పెచ్చులూడిన పాఠశాల భవనం పైకప్పు!
కడప నగరంలోని ఐటీఐ కూడలి సమీపంలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో మంగళవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడిన ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.
ఆరుగురు విద్యార్థులకు గాయాలు... ఆసుపత్రికి తరలింపు
వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి విద్యాసంస్థలో ఘటన
గతంలోనే ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు
ప్రమాదంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
ఈనాడు, కడప, న్యూస్టుడే, కడప నేరవార్తలు
కడప నగరంలోని ఐటీఐ కూడలి సమీపంలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో మంగళవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడిన ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయం కాగా, మరో విద్యార్థికి చేయి విరిగింది. వీరిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తుండగా మీడియా ఎదురుపడడంతో దొంగచాటుగా తరలించేందుకు పాఠశాల యాజమాన్యం ప్రయత్నించింది. మధ్యాహ్నం 2 గంటలకు ఘటన జరగ్గా పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారమివ్వకుండా గాయపడిన విద్యార్థులను నేరుగా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించిన అనంతరం వారి ఇళ్ల వద్ద వదిలేసి రావడం గమనార్హం.
ప్రమాదంపై సమాచారమందుకున్న ఆర్డీవో మధుసూదన్, డీఈవో అనూరాధ, తహసీల్దార్ వెంకటరమణ, పోలీసు అధికారులు పాఠశాలకు చేరుకుని ఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. ఘటనపై కలెక్టర్కు నివేదిక అందజేస్తామని ఆర్డీవో తెలిపారు. పాఠశాల ఎదుట వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. తక్షణమే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. విద్యాశాఖాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాఠశాల ఛైర్మన్, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆయన భార్య, పాఠశాల కరస్పాండెంట్, కార్పొరేటర్ శ్రీదేవి, కుమారుడు సుధీర్రెడ్డిలపై కడప తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తరగతి గది పైకప్పు కూలిందని విద్యాశాఖ అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదులు చేసినా పట్టని అధికారులు: పాఠశాల నిర్వహణ, తరగతి గదుల నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోందని గత నెల 18న ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, ఎమ్మెల్యే మాధవి జిల్లా విద్యాశాఖ అధికారితోపాటు కమిషనరుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు తమ ఫిర్యాదులు పట్టించుకోకపోవడంతోనే ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల ఛైర్మన్ వైకాపా చెందిన కీలక నేత కావడంతోనే ఫిర్యాదులపై స్పందించలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండు చేశారు.
మంత్రి లోకేశ్ స్పందనతో అధికారుల పరుగులు: ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆరుగురు విద్యార్థులు గాయపడిన ఘటన కలిచివేసిందన్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలువపై కన్నేశారు.. దర్జాగా కాజేశారు!
[ 05-07-2024]
ఆయనో వైకాపా కీలక నేత... నీతివంతుడిగా అందరి ముందు చక్కగా నటిస్తారు. తానో గొప్ప వ్యక్తినని, నిత్యం ప్రజాసేవలో తరిస్తానంటూ గొప్పలు చెబుతుంటారు. -
కుంచె పోసిన ప్రాణం... సుందర గ్రామీణ జీవనం
[ 05-07-2024]
పుట్టుకతోనే ఎవరూ చిత్రకారులు కాలేరు. ఎంతో శ్రమించాలి. గురువుల శిక్షణ అవసరం. అప్పుడే పరిణితి చెందిన నైపుణ్య కళాకారులు కాగలరు. -
అభివృద్ధికి అడ్డుపడం... అక్రమాలు సహించం...!
[ 05-07-2024]
కడప నగరంలో వరదనీటి ప్రవాహ వ్యవస్ధ పనులు సకాలంలో పూర్తి కావాలి. బుగ్గవంక సుందరీకరణ పనులు సత్వరం పూర్తి చేయాలి. -
పోలీసుశాఖ స్థలాల ధారాదత్తంపై నివ్వెరపోయిన డీజీపీ
[ 05-07-2024]
కడప నగరంలోని పోలీసుశాఖ స్థలాలను వైకాపా నేతలకు ధారాదత్తం చేయడంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు నివ్వెరపోయారు. -
ఎన్సీసీ బెటాలియన్ తరలించొద్దని వినతి
[ 05-07-2024]
కడప నగర శివారు తెలుగు గంగ కాలనీలోని ఆంధ్రా బెటాలియన్ను తిరుపతికి తరలించొద్దని సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు కోరారు. -
వైకాపా పాపం... విద్యార్థులకు శాపం!
[ 05-07-2024]
బి.కోడూరు మండలం సగిలేరు అంబేడ్కర్ గురుకుల కళాశాల గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. -
మాజీ సీఎం చిత్రాలపై ఫిర్యాదు
[ 05-07-2024]
వేంపల్లె మండలం కుప్పాలపల్లెలో మాజీ సీఎం జగన్ చిత్రాలతో ఉన్న ఎండీయూ వాహనం ద్వారా ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. -
మంగంపేట గనులపై విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట గనుల్లో సుమారు రూ.2 వేల కోట్ల మేర అవకతవకలు జరిగాయని, నిధుల స్వాహాతోపాటు అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ డీజీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి లేఖ రాశారు. -
మారని పంథా... ఆగని దందా!
[ 05-07-2024]
జిల్లాలో వైకాపా నేతల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమిపాలై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీరి పంథా మారడంలేదు. -
హంద్రీనీవా కాలువకు మహర్దశ!
[ 05-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా కాలువ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు 4 వేల కోట్లతో తవ్వించిన కాలువ పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయింది. -
పరిహారం... పరిహాసం!
[ 05-07-2024]
జలాశయం నిర్మాణానికి సొంతూరిని వీడిన నిర్వాసితుల జీవితాలు దుర్భరంగా మారాయి. కనీస మౌలిక వసతుల్లేక అసౌకర్యాల మధ్య దయనీయ జీవనం అనుభవిస్తున్నారు. -
గురిపెడితే... పతకాలే
[ 05-07-2024]
రైఫిల్ షూటింగులో బుల్లెట్లా దూసుకెళుతున్నారు పసిడిపురి విద్యార్థులు. గురి పెడితే బంగారు పతకాలు రావాల్సిందే. పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రతతో పని చేస్తే దేనినైనా సాధించ వచ్చని ఆ విద్యార్థులు నిరూపిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ట్యాపింగ్ కేసులో... మరో మలుపు!
-
రేషన్ వాహనాలతో రూ. 1,500 కోట్ల నష్టం: మంత్రి నాదెండ్ల మనోహర్
-
‘అంతా మీరే చేశారు’.. కాదు మీ వల్లే జిల్లాలో పార్టీ నాశనమైంది
-
చంద్రబాబుకు థాంక్స్ చెప్పడానికి బైక్ యాత్ర
-
కృష్ణాపై అందాల వారధి.. ట్రాఫిక్ కష్టాలు తీర్చే దారిది!
-
అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ