నాడేమో మమకారం.. నేడేది సహకారం?
అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శం. ఈ రోజు సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణం.
నడవని అరటి ప్రాసెసింగ్ యూనిట్
రూ.34 లక్షల విద్యుత్తు బిల్లుల జారీ
మార్కెటింగ్శాఖ అధికారుల ఆందోళన
ఈనాడు, కడప
అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శం. ఈ రోజు సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. సొంతగడ్డపై మీ మమకారం ఎప్పటికీ తీరేది కాదు.
... ఈ ఏడాది మార్చి 11న ముఖ్యమంత్రి హోదాలో రూ.816.84 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ జగన్ అన్నమాటలివి.
పులివెందుల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లె సమీపంలో అయిదెకరాల్లో రూ.20.15 కోట్లతో నూతనంగా నిర్మించిన అరటి ప్రాసెసింగ్ యూనిట్ను మూడు నెలల కిందట ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రారంభించారు. ఇందులో 600 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న నాలుగు కోల్డ్ స్టోరేజ్లు, 126 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆరు ప్రీ కూలింగ్ ఛాంబర్లు, లేబర్ క్వార్టర్స్, యంత్ర గదులు, 60 టన్నుల వేబ్రిడ్జితో పాటు అరటి, చీనీకి సంబంధించి వేర్వేరుగా నాలుగు గ్రేడింగ్, క్లీనింగ్, ప్యాకింగ్ లైన్స్ ఏర్పాటు చేశారు. యూనిట్ను గత మూడు నెలలుగా వినియోగంలోకి తీసుకురాకపోగా, విద్యుత్తు బిల్లులు మాత్రం రూ.34 లక్షల మేర వచ్చింది. ఈ మొత్తం వెంటనే చెల్లించాలని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ మార్కెటింగ్శాఖకు తాజాగా నోటీసులు జారీ చేశారు. బిల్లు మొత్తాన్ని చూసి మార్కెటింగ్ విభాగం అధికారులు కంగుతిన్నారు. తమ విభాగం బడ్జెట్ మొత్తం వెచ్చించినా బిల్లు చెల్లించే పరిస్థితి లేదంటూ లబోదిబోమంటున్నారు. ఈ యూనిట్ కోసం ప్రత్యేకంగా విద్యుత్తు ఉపకేంద్రం ఏర్పాటు చేశారు. వినియోగించినా.. లేకున్నా కనీస బిల్లుగా నెలకు రూ.4 లక్షలు చెల్లించాలనే నిబంధన ఉన్నట్లు ఎస్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఇప్పటి వరకు రూ.34 లక్షల కరెంటు బిల్లు వచ్చింది.
ముందుకు రావడంలేదు
యూనిట్ను నడపడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి నెలకొంది. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనే ప్రయత్నాలు సఫలం కాలేదు. ఎవరికో వచ్చిన ఆలోచనతో వెంటనే యూనిట్ నిర్మాణం జరిగిపోయింది. ఇంతకీ రైతులకు ఉపయోగంలోకి తీసుకొచ్చే వ్యవస్థ లేకపోయింది. ఇప్పటికే అరటి ప్రాసెసింగ్ యూనిట్ వృథాగా పడి ఉంది. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన యూనిట్ ద్వారా అరటిపండ్లను ముక్కలుగా కోసి తయారు చేసుకునేవిధంగా యూనిట్ను స్థాపించారు. దీన్ని గతేడాది అక్టోబర్ 4న జగన్ ప్రారంభించారు. అరటి మొద్దుల (కాండం) నుంచి తీసిన నారను ఫైబర్గా మార్చడంతోపాటు ప్లేట్లు, కప్పులు తయారు చేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు వీటి తయారీ, మార్కెటింగ్ జరగలేదు. మంచి ఆశయంతో దీన్ని ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకొంటున్న వైకాపా నేతలు ప్రజాధనాన్ని వెచ్చించి స్థాపించిన యూనిట్లు వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. రూ.కోట్లు వెచ్చించామంటూ గొప్పలు తప్ప... ప్రజాప్రయోజనం ఎంత మేరకు అనే పరిశీలన జరగడంలేదు. దీంతో పులివెందులలో చేపట్టిన అభివృద్ధి పనులు చాలా వరకు వృథాగా ఉండిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలువపై కన్నేశారు.. దర్జాగా కాజేశారు!
[ 05-07-2024]
ఆయనో వైకాపా కీలక నేత... నీతివంతుడిగా అందరి ముందు చక్కగా నటిస్తారు. తానో గొప్ప వ్యక్తినని, నిత్యం ప్రజాసేవలో తరిస్తానంటూ గొప్పలు చెబుతుంటారు. -
కుంచె పోసిన ప్రాణం... సుందర గ్రామీణ జీవనం
[ 05-07-2024]
పుట్టుకతోనే ఎవరూ చిత్రకారులు కాలేరు. ఎంతో శ్రమించాలి. గురువుల శిక్షణ అవసరం. అప్పుడే పరిణితి చెందిన నైపుణ్య కళాకారులు కాగలరు. -
అభివృద్ధికి అడ్డుపడం... అక్రమాలు సహించం...!
[ 05-07-2024]
కడప నగరంలో వరదనీటి ప్రవాహ వ్యవస్ధ పనులు సకాలంలో పూర్తి కావాలి. బుగ్గవంక సుందరీకరణ పనులు సత్వరం పూర్తి చేయాలి. -
పోలీసుశాఖ స్థలాల ధారాదత్తంపై నివ్వెరపోయిన డీజీపీ
[ 05-07-2024]
కడప నగరంలోని పోలీసుశాఖ స్థలాలను వైకాపా నేతలకు ధారాదత్తం చేయడంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు నివ్వెరపోయారు. -
ఎన్సీసీ బెటాలియన్ తరలించొద్దని వినతి
[ 05-07-2024]
కడప నగర శివారు తెలుగు గంగ కాలనీలోని ఆంధ్రా బెటాలియన్ను తిరుపతికి తరలించొద్దని సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు కోరారు. -
వైకాపా పాపం... విద్యార్థులకు శాపం!
[ 05-07-2024]
బి.కోడూరు మండలం సగిలేరు అంబేడ్కర్ గురుకుల కళాశాల గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. -
మాజీ సీఎం చిత్రాలపై ఫిర్యాదు
[ 05-07-2024]
వేంపల్లె మండలం కుప్పాలపల్లెలో మాజీ సీఎం జగన్ చిత్రాలతో ఉన్న ఎండీయూ వాహనం ద్వారా ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. -
మంగంపేట గనులపై విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట గనుల్లో సుమారు రూ.2 వేల కోట్ల మేర అవకతవకలు జరిగాయని, నిధుల స్వాహాతోపాటు అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ డీజీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి లేఖ రాశారు. -
మారని పంథా... ఆగని దందా!
[ 05-07-2024]
జిల్లాలో వైకాపా నేతల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమిపాలై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీరి పంథా మారడంలేదు. -
హంద్రీనీవా కాలువకు మహర్దశ!
[ 05-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా కాలువ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు 4 వేల కోట్లతో తవ్వించిన కాలువ పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయింది. -
పరిహారం... పరిహాసం!
[ 05-07-2024]
జలాశయం నిర్మాణానికి సొంతూరిని వీడిన నిర్వాసితుల జీవితాలు దుర్భరంగా మారాయి. కనీస మౌలిక వసతుల్లేక అసౌకర్యాల మధ్య దయనీయ జీవనం అనుభవిస్తున్నారు. -
గురిపెడితే... పతకాలే
[ 05-07-2024]
రైఫిల్ షూటింగులో బుల్లెట్లా దూసుకెళుతున్నారు పసిడిపురి విద్యార్థులు. గురి పెడితే బంగారు పతకాలు రావాల్సిందే. పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రతతో పని చేస్తే దేనినైనా సాధించ వచ్చని ఆ విద్యార్థులు నిరూపిస్తున్నారు.