కాలువపై కన్నేశారు.. దర్జాగా కాజేశారు!
ఆయనో వైకాపా కీలక నేత... నీతివంతుడిగా అందరి ముందు చక్కగా నటిస్తారు. తానో గొప్ప వ్యక్తినని, నిత్యం ప్రజాసేవలో తరిస్తానంటూ గొప్పలు చెబుతుంటారు.
వైకాపా నేతల కబ్జాతో బీడుగా మారిన 820 ఎకరాలు
ఎన్డీయే ప్రభుత్వం చర్యలతో వెలుగులోకి అక్రమాలు
ఈనాడు, కడప
సుంకేసుల కాలువలో జరుగుతున్న పూడికతీత పనులు
ఆయనో వైకాపా కీలక నేత... నీతివంతుడిగా అందరి ముందు చక్కగా నటిస్తారు. తానో గొప్ప వ్యక్తినని, నిత్యం ప్రజాసేవలో తరిస్తానంటూ గొప్పలు చెబుతుంటారు. దీని వెనుక ఆయన స్వార్థం ఉందని క్షేత్రస్థాయిలో ఆయన చేస్తున్న ఆక్రమణలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. ఖాజీపేటలో సుంకేసుల కాలువను చెరబట్టి దానిపై ఏకంగా దుకాణాలు నిర్మించేశారు. వాటిని బాడుగకు ఇచ్చి నాలుగు రాళ్లు వెనకేసుకుంటూ రైతుల నోట్లో మట్టి కొట్టారు. తన అనుచరులతో వందలాది ఎకరాలను బీడు భూములుగా మార్చి పాపం మూటగట్టుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఎన్డీయే సర్కారు చొరవతో సదరు నేత అక్రమాలు, ఆక్రమణలు వెలుగులోకి వచ్చాయి.
మండల కేంద్రమైన ఖాజీపేట మీదుగా వక్కిలేరు నుంచి సుంకేసులకు వెళ్లే పంట కాలువను సదరు వైకాపా నేత ఆక్రమించుకున్నారు. కాలువ ఆనవాళ్లే లేకుండా చేసి ఏకంగా దుకాణ సముదాయాన్నే నిర్మించారు. దీంతో సుంకేసుల, బీచువారిపల్లె ప్రాంతంలో సాగులో ఉన్న సుమారు 820 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందే పరిస్థితి లేకుండాపోయింది. పంట కాలువ ఆక్రమణలపై ఆయా గ్రామాల ప్రజలు పలుమార్లు అధికారులు, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండాపోయింది. అధికారుల నుంచి స్పందన లేకపోవడం, ఆక్రమణదారులను ప్రశ్నించే ధైర్యం లేకపోవడంతో రైతులు భూములను బీడుగా వదిలేశారు.
ఆక్రమణలతో పూడుకుపోయిన సుంకేసుల కాలువకు నీరందించే ఆనకట్ట
- ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ రైతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. పంట కాలువ ఆక్రమణలపై ఇటీవల కడపలో జలవనరులశాఖ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. ఖాజీపేటలో పంట కాలువ ఆక్రమణలు తొలగించి రైతులకు సాగునీరిందించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికారులు రెవెన్యూశాఖ అధికారుల సాయంతో సర్వే చేపట్టి ఆక్రమణలు తొలగించడంతోపాటు కాలువ మరమ్మతు పనులు శరవేగంగా చేపడుతున్నారు. త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు తాగు, సాగు నీరిందించేవిధంగా చర్యలు చేపడుతున్నారు. గత వారం రోజులుగా యంత్రాలతో ఆక్రమణలు తొలగిస్తున్నారు.
కాలువను ఆక్రమించి నిర్మించిన కట్టడాలు
- కాలువ ద్వారా సాగునీరు వెళ్లేందుకు వీలుగా నిర్మించిన చిన్నపాటి చెక్డ్యాంకు ఇరువైపులా పూడిక తీసి మట్టికట్టలు వేస్తున్నారు. కాలువ పునరుద్ధరణ విషయంలో మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సైతం పట్టుదలగా ఉన్నారు. ఈయనను ఆక్రమణదారులు కలిసే ప్రయత్నం చేయగా తిరస్కరించారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మంచి పని చేస్తున్నారని, ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేనని తేల్చి చెప్పారు. తాజాగా జరుగుతున్న పనులతో మండల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఎన్నికలకు ముందు కూడా రైతుల కోసం తాను పాటుపడతాననే హామీలను ఎమ్మెల్యే నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ సీˆ్వకారం చేసి నియోజకవర్గంలో అడుగుపెట్టడంతోనే ఖాజీపేట మండలంలోని సుంకేసుల రైతుల కలను సాకారం చేసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోడో పాదయాత్రకు వైఎస్ఆర్ స్ఫూర్తి: రాహుల్ గాంధీ
[ 08-07-2024]
వైఎస్ రాజశేఖర్రెడ్డి అసలైన ప్రజా నాయకుడు అని రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పించి మాట్లాడారు. -
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జగన్, షర్మిల
[ 08-07-2024]
వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా వైకాపా అధ్యక్షుడు జగన్ ఇడుపులపాయలో నివాళి అర్పించారు. -
ఊపిరి పీల్చుకో పులివెందులా!
[ 08-07-2024]
ఆయన పర్యటన ఉందంటే చాలు చెట్లు వణుకుతాయ్... ఎక్కడ అడ్డం ఉన్నాయని నరుకుతారో అన్న భయంతో... జనం జడుసుకుంటారు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టి ఆంక్షలు విధించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేస్తారో అని, వ్యాపారులు బెంబేలెత్తిపోతారు. -
కొడుకులు కాదు.. కొరివిలు!
[ 08-07-2024]
జిల్లాలో ఇటీవల తల్లిదండ్రులపై దాడులు జరుగుతున్నాయి. ఆస్తి పంచలేదని ఓ కొడుకు తల్లిదండ్రులకు విషం పెడితే... ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ తనయ తండ్రినే కడతేర్చింది. -
ఇసుక... ఇక్కట్లుండవిక
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి అక్రమమార్కులు రూ.లక్షలు దోచుకున్నారు. దీంతో నిర్మాణరంగం కుదేలైంది. -
గంజాయి రాజ్యం... వైకాపాదే పాపం!
[ 08-07-2024]
వైకాపా పాలనంతా జిల్లాలో తాలిబాన్ రాజ్యం నడిచింది... అత్యంత ప్రమాదకరమైన గంజాయితో పాటు గోవా, పుదుచ్ఛేరి, కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా సరఫరా చేశారు... సరిహద్దు చెక్పోస్టులన్నీ ఎన్నికల కోడ్ వచ్చే వరకు మూత పడ్డాయి. -
స్వచ్ఛతకు తుప్పు... ఎవరిదీ తప్పు
[ 08-07-2024]
ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛభారత్ పథకం కింద రోడ్డును శుభ్రపరిచే వాహనం మూలకు చేరింది. ఈ వాహనాన్ని ఒక్క రోజు కూడా వినియోగించలేదు. -
నేటి నుంచి ఉచిత ఇసుక
[ 08-07-2024]
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానానికి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 11 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
అందాల కొండ... కూటమితో ప్రగతి దండ
[ 08-07-2024]
తెదేపా కూటమి అధికారంలోకి రావడంతో పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. -
ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదలకు డిమాండు
[ 08-07-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండు చేశారు. -
‘కళ’తో కల తీరేలా...
[ 08-07-2024]
చిత్రలేఖనం, డిజైనింగ్, కుడ్యచిత్రాలు... ఇలా వివిధ లలితకళల్లో ఆసక్తి చూపే వారికి మరింత తర్ఫీదు అందించి, వారి కలలు సాకారం చేసేలా, ఉపాధి కల్పించడానికి యోగి వేమన విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తోంది. -
జగన్ కుటుంబంతో రాజకీయ వ్యవస్థలు సర్వనాశనం
[ 08-07-2024]
పులివెందులలో రాజకీయాలకు ఫ్యాక్షన్ను అంటగట్టి వ్యవస్థను సర్వనాశనం చేసింది వైఎస్ కుటుంబమేనని ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. -
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : బీటెక్ రవి
[ 08-07-2024]
హత్యా రాజకీయాలే జగన్ కుటుంబ పునాదులని పులివెందుల తెదేపా బాధ్యుడు బీటెక్ రవి ధ్వజమెత్తారు. పులివెందులలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. -
కనిపించని కలివికోడి!
[ 08-07-2024]
ప్రపంచంలో కలివికోడి అరుదైన ప్రాణిగా పేరొందింది. మూడు దశాబ్దాల కిందట కనిపించి తర్వాత మాయమైంది. ఆచూకీ కోసం వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గతంలో పలుమార్లు అటవీ ప్రాంతంలో సాంకేతిక కెమెరాలు అమర్చి అన్వేషణ చేపట్టినా కనిపించిన దాఖాలల్లేవు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా ఆటగాళ్లకు రూ.5 కోట్లు.. రిజర్వ్ ప్లేయర్స్కు ఎంతంటే?
-
ఓటీటీలోకి విజయ్ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!
-
అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన
-
రెండో మ్యాచ్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిదంటే?
-
బయట నుంచి చూస్తే కప్బోర్డ్.. లోపల మాత్రం ఉగ్ర స్థావరం
-
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?