పరిహారం... పరిహాసం!
జలాశయం నిర్మాణానికి సొంతూరిని వీడిన నిర్వాసితుల జీవితాలు దుర్భరంగా మారాయి. కనీస మౌలిక వసతుల్లేక అసౌకర్యాల మధ్య దయనీయ జీవనం అనుభవిస్తున్నారు.
ఏళ్లుగా మండిపల్లి నాగిరెడ్డి జలాశయ నిర్వాసితుల నిరీక్షణ
నిర్వాసిత కాలనీలో నిలిచిపోయిన పాఠశాల, తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులు
జలాశయం నిర్మాణానికి సొంతూరిని వీడిన నిర్వాసితుల జీవితాలు దుర్భరంగా మారాయి. కనీస మౌలిక వసతుల్లేక అసౌకర్యాల మధ్య దయనీయ జీవనం అనుభవిస్తున్నారు. ఏళ్లుగా పరిహారం అందక ఆర్థికంగా చితికిపోయారు. వీరు పడుతున్న కష్టాలను ప్రతి ఎన్నికల వేళ కళ్లారా చూస్తున్న నేతలు హామీలిస్తున్నారే తప్ప ఆదుకోవడంలేదు. ఇదీ మండిపల్లి నాగిరెడ్డి జలాశయం నిర్వాసితుల దుస్థితి.
న్యూస్టుడే, రాయచోటి, చిన్నమండెం
రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం మండలం మల్లూరు వద్ద 2005-2008 మధ్య కాలంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.320 కోట్లతో మండిపల్లి నాగిరెడ్డి జలాశయం నిర్మించింది. మెరుగైన పరిహారమిచ్చి ఆదుకుంటామని నేతలు, అధికారులు ముంపు గ్రామాలైన బండకాడకురవపల్లి, కొత్తవట్టంవాండ్లపల్లి ప్రజలకు హామీ ఇచ్చి ఒప్పందం కుదుర్చుకున్న గుత్తేదారులతో పనులు చేపట్టారు. ప్రాజెక్టు ఎగువ భాగంలోని రెండు గ్రామాలు నీట మునిగే పరిస్థితి రావడంతో నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండానే బలవంతంగా మరో ప్రాంతానికి తరలించారు. గత వైకాపా ప్రభుత్వ పాలనలో పరిహారం కింద రూ.6 కోట్లు నిధులు మంజూరయ్యాయని నేతలు చెప్పినా ప్రభుత్వ కాల పరిమితి ముగిసే వరకు అందించకపోవడం గమనార్హం.
సీసీ రహదారులకు నోచుకోని నిర్వాసితుల కాలనీ
- కడప-బెంగళూరు జాతీయ రహదారి సమీపంలోని మిట్ట ప్రాంతంలో నిర్వాసితులకు పునరావాస కాలనీ ఏర్పాటు చేశారు. కేవలం కాలనీ ఏర్పాటుకు అవసరమైన మేర లేఅవుట్ వేసి స్థలాలు కేటాయించారే తప్ప ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. ప్యాకేజీలో భాగంగా రూ.90 లక్షలతో నిర్మించతలపెట్టిన పాఠశాల, అంగన్వాడీ కేంద్ర భవనాలు పునాదులకే పరిమితమయ్యాయి. ప్రైవేటు అద్దె భవనలోనే నేటీకీ ఉపాధ్యాయులు పిల్లలకు తరగతులు నిర్వహిస్తున్నారు. తాగునీటి సరఫరాకు ప్రభుత్వం వేసిన బోర్లు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో తాగునీటికి నానా అవస్థలు పడుతున్నారు. ఒక్క వీధిలో కూడా సీసీ రహదారి నిర్మించలేదు.
- పెరుగుతున్న ధరలకనుగుణంగా తమకు ఆర్ఆర్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించాలని, ఇంటికి రూ.10 లక్షలు తక్కువ కాకుండా పరిహారం ఇవ్వాలని పట్టుబట్టారు. గతేడాది అప్పటి వైకాపా ప్రభుత్వం రూ.6 కోట్లు పరిహారం కింద మంజూరు చేస్తూ జీవో విడుదలైంది. వన్టైం సెటిల్మెంట్ కింద ఒక్కొక్క కుటుంబానికి రూ.6.50 లక్షల మేర నిధులిచ్చేందుకు నిర్ణయించారు. సొంతంగా ఇంటిని నిర్మించు కున్నవారికి రూ.3.75 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో చాలామంది నిరాకరించారు. గండికోట జలాశయ నిర్వాసితులకు తరహాలోనే తమకు ఆర్ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని డిమాండు చేస్తున్నారు. పరిహారం చెల్లింపులకు మంజూరైన నిధులు విడుదల కాకపోవడంతో నిర్వాసితులకు పరిహరం నేటికీ అందలేదు. ఎన్డీయే ప్రభుత్వం దృష్టిసారించి పరిహారం చెల్లింపులకు చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు.
చెల్లింపులకు చర్యలు తీసుకుంటాం
ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందనే అభియోగాలున్నాయి. నీటిపారుదలశాఖ అధికారులతో చర్చించి నిర్వాసితులకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటాం.
మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఊపిరి పీల్చుకో పులివెందులా!
[ 08-07-2024]
ఆయన పర్యటన ఉందంటే చాలు చెట్లు వణుకుతాయ్... ఎక్కడ అడ్డం ఉన్నాయని నరుకుతారో అన్న భయంతో... జనం జడుసుకుంటారు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టి ఆంక్షలు విధించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేస్తారో అని, వ్యాపారులు బెంబేలెత్తిపోతారు. -
కొడుకులు కాదు.. కొరివిలు!
[ 08-07-2024]
జిల్లాలో ఇటీవల తల్లిదండ్రులపై దాడులు జరుగుతున్నాయి. ఆస్తి పంచలేదని ఓ కొడుకు తల్లిదండ్రులకు విషం పెడితే... ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ తనయ తండ్రినే కడతేర్చింది. -
ఇసుక... ఇక్కట్లుండవిక
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి అక్రమమార్కులు రూ.లక్షలు దోచుకున్నారు. దీంతో నిర్మాణరంగం కుదేలైంది. -
గంజాయి రాజ్యం... వైకాపాదే పాపం!
[ 08-07-2024]
వైకాపా పాలనంతా జిల్లాలో తాలిబాన్ రాజ్యం నడిచింది... అత్యంత ప్రమాదకరమైన గంజాయితో పాటు గోవా, పుదుచ్ఛేరి, కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా సరఫరా చేశారు... సరిహద్దు చెక్పోస్టులన్నీ ఎన్నికల కోడ్ వచ్చే వరకు మూత పడ్డాయి. -
స్వచ్ఛతకు తుప్పు... ఎవరిదీ తప్పు
[ 08-07-2024]
ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛభారత్ పథకం కింద రోడ్డును శుభ్రపరిచే వాహనం మూలకు చేరింది. ఈ వాహనాన్ని ఒక్క రోజు కూడా వినియోగించలేదు. -
నేటి నుంచి ఉచిత ఇసుక
[ 08-07-2024]
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానానికి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 11 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
అందాల కొండ... కూటమితో ప్రగతి దండ
[ 08-07-2024]
తెదేపా కూటమి అధికారంలోకి రావడంతో పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. -
ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదలకు డిమాండు
[ 08-07-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండు చేశారు. -
‘కళ’తో కల తీరేలా...
[ 08-07-2024]
చిత్రలేఖనం, డిజైనింగ్, కుడ్యచిత్రాలు... ఇలా వివిధ లలితకళల్లో ఆసక్తి చూపే వారికి మరింత తర్ఫీదు అందించి, వారి కలలు సాకారం చేసేలా, ఉపాధి కల్పించడానికి యోగి వేమన విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తోంది. -
జగన్ కుటుంబంతో రాజకీయ వ్యవస్థలు సర్వనాశనం
[ 08-07-2024]
పులివెందులలో రాజకీయాలకు ఫ్యాక్షన్ను అంటగట్టి వ్యవస్థను సర్వనాశనం చేసింది వైఎస్ కుటుంబమేనని ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. -
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : బీటెక్ రవి
[ 08-07-2024]
హత్యా రాజకీయాలే జగన్ కుటుంబ పునాదులని పులివెందుల తెదేపా బాధ్యుడు బీటెక్ రవి ధ్వజమెత్తారు. పులివెందులలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. -
కనిపించని కలివికోడి!
[ 08-07-2024]
ప్రపంచంలో కలివికోడి అరుదైన ప్రాణిగా పేరొందింది. మూడు దశాబ్దాల కిందట కనిపించి తర్వాత మాయమైంది. ఆచూకీ కోసం వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గతంలో పలుమార్లు అటవీ ప్రాంతంలో సాంకేతిక కెమెరాలు అమర్చి అన్వేషణ చేపట్టినా కనిపించిన దాఖాలల్లేవు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
బాక్సాఫీస్కు రాబోతున్న మరో పెద్ద చిత్రం.. ఓటీటీలో సందడి వీటితో
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,294
-
పొలాల్లో, బీడు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
-
బాలీవుడ్ నటితో పెళ్లి.. స్పందించిన కుల్దీప్ యాదవ్
-
కమల్ హాసన్ వాయిస్ను ఇమిటేట్ చేసిన బ్రహ్మానందం.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM