హంద్రీనీవా కాలువకు మహర్దశ!
గత వైకాపా ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా కాలువ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు 4 వేల కోట్లతో తవ్వించిన కాలువ పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయింది.
రూ.380 కోట్లతో పనులు చేసేందుకు చర్యలు
ఎన్డీయే ప్రభుత్వం దృష్టిసారించడంతో కదలిక
న్యూస్టుడే, మదనపల్లె పట్టణం, తంబళ్లపల్లె
మట్టితో తాత్కాలికంగా ఎత్తు చేసిన అంగళ్లు సమీపంలో హంద్రీనీవా కాలువ (పాత చిత్రం)
గత వైకాపా ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా కాలువ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు 4 వేల కోట్లతో తవ్వించిన కాలువ పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయింది. వైకాపా ప్రభుత్వం కనీనం కాలువ నిర్వహణ పనులు చేయించలేకపోయింది. ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడంతో అధికారులు సైతం చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం నారా చంద్రబాబునాయుడు కాలువను పరిశీలించి ఎస్ఈ రాజగోపాల్ను వివరాలు అడిగి తెలుసుకుని అసంపూర్తి పనులపై దృష్టిసారించాలని ఆదేశించారు.
కొత్తపల్లె వద్ద హెచ్ఎన్ఎస్ఎస్ కాలువపై రైతులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వంతెన (పాత చిత్రం)
- పుంగనూరు ఉప కాలువ అనంతపురం జిల్లా ముదిగుబ్బ సమీపంలో బొంతలపల్లె వద్ద ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి జిల్లాలోకి పీటీఎం మండలం వద్ద ప్రవేశిస్తుంది. ములకలచెరువు, పీటీఎం, బి.కొత్తకోట, కురబలకోట, మదనపల్లె మీదుగా చిత్తూరు జిల్లా పుంగనూరు, పలమనేరు, వి.కోట, శాంతిపురం, కుప్పం వరకు వెళుతుంది. బి.కొత్తకోట నుంచి మదనపల్లె వరకు కృష్ణాజలాల పారుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. కాలువకు 25 చోట్ల గండ్లు పడడంతోపాటు పలుచోట్ల లీకేజీలేర్పడ్డాయి. దీంతో నీరు వృథా అవుతుండడంతో అధికారులు గట్టుపై మట్టిని పోసి తాత్కాలిక చర్యలు చేపట్టారు.
- బి.కొత్తకోట నుంచి మదనపల్లె మధ్య 64 కిలోమీటరు నుంచి 83 కిలోమీటరు వరకు ఉన్న పెండింగ్ పనులతో పాటు కాలువ వెడల్పు, లీకేజీలున్నచోట్ల లైనింగ్ పనులకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. ఇందుకోసం హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు రూ.280 కోట్లు ఖర్చు చేయనున్నాను. కాలువ వెడల్పు చేసేందుకు గతంలో నిర్వహించిన రూ.1,200 కోట్ల టెండర్లలోనే నిధులు వినియోగించి పనులు చేయడానికి ప్రభుత్వం అంగీకిరించినట్లు సమాచారం. గతంలో టెండరు ద్వారా పనులు దక్కించుకున్న గుత్తేదారుతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాన కాలువ గాలివీడు మండలం మడుగు వారిపల్లె 483 కిలోమీటరు నుంచి ప్రారంభమై కేవీపల్లె మండలం అడవిపల్లె రిజర్వాయరు వరకు సాగుతుంది. అసంపూర్తిగా ఉన్న ప్రధాన కాలువ పనులకు రూ.100 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ప్రధాన కాలువలో మొత్తం 9 నిర్మాణాలుండగా, వీటిలో 3 నిర్మాణ దశలోనే నిలిచిపోగా, మిగిలినవి నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేసినట్లు తెలిసింది.
అక్టోబరు నాటికి నీటిని తీసుకురావాలన్నది లక్ష్యం
త్వరితగతిన అసంపూర్తి పనులతోపాటు కాలువ వెడల్పు, లైనింగ్ పనులు పూర్తి చేసి అక్టోబరు నాటికి కృష్జాజలాలు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టు కున్నాం. దీనిపై ఇటీవల సీఎం చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనకు వచ్చినప్పుడు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి నివేదికను అందజేయాలని అధికారులకు ఆదేశాలిచ్చాం.
సి.ఆర్.రాజగోపాల్, ఎస్ఈ, హెచ్ఎన్ఎస్ఎస్, మదనపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊపిరి పీల్చుకో పులివెందులా!
[ 08-07-2024]
ఆయన పర్యటన ఉందంటే చాలు చెట్లు వణుకుతాయ్... ఎక్కడ అడ్డం ఉన్నాయని నరుకుతారో అన్న భయంతో... జనం జడుసుకుంటారు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టి ఆంక్షలు విధించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేస్తారో అని, వ్యాపారులు బెంబేలెత్తిపోతారు. -
కొడుకులు కాదు.. కొరివిలు!
[ 08-07-2024]
జిల్లాలో ఇటీవల తల్లిదండ్రులపై దాడులు జరుగుతున్నాయి. ఆస్తి పంచలేదని ఓ కొడుకు తల్లిదండ్రులకు విషం పెడితే... ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ తనయ తండ్రినే కడతేర్చింది. -
ఇసుక... ఇక్కట్లుండవిక
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి అక్రమమార్కులు రూ.లక్షలు దోచుకున్నారు. దీంతో నిర్మాణరంగం కుదేలైంది. -
గంజాయి రాజ్యం... వైకాపాదే పాపం!
[ 08-07-2024]
వైకాపా పాలనంతా జిల్లాలో తాలిబాన్ రాజ్యం నడిచింది... అత్యంత ప్రమాదకరమైన గంజాయితో పాటు గోవా, పుదుచ్ఛేరి, కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా సరఫరా చేశారు... సరిహద్దు చెక్పోస్టులన్నీ ఎన్నికల కోడ్ వచ్చే వరకు మూత పడ్డాయి. -
స్వచ్ఛతకు తుప్పు... ఎవరిదీ తప్పు
[ 08-07-2024]
ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛభారత్ పథకం కింద రోడ్డును శుభ్రపరిచే వాహనం మూలకు చేరింది. ఈ వాహనాన్ని ఒక్క రోజు కూడా వినియోగించలేదు. -
నేటి నుంచి ఉచిత ఇసుక
[ 08-07-2024]
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానానికి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 11 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
అందాల కొండ... కూటమితో ప్రగతి దండ
[ 08-07-2024]
తెదేపా కూటమి అధికారంలోకి రావడంతో పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. -
ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదలకు డిమాండు
[ 08-07-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండు చేశారు. -
‘కళ’తో కల తీరేలా...
[ 08-07-2024]
చిత్రలేఖనం, డిజైనింగ్, కుడ్యచిత్రాలు... ఇలా వివిధ లలితకళల్లో ఆసక్తి చూపే వారికి మరింత తర్ఫీదు అందించి, వారి కలలు సాకారం చేసేలా, ఉపాధి కల్పించడానికి యోగి వేమన విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తోంది. -
జగన్ కుటుంబంతో రాజకీయ వ్యవస్థలు సర్వనాశనం
[ 08-07-2024]
పులివెందులలో రాజకీయాలకు ఫ్యాక్షన్ను అంటగట్టి వ్యవస్థను సర్వనాశనం చేసింది వైఎస్ కుటుంబమేనని ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. -
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : బీటెక్ రవి
[ 08-07-2024]
హత్యా రాజకీయాలే జగన్ కుటుంబ పునాదులని పులివెందుల తెదేపా బాధ్యుడు బీటెక్ రవి ధ్వజమెత్తారు. పులివెందులలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. -
కనిపించని కలివికోడి!
[ 08-07-2024]
ప్రపంచంలో కలివికోడి అరుదైన ప్రాణిగా పేరొందింది. మూడు దశాబ్దాల కిందట కనిపించి తర్వాత మాయమైంది. ఆచూకీ కోసం వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గతంలో పలుమార్లు అటవీ ప్రాంతంలో సాంకేతిక కెమెరాలు అమర్చి అన్వేషణ చేపట్టినా కనిపించిన దాఖాలల్లేవు.