అభివృద్ధికి అడ్డుపడం... అక్రమాలు సహించం...!
కడప నగరంలో వరదనీటి ప్రవాహ వ్యవస్ధ పనులు సకాలంలో పూర్తి కావాలి. బుగ్గవంక సుందరీకరణ పనులు సత్వరం పూర్తి చేయాలి.
ర్యాటిఫికేషన్ పనులపై తెదేపా ఎమ్మెల్యేల తీవ్ర అసహనం
వాడివేడిగా కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం
న్యూస్టుడే, కడప నగరపాలక
వేదికపై ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, డిప్యూటీ మేయర్
ముంతాజ్బేగం, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, కమిషనర్ సూర్యసాయిప్రవీణ్చంద్
కడప నగరంలో వరదనీటి ప్రవాహ వ్యవస్ధ పనులు సకాలంలో పూర్తి కావాలి. బుగ్గవంక సుందరీకరణ పనులు సత్వరం పూర్తి చేయాలి. నగరపాలక సంస్థ క్రీడామైదానంలో అంతర్జాతీయ స్ధాయి హాకీ మైదానం నిర్మాణం, స్కేటింగ్ రింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని భావించిన అధికారుల ఉద్దేశాన్ని అర్ధం చేసుకోగలం. కడప నగరాభివృద్ధికి చేపట్టిన ఏ ఒక్క పనికీ మేం అడ్డుపడం. అభివృద్ధి పనుల పేరిట అడ్డగోలుగా బిల్లుల చెల్లింపులు చేస్తే ఉపేక్షించం. ప్రతి అభియోగంపైనా విచారణ చేయిస్తాం. అజెండాలో చేర్చిన 4, 13, 14, 15 అంశాలపై వివరాలు అందించిన తరువాతే చర్చకు పెట్టాలి
రెడ్డప్పగారి మాధవి, ఎమ్మెల్యే, కడప
2005 నుంచి ఏకపక్షంగా సాగుతున్న కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశాల పరంపరకు తెరపడింది. కడపలో గురువారం డిప్యూటీ మేయర్ ముంతాజ్బేగం అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి తొలిసారిగా తెదేపా కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి హాజరైన నేపథ్యంలో వారికి వైకాపా కార్పొరేటర్లు ఘన స్వాగతం పలికారు. కడప నగరంలో చనిపోయినవారిని ఖననం చేయడానికి తగిన శ్మశానాలు లేకుండా చేశారని నగరపాలకసంస్ధ పాలకవర్గాన్ని మాధవిరెడ్డి విమర్శించారు. 2014-19లో తెదేపా ప్రభుత్వం శ్మశానాలకు కేటాయించిన స్ధలాలను వైకాపా నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. మాజీ ఉపముఖ్యమంత్రి ఇంటి ముందున్న కాలువలనే శుభ్రం చేయించే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు.
- ‘అత్యవసరమైతే రూ.10 లక్షల వరకు స్వీయవిచక్షణతో ఖర్చు చేసి ఆ నిర్ణయానికి స్ధానిక ప్రజాప్రతినిధుల నుంచి ర్యాటిఫికేషన్ తీసుకోవచ్చు. కడప నగరపాలక సంస్ధలో రూ.కోట్ల విలువైన పనులను చేయించిన అనంతరం కార్పొరేటర్ల ర్యాటిఫికేషన్ కోరడంలో ఔచిత్యం ఏమిటి? మేయర్ అన్నీ చేసిన తరువాతే బిల్లుల చెల్లింపునకు ఎస్ అనిపించుకోవడానికి మాత్రమే సమావేశాన్ని వాడుకుంటున్నారు. అలాంటప్పుడు కార్పొరేటర్ల అవసరం ఏముంది? నగరంలో అన్ని కూడళ్లు అభివృద్ది చేశారు. ఒక్క అప్సరా కూడలిని మాత్రం ఎందుకు వదిలిపెట్టారు ?’ ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శించారు.
- ఈ నెల 1న జరిగిన పింఛన్ల పంపిణీకి తమకు ఆహ్వానం అందలేదని 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి ఎమ్మెల్యే మాధవిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆమె స్పందిస్తూ ఏ ఒక్క కార్పొరేటర్కు ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపలేదని, ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే స్వచ్ఛందంగా రావచ్చునన్నారు. అలంఖాన్పల్లిని మీరేమైనా రాయించుకున్నారా అని ఘాటుగా ప్రశ్నించారు మహిళా కార్పొరేటర్ల భర్తలను కార్యాలయంలోకి అనుమతించలేదని 10వ డివిజన్ కార్పొరేటర్ మల్లి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. కార్పొరేటర్ల భర్తలకు ప్రత్యేక హోదాలేమీ ఉండవని, వారిని అనుమతిస్తే సాధారణ ప్రజలు కూడా సమావేశానికి వస్తారని, వారిని అనుమతిస్తారా అని మాధవిరెడ్డి ఎదురు ప్రశ్నించారు.
- 28వ డివిజన్ కార్పొరేటర్ ఆరీఫుల్లా హుస్సేనీ మాట్లాడుతూ నకాశ్లోని శ్మశానవాటికలో మోకాళ్ల లోతు నీరు చేరుతుండటంతో అంత్యక్రియలు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 40వ డివిజన్ కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి మాట్లాడుతూ ఎస్బీఐ కాలనీలో కాలువల నిర్మాణ అస్తవ్యస్తంగా చేపట్టడంతో ప్రజలు మురుగుతో అవస్థలు పడుతున్నారన్నారు. పాత స్కేటింగ్ రింగు తొలగింపునకు రూ.22 లక్షలు ఎలా ఖర్చు చేశారని 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావు ప్రశ్నించారు. 13వ డివిజన్ కార్పొరేటర్ రామలక్ష్మణరెడ్డి తమ వీధుల్లోని కాలువలను ప్రధాన కాలువలతో అనుసంధానించడంలో ప్రమాణాలు పాటించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. 30వ డివిజన్ కార్పొరేటర్ షఫీ మాట్లాడుతూ రహదారుల విస్తరణకు సహకరించినవారికి నిర్మాణాల విషయంలో సహకరించడంలేదని నోటీసులిస్తున్నారన్నారు. 49వ డివిజన్లో తాగునీటి సమస్యపై కార్పొరేటర్ ఉమాదేవి మాట్లాడారు.
- సమావేశం ముగింపులో మరో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి మేయర్ స్థానంలో అధ్యక్షత వహించారు. సమావేశ మందిరంలోకి ఇతరులు రాకూడదని అధికారులు, పోలీసులు హెచ్చరించినా వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూర్చోవడం గమనార్హం. సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, కమిషనర్ సూర్యసాయి ప్రవీణ్చంద్, అధికారులు పాల్గొన్నారు.
కడప నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కోరాం..నేను, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కలిసి నగరానికి కొత్త రూపురేఖలు తీసుకొస్తాం. చెన్నూరు, చింతకొమ్మదిన్నె మండలాల పరిధిలోని డివిజన్ల అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించాలి. ఎస్ఆర్నగర్ తదితర ప్రాంతాల్లో లేఅవుట్లకు అనుమతి ఇవ్వకుండా ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చారు. లేఅవుÆట్లకు అనుమతి లేదని ఇళ్లపై రెట్టింపు పన్నులు విధిస్తున్నారు. ఇందిరానగర్లో నిర్మాణమైన తాగునీటి ట్యాంకులకు కనెక్షన్లు ఇవ్వలేకపోతున్నారు.
పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, ఎమ్మెల్యే, కమలాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊపిరి పీల్చుకో పులివెందులా!
[ 08-07-2024]
ఆయన పర్యటన ఉందంటే చాలు చెట్లు వణుకుతాయ్... ఎక్కడ అడ్డం ఉన్నాయని నరుకుతారో అన్న భయంతో... జనం జడుసుకుంటారు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టి ఆంక్షలు విధించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేస్తారో అని, వ్యాపారులు బెంబేలెత్తిపోతారు. -
కొడుకులు కాదు.. కొరివిలు!
[ 08-07-2024]
జిల్లాలో ఇటీవల తల్లిదండ్రులపై దాడులు జరుగుతున్నాయి. ఆస్తి పంచలేదని ఓ కొడుకు తల్లిదండ్రులకు విషం పెడితే... ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ తనయ తండ్రినే కడతేర్చింది. -
ఇసుక... ఇక్కట్లుండవిక
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి అక్రమమార్కులు రూ.లక్షలు దోచుకున్నారు. దీంతో నిర్మాణరంగం కుదేలైంది. -
గంజాయి రాజ్యం... వైకాపాదే పాపం!
[ 08-07-2024]
వైకాపా పాలనంతా జిల్లాలో తాలిబాన్ రాజ్యం నడిచింది... అత్యంత ప్రమాదకరమైన గంజాయితో పాటు గోవా, పుదుచ్ఛేరి, కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా సరఫరా చేశారు... సరిహద్దు చెక్పోస్టులన్నీ ఎన్నికల కోడ్ వచ్చే వరకు మూత పడ్డాయి. -
స్వచ్ఛతకు తుప్పు... ఎవరిదీ తప్పు
[ 08-07-2024]
ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛభారత్ పథకం కింద రోడ్డును శుభ్రపరిచే వాహనం మూలకు చేరింది. ఈ వాహనాన్ని ఒక్క రోజు కూడా వినియోగించలేదు. -
నేటి నుంచి ఉచిత ఇసుక
[ 08-07-2024]
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానానికి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 11 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
అందాల కొండ... కూటమితో ప్రగతి దండ
[ 08-07-2024]
తెదేపా కూటమి అధికారంలోకి రావడంతో పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. -
ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదలకు డిమాండు
[ 08-07-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండు చేశారు. -
‘కళ’తో కల తీరేలా...
[ 08-07-2024]
చిత్రలేఖనం, డిజైనింగ్, కుడ్యచిత్రాలు... ఇలా వివిధ లలితకళల్లో ఆసక్తి చూపే వారికి మరింత తర్ఫీదు అందించి, వారి కలలు సాకారం చేసేలా, ఉపాధి కల్పించడానికి యోగి వేమన విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తోంది. -
జగన్ కుటుంబంతో రాజకీయ వ్యవస్థలు సర్వనాశనం
[ 08-07-2024]
పులివెందులలో రాజకీయాలకు ఫ్యాక్షన్ను అంటగట్టి వ్యవస్థను సర్వనాశనం చేసింది వైఎస్ కుటుంబమేనని ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. -
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : బీటెక్ రవి
[ 08-07-2024]
హత్యా రాజకీయాలే జగన్ కుటుంబ పునాదులని పులివెందుల తెదేపా బాధ్యుడు బీటెక్ రవి ధ్వజమెత్తారు. పులివెందులలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. -
కనిపించని కలివికోడి!
[ 08-07-2024]
ప్రపంచంలో కలివికోడి అరుదైన ప్రాణిగా పేరొందింది. మూడు దశాబ్దాల కిందట కనిపించి తర్వాత మాయమైంది. ఆచూకీ కోసం వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గతంలో పలుమార్లు అటవీ ప్రాంతంలో సాంకేతిక కెమెరాలు అమర్చి అన్వేషణ చేపట్టినా కనిపించిన దాఖాలల్లేవు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బాక్సాఫీస్కు రాబోతున్న మరో పెద్ద చిత్రం.. ఓటీటీలో సందడి వీటితో
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,294
-
పొలాల్లో, బీడు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
-
బాలీవుడ్ నటితో పెళ్లి.. స్పందించిన కుల్దీప్ యాదవ్
-
కమల్ హాసన్ వాయిస్ను ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM