మారని పంథా... ఆగని దందా!
జిల్లాలో వైకాపా నేతల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమిపాలై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీరి పంథా మారడంలేదు.
పోలీసుల అండతో వైకాపా నాయకుల ఆగడాలు
రైల్వేకోడూరు, తంబళ్లపల్లెలో దారికి రాని పరిస్థితి
జిల్లాలో వైకాపా నేతల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమిపాలై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీరి పంథా మారడంలేదు. రైల్వే కోడూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఆగడాలు, ఆరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉండడం గమనార్హం.
ఈనాడు, కడప
తన సొంత పొలంలో నిలబడి ఉన్న ఈమె పేరు అరుణ. ఈమెకు తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లె సమీపంలో 79 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దీనిపై వైకాపా నేత, సింగిల్ విండో మాజీ ఛైర్మన్ అమరనాథ్ కన్నుపడింది. ఎమ్మెల్యే ద్వారకనాథ్రెడ్డి ప్రధాన అనుచరుడైన ఈయన అరుణ పొలాన్ని కొట్టేయడానికి బెదిరింపులకు పాల్పడుతున్నారు. పంట సాగు చేస్తే ట్రాక్టరుతో దున్నేయడం, ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగడం వంటివాటికి పాల్పడుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వైకాపా నేతకే వత్తాసు పలుకుతున్నారు. బాధిత మహిళకు న్యాయం చేయాల్సిన సీఐ సూర్యనారాయణ నిందితులకే అండగా నిలుస్తున్నారనే ఆరోపణలున్నాయి. బాధితురాలు తెదేపా సానుభూతిపరురాలే కాకుండా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కీలకపాత్ర పోషించారనే అక్కసుతో నిత్యం వేధింపులకు పాల్పడుతున్నారు. వైకాపా నేత అమరనాథ్, వారి అనుచరుల దౌర్జన్యాలు, పోలీసుల నుంచి న్యాయం జరగకపోవడంతో ఇటీవల ఆమె మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని సైతం కలిసి ఆవేదన వెల్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన మంత్రి సీఐతో మాట్లాడి న్యాయం చేయాలని ఆదేశించినా ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. వైకాపా నేత, ఆయన అనుచరులకు అరుణ పొలానికి పక్కనే భూములుండడంతో రహదారి ఏర్పాటుకు భూమి వదలాలని కోరగా తిరస్కరించడంతో ఏకంగా పొలాన్నే ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యవహారంలోని నేతలు మండలంలో భారీగా దందాలకు పాల్పడడంతో పాటు ఇప్పుడు వాటిని కాపాడుకోవడానికి జనసేన పార్టీలో చేరే ఎత్తులు వేస్తుండగా, ఆ పార్టీ నేతలు నిరాకరించారు.
చిత్రంలో కనిపిస్తోంది రైల్వేకోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలం అనంతసముద్రంలోని నీటి కుంట. దీనిని గ్రామానికి చెందిన వైకాపా కీలక నేత ఆక్రమించుకున్నారు. సర్వే సంఖ్య 137లో 11.73 ఎకరాల్లో కుంట ఉండగా, ఇందులో ఆరెకరాల వరకు ఆక్రమించుకుని ఇనుప కంచె కూడా ఏర్పాటు చేసుకున్నారు. కుంటకు అనుబంధంగా సర్వే సంఖ్య 154లో 0.98 ఎకరాలు, 156లో 1.44 ఎకరాల భూమిని ఆక్రమించేశారు. ఇక్కడ ఎకరా రూ.10 లక్షలు నుంచి రూ.15 లక్షల వరకు ధర పలుకుతోంది. ఇలా దాదాపు రూ.కోటి విలువ చేసే ప్రభుత్వ భూమిని ఆక్రమించగా స్థానికులు రెవెన్యూశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. సర్వేతో సరిపెట్టి ప్రభుత్వ భూమిగా తేల్చారు. అయితే స్వాధీనం చేసుకోవడానికి వైకాపాతో అంటకాగుతున్న అధికారులు ముందుకు రావడంలేదు. ఇదే నేత పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా ప్రకృతి సంపదను కొల్లకొడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊపిరి పీల్చుకో పులివెందులా!
[ 08-07-2024]
ఆయన పర్యటన ఉందంటే చాలు చెట్లు వణుకుతాయ్... ఎక్కడ అడ్డం ఉన్నాయని నరుకుతారో అన్న భయంతో... జనం జడుసుకుంటారు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టి ఆంక్షలు విధించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేస్తారో అని, వ్యాపారులు బెంబేలెత్తిపోతారు. -
కొడుకులు కాదు.. కొరివిలు!
[ 08-07-2024]
జిల్లాలో ఇటీవల తల్లిదండ్రులపై దాడులు జరుగుతున్నాయి. ఆస్తి పంచలేదని ఓ కొడుకు తల్లిదండ్రులకు విషం పెడితే... ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ తనయ తండ్రినే కడతేర్చింది. -
ఇసుక... ఇక్కట్లుండవిక
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి అక్రమమార్కులు రూ.లక్షలు దోచుకున్నారు. దీంతో నిర్మాణరంగం కుదేలైంది. -
గంజాయి రాజ్యం... వైకాపాదే పాపం!
[ 08-07-2024]
వైకాపా పాలనంతా జిల్లాలో తాలిబాన్ రాజ్యం నడిచింది... అత్యంత ప్రమాదకరమైన గంజాయితో పాటు గోవా, పుదుచ్ఛేరి, కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా సరఫరా చేశారు... సరిహద్దు చెక్పోస్టులన్నీ ఎన్నికల కోడ్ వచ్చే వరకు మూత పడ్డాయి. -
స్వచ్ఛతకు తుప్పు... ఎవరిదీ తప్పు
[ 08-07-2024]
ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛభారత్ పథకం కింద రోడ్డును శుభ్రపరిచే వాహనం మూలకు చేరింది. ఈ వాహనాన్ని ఒక్క రోజు కూడా వినియోగించలేదు. -
నేటి నుంచి ఉచిత ఇసుక
[ 08-07-2024]
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానానికి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 11 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
అందాల కొండ... కూటమితో ప్రగతి దండ
[ 08-07-2024]
తెదేపా కూటమి అధికారంలోకి రావడంతో పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. -
ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదలకు డిమాండు
[ 08-07-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండు చేశారు. -
‘కళ’తో కల తీరేలా...
[ 08-07-2024]
చిత్రలేఖనం, డిజైనింగ్, కుడ్యచిత్రాలు... ఇలా వివిధ లలితకళల్లో ఆసక్తి చూపే వారికి మరింత తర్ఫీదు అందించి, వారి కలలు సాకారం చేసేలా, ఉపాధి కల్పించడానికి యోగి వేమన విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తోంది. -
జగన్ కుటుంబంతో రాజకీయ వ్యవస్థలు సర్వనాశనం
[ 08-07-2024]
పులివెందులలో రాజకీయాలకు ఫ్యాక్షన్ను అంటగట్టి వ్యవస్థను సర్వనాశనం చేసింది వైఎస్ కుటుంబమేనని ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. -
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : బీటెక్ రవి
[ 08-07-2024]
హత్యా రాజకీయాలే జగన్ కుటుంబ పునాదులని పులివెందుల తెదేపా బాధ్యుడు బీటెక్ రవి ధ్వజమెత్తారు. పులివెందులలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. -
కనిపించని కలివికోడి!
[ 08-07-2024]
ప్రపంచంలో కలివికోడి అరుదైన ప్రాణిగా పేరొందింది. మూడు దశాబ్దాల కిందట కనిపించి తర్వాత మాయమైంది. ఆచూకీ కోసం వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గతంలో పలుమార్లు అటవీ ప్రాంతంలో సాంకేతిక కెమెరాలు అమర్చి అన్వేషణ చేపట్టినా కనిపించిన దాఖాలల్లేవు.