరిగిన దిగుబడులు దిగుతున్న టమాట ధరలు
[ 01-07-2024]
మార్కెట్ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి. -
రహదారి కబ్జా... సాగుతో దర్జా
[ 01-07-2024]
మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. -
వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!
[ 01-07-2024]
గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు రెండోస్థానం
[ 01-07-2024]
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. -
ఇంటి వద్దకే నడిపింఛను
[ 01-07-2024]
ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు. -
అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!
[ 01-07-2024]
జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. -
మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
[ 01-07-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పోలేరమ్మకు బోనాలు
[ 01-07-2024]
పెద్దకప్పలపల్లెలో ఆదివారం పోలేరమ్మకు బోనాలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. -
మూడేళ్లుగా నిర్లక్ష్యం...లీకేజీలతో సతమతం
[ 01-07-2024]
అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది. -
మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
[ 01-07-2024]
అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి