logo

ఎండీయూ వాహనాల తనిఖీ

చౌక దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం, వాటిని కూడా ఆలస్యంగా అందజేయడం, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో జేసీ గణేష్‌కుమార్, డీఎస్‌వో చాముండేళ్వరీ మంగళవారం ఎండీయూ వాహనాలను తనిఖీ చేశారు.

Published : 03 Jul 2024 04:09 IST

చెన్నూరు, న్యూస్‌టుడే: చౌక దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం, వాటిని కూడా ఆలస్యంగా అందజేయడం, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో జేసీ గణేష్‌కుమార్, డీఎస్‌వో చాముండేళ్వరీ మంగళవారం ఎండీయూ వాహనాలను తనిఖీ చేశారు. నిత్యావసర సరకులను పంపిణీ చేయడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిల్వ ఉన్న సరుకు, పంపిణీపై ఆరా తీశారు. కొందరు డీలర్ల రాజీనామాలు,  రాజకీయ నిర్ణయాల్లో నెలకొన్న అలసత్వంతో కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని