కుంచె పోసిన ప్రాణం... సుందర గ్రామీణ జీవనం
పుట్టుకతోనే ఎవరూ చిత్రకారులు కాలేరు. ఎంతో శ్రమించాలి. గురువుల శిక్షణ అవసరం. అప్పుడే పరిణితి చెందిన నైపుణ్య కళాకారులు కాగలరు.
సునంద గీసిన అపురూప చిత్రాలకు ప్రథమ బహుమతి
సౌత్ జోన్ యువజనోత్సవాల్లో పతకాల పంట
న్యూస్టుడే, మైదుకూరు
తాను వేసిన చిత్రాలతో ఎద్దుల సునంద
పుట్టుకతోనే ఎవరూ చిత్రకారులు కాలేరు. ఎంతో శ్రమించాలి. గురువుల శిక్షణ అవసరం. అప్పుడే పరిణితి చెందిన నైపుణ్య కళాకారులు కాగలరు. అయితే మైదుకూరు మండలం నానుబాలపల్లె ఎస్సీకాలనీకి చెందిన ఎద్దుల సునంద చిత్రలేఖనంపై అభిరుచి పెంచుకుని రాణిస్తున్నారు. పోటీల్లో పాల్గొంటూ బహుమతులు, అవార్డులు అందుకుంటున్నారు. తల్లిదండ్రులు అన్నపూర్ణ, జీవయ్య. వ్యవసాయ కుటుంబం. స్వగ్రామంలో ప్రాథమిక, దువ్వూరులో ఉన్నత పాఠశాల విద్య, బద్వేలులోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఇంటర్ చదివారు. అయిదో తరగతి చదివే సమయంలో పెన్సిల్, పెన్నులతో బొమ్మలు గీసే సునంద చదువుతోపాటు అప్పుడప్పుడు వేసే బొమ్మలు చూసిన ఉపాధ్యాయుడు ఒకరు చిత్రలేఖనంలో రాణించే అందులో డిగ్రీ విశ్వ విద్యాలయంలో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో చేరారు. నాలుగేళ్లపాటు సాగిన విద్యలో చిత్రలేఖనం, మట్టితో బొమ్మలు తయారీలోనే మెలకువలను నేర్చుకున్నారు.
సౌత్జోన్ యూత్ ఫెస్టివల్లో ప్రథమ బహుమతి
పద్మావతి మహిళా విశ్వ విద్యాలయంలో 2021-22లో సౌత్జోన్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖనం పోటీలో ప్రథమ బహుమతిని సాధించారు. విశ్వ విద్యాలయంలో జరిగిన పోటీలోనూ ప్రథమ బహుమతి పొందారు. సీపీ బ్రౌన్ గ్రంథాలయం ఆధ్వర్యంలో 1999-20లో నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి, 2000-21లో నిర్వహించిన పోటీలో ద్వితీయ స్థానం పొందినట్లు వివరించారు. యోగివేమన విశ్వ విద్యాలయంలో బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసిన సునంద పోస్టుగ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్షలో మూడో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం నంద్యాలలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో డ్రాయింగ్ మాస్టర్గా బోధిస్తున్నారు.
పల్లె వాతావరణంపై మక్కువ
మా తల్లిదండ్రులకు వ్యవసాయమే జీవనాధారం. నేను పల్లెలోనే పెరిగాను. పచ్చని పొలాలు, వాటి గట్లు, గడ్డిమోపులు ఎత్తుకుని నడుచుకుంటే వచ్చే మహిళలు, పొగమంచు సమయంలో పల్లెల్లో నెలకొన్న వాతావరణం అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ ప్రజల జీవనం నాకు మక్కువ. అదే ఇతివృత్తంగా తీసుకుని బొమ్మలు వేస్తూ ఉంటాను. ఇప్పటికి వందకు పైగా చిత్రాలు వేశాను. గ్రామీణ సౌందర్యాన్ని చూపే చిత్రాలే అందులో ఎక్కువగా ఉన్నాయి. ఉపాధి కోసం ఉద్యోగ అన్వేషణ చేస్తూనే ఉత్తమ కళాకారిణి కావాలన్నదే నా లక్ష్యం.
సునంద, చిత్ర కళాకారిణి, మైదుకూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోడో పాదయాత్రకు వైఎస్ఆర్ స్ఫూర్తి: రాహుల్ గాంధీ
[ 08-07-2024]
వైఎస్ రాజశేఖర్రెడ్డి అసలైన ప్రజా నాయకుడు అని రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా నివాళి అర్పించి మాట్లాడారు. -
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జగన్, షర్మిల
[ 08-07-2024]
వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతి సందర్భంగా వైకాపా అధ్యక్షుడు జగన్ ఇడుపులపాయలో నివాళి అర్పించారు. -
ఊపిరి పీల్చుకో పులివెందులా!
[ 08-07-2024]
ఆయన పర్యటన ఉందంటే చాలు చెట్లు వణుకుతాయ్... ఎక్కడ అడ్డం ఉన్నాయని నరుకుతారో అన్న భయంతో... జనం జడుసుకుంటారు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టి ఆంక్షలు విధించి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేస్తారో అని, వ్యాపారులు బెంబేలెత్తిపోతారు. -
కొడుకులు కాదు.. కొరివిలు!
[ 08-07-2024]
జిల్లాలో ఇటీవల తల్లిదండ్రులపై దాడులు జరుగుతున్నాయి. ఆస్తి పంచలేదని ఓ కొడుకు తల్లిదండ్రులకు విషం పెడితే... ఇష్టం లేని వివాహం చేస్తున్నారని ఓ తనయ తండ్రినే కడతేర్చింది. -
ఇసుక... ఇక్కట్లుండవిక
[ 08-07-2024]
గత వైకాపా పాలనలో ఇసుక ధరలకు రెక్కలు వచ్చాయి. ఇసుక కృత్రిమ కొరతను సృష్టించి అక్రమమార్కులు రూ.లక్షలు దోచుకున్నారు. దీంతో నిర్మాణరంగం కుదేలైంది. -
గంజాయి రాజ్యం... వైకాపాదే పాపం!
[ 08-07-2024]
వైకాపా పాలనంతా జిల్లాలో తాలిబాన్ రాజ్యం నడిచింది... అత్యంత ప్రమాదకరమైన గంజాయితో పాటు గోవా, పుదుచ్ఛేరి, కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా సరఫరా చేశారు... సరిహద్దు చెక్పోస్టులన్నీ ఎన్నికల కోడ్ వచ్చే వరకు మూత పడ్డాయి. -
స్వచ్ఛతకు తుప్పు... ఎవరిదీ తప్పు
[ 08-07-2024]
ప్రొద్దుటూరు పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛభారత్ పథకం కింద రోడ్డును శుభ్రపరిచే వాహనం మూలకు చేరింది. ఈ వాహనాన్ని ఒక్క రోజు కూడా వినియోగించలేదు. -
నేటి నుంచి ఉచిత ఇసుక
[ 08-07-2024]
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానానికి సోమవారం నుంచి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జిల్లావ్యాప్తంగా 11 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
అందాల కొండ... కూటమితో ప్రగతి దండ
[ 08-07-2024]
తెదేపా కూటమి అధికారంలోకి రావడంతో పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్ అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. -
ఉద్యోగుల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదలకు డిమాండు
[ 08-07-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్థిక బకాయిలపై శ్వేత పత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండు చేశారు. -
‘కళ’తో కల తీరేలా...
[ 08-07-2024]
చిత్రలేఖనం, డిజైనింగ్, కుడ్యచిత్రాలు... ఇలా వివిధ లలితకళల్లో ఆసక్తి చూపే వారికి మరింత తర్ఫీదు అందించి, వారి కలలు సాకారం చేసేలా, ఉపాధి కల్పించడానికి యోగి వేమన విశ్వవిద్యాలయం వేదికగా నిలుస్తోంది. -
జగన్ కుటుంబంతో రాజకీయ వ్యవస్థలు సర్వనాశనం
[ 08-07-2024]
పులివెందులలో రాజకీయాలకు ఫ్యాక్షన్ను అంటగట్టి వ్యవస్థను సర్వనాశనం చేసింది వైఎస్ కుటుంబమేనని ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. -
దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది : బీటెక్ రవి
[ 08-07-2024]
హత్యా రాజకీయాలే జగన్ కుటుంబ పునాదులని పులివెందుల తెదేపా బాధ్యుడు బీటెక్ రవి ధ్వజమెత్తారు. పులివెందులలోని తెదేపా కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. -
కనిపించని కలివికోడి!
[ 08-07-2024]
ప్రపంచంలో కలివికోడి అరుదైన ప్రాణిగా పేరొందింది. మూడు దశాబ్దాల కిందట కనిపించి తర్వాత మాయమైంది. ఆచూకీ కోసం వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా గతంలో పలుమార్లు అటవీ ప్రాంతంలో సాంకేతిక కెమెరాలు అమర్చి అన్వేషణ చేపట్టినా కనిపించిన దాఖాలల్లేవు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అస్సాంలోని వరద బాధిత ప్రాంతాల్లో రాహుల్ పర్యటన
-
రెండో మ్యాచ్లోనే సెంచరీ.. అభిషేక్ శర్మ వాడిన బ్యాట్ ఎవరిదంటే?
-
బయట నుంచి చూస్తే కప్బోర్డ్.. లోపల మాత్రం ఉగ్ర స్థావరం
-
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
-
బతికుండగానే కన్నకూతురిని సమాధి చేసిన తండ్రి
-
అలా చేయగల ఏకైక నటుడు కమల్హాసన్: బ్రహ్మానందం