logo

ఎన్‌సీసీ బెటాలియన్‌ తరలించొద్దని వినతి

కడప నగర శివారు తెలుగు గంగ కాలనీలోని ఆంధ్రా బెటాలియన్‌ను తిరుపతికి తరలించొద్దని సీనియర్‌ ఎన్‌సీసీ క్యాడెట్లు కోరారు.

Published : 05 Jul 2024 03:08 IST

డీఆర్‌వో గంగాధర్‌గౌడ్‌కు వినతిపత్రం అందిస్తున్న సీనియర్‌ ఎన్‌సీసీ క్యాడెట్లు 

కడప క్రీడలు, న్యూస్‌టుడే : కడప నగర శివారు తెలుగు గంగ కాలనీలోని ఆంధ్రా బెటాలియన్‌ను తిరుపతికి తరలించొద్దని సీనియర్‌ ఎన్‌సీసీ క్యాడెట్లు కోరారు. ఈ మేరకు కడప డీఆర్‌వో గంగాధర్‌గౌడ్‌ను గురువారం ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్‌సీసీ బెటాలియన్‌ను తరలిస్తే కలిగే పరిణామాలను వివరించారు. ఈ సందర్భంగా క్యాడెట్లు మాట్లాడుతూ..  ఫిబ్రవరిలో నిర్వహించిన ఏ, బీ, సీ సర్టిఫికెట్ల ఫలితాలను అన్ని జిల్లాల్లో విడుదల చేశారని, జిల్లాలో ఇప్పటి వరకు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎవరో చేసిన అక్రమాల  కారణంగా ఈ ఏడాది ఎన్‌సీసీ ప్రవేశాలు రద్దు చేయడం బాధాకరమన్నారు. అధికారులు, ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు చేసిన తప్పునకు ఎన్‌సీసీ బెటాలియన్‌ను తిరుపతికి తరలించడం సరికాదన్నారు. పాలకులు, అధికారులు జోక్యం చేసుకుని ఎన్‌సీసీ బెటాలియన్‌ తరలింపును అడ్డుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని