వెలిగల్లు.. ఆయకట్టుకేవీ నీళ్లు?
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామని ఊదరగొట్టిన గత వైకాపా ప్రభుత్వం జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిధుల లేమితో వెలిగల్లు జలాశయం కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో గత అయిదేళ్లుగా ఆయకట్టుదారులు సాగునీటికి కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు.
ప్రాజెక్టును గాలికొదిలేసిన గత వైకాపా సర్కారు
4 వేల ఎకరాలకు అందని సాగునీరు
ఎన్డీయే ప్రభుత్వంపైనే అన్నదాతల గంపెడాశలు
న్యూస్టుడే, రాయచోటి, గాలివీడు
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామని ఊదరగొట్టిన గత వైకాపా ప్రభుత్వం జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిధుల లేమితో వెలిగల్లు జలాశయం కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో గత అయిదేళ్లుగా ఆయకట్టుదారులు సాగునీటికి కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. జిల్లాలో ఈ ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, గత 16 ఏళ్లుగా ఎకరా భూమికి కూడా సాగునీరందించలేదు. 2008లోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా ప్రధాన కాలువల నిర్మాణంలో జాప్యం జరుగుతూ వస్తోంది. ప్రాజెక్టు నిర్మిత సమయంలోనే కుడి, ఎడమ కాలువలు తవ్వినా అప్పట్లో భారీ అవినీతి చోటుచేసుకోవడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
వెలిగల్లు ప్రాజెక్టులోని నీటిని పలుమార్లు వైకాపా నేతలు గేట్లు ఎత్తి దిగువన పాపఘ్ని నదికి వదిలేశారు. ఎన్నికల సమయంలో రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో ప్రాజెక్టు కాలువ గేట్లు ఎత్తి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం మండలాల్లోని చివరి వరకు నీరు వృథాగా వదిలేయడంతో 4.25 టీఎంసీల నీటితో నిండుకుండలా ఉండాల్సిన ప్రాజెక్టులో నీటి మట్టం భారీగా తగ్గిపోయింది. దీంతో పంటలు సాగు చేసుకునే అవకాశం లేక రైతులు దినకూలీలుగా మారాల్సిన దయనీయ పరిస్థితి నెలకొందని గాలివీడుకు చెందిన రైతు రెడ్డెయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కాలువలకు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
రూ.10 కోట్ల నిధులు ఏమయ్యాయో..?
వెలిగల్లు ప్రాజెక్టు నీటిని ఆయకట్టుకు అందించి రైతులను ఆదుకుంటామని 2019 ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా పాలకులు ప్రకటించారు. రెండేళ్ల కిందట పిల్ల కాలువల నిర్మాణానికి రూ.10 కోట్లు నిధులు మంజూరు చేశారు. పనులు దక్కించుకున్న గుత్తేదారు కొంత మేర చేసి నిలిపేశారు. ఇప్పటికే పూర్తయిన పనులకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో సగం పనులు కూడా పూర్తి కాకుండానే వెళ్లిపోయారు. ఫలితంగా ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల కింద ఉన్న 24 వేల ఎకరాల ఆయకట్టుకు చుక్కనీరందని పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టులో నీరున్నా పొలాలకు అందించే అవకాశం లేకపోవడంతో రైతులు రూ.లక్షలు వెచ్చించి బోరు బావులు వేసుకొని పంటలు సాగుచేసుకోవాల్సి వస్తోంది.
ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం
- శిరీష్కుమార్, డీఈ వెలిగల్లు ప్రాజెక్టు
వెలిగల్లు ప్రాజెక్టు కాలువల ద్వారా సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎడమ కాలువలో పూడిక తొలగింపుతోపాటు అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కుడి కాలువలో సాగునీటి సరఫరాకు ఇబ్బంది లేదు. పిల్ల కాలువల గేట్లకు మరమ్మతులు చేయించి ఆయకట్టుకు సాగునీరందిస్తాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే పనులు ప్రారంభిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలువపై కన్నేశారు.. దర్జాగా కాజేశారు!
[ 05-07-2024]
ఆయనో వైకాపా కీలక నేత... నీతివంతుడిగా అందరి ముందు చక్కగా నటిస్తారు. తానో గొప్ప వ్యక్తినని, నిత్యం ప్రజాసేవలో తరిస్తానంటూ గొప్పలు చెబుతుంటారు. -
కుంచె పోసిన ప్రాణం... సుందర గ్రామీణ జీవనం
[ 05-07-2024]
పుట్టుకతోనే ఎవరూ చిత్రకారులు కాలేరు. ఎంతో శ్రమించాలి. గురువుల శిక్షణ అవసరం. అప్పుడే పరిణితి చెందిన నైపుణ్య కళాకారులు కాగలరు. -
అభివృద్ధికి అడ్డుపడం... అక్రమాలు సహించం...!
[ 05-07-2024]
కడప నగరంలో వరదనీటి ప్రవాహ వ్యవస్ధ పనులు సకాలంలో పూర్తి కావాలి. బుగ్గవంక సుందరీకరణ పనులు సత్వరం పూర్తి చేయాలి. -
పోలీసుశాఖ స్థలాల ధారాదత్తంపై నివ్వెరపోయిన డీజీపీ
[ 05-07-2024]
కడప నగరంలోని పోలీసుశాఖ స్థలాలను వైకాపా నేతలకు ధారాదత్తం చేయడంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు నివ్వెరపోయారు. -
ఎన్సీసీ బెటాలియన్ తరలించొద్దని వినతి
[ 05-07-2024]
కడప నగర శివారు తెలుగు గంగ కాలనీలోని ఆంధ్రా బెటాలియన్ను తిరుపతికి తరలించొద్దని సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు కోరారు. -
వైకాపా పాపం... విద్యార్థులకు శాపం!
[ 05-07-2024]
బి.కోడూరు మండలం సగిలేరు అంబేడ్కర్ గురుకుల కళాశాల గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. -
మాజీ సీఎం చిత్రాలపై ఫిర్యాదు
[ 05-07-2024]
వేంపల్లె మండలం కుప్పాలపల్లెలో మాజీ సీఎం జగన్ చిత్రాలతో ఉన్న ఎండీయూ వాహనం ద్వారా ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. -
మంగంపేట గనులపై విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట గనుల్లో సుమారు రూ.2 వేల కోట్ల మేర అవకతవకలు జరిగాయని, నిధుల స్వాహాతోపాటు అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ డీజీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి లేఖ రాశారు. -
మారని పంథా... ఆగని దందా!
[ 05-07-2024]
జిల్లాలో వైకాపా నేతల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమిపాలై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీరి పంథా మారడంలేదు. -
హంద్రీనీవా కాలువకు మహర్దశ!
[ 05-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా కాలువ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు 4 వేల కోట్లతో తవ్వించిన కాలువ పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయింది. -
పరిహారం... పరిహాసం!
[ 05-07-2024]
జలాశయం నిర్మాణానికి సొంతూరిని వీడిన నిర్వాసితుల జీవితాలు దుర్భరంగా మారాయి. కనీస మౌలిక వసతుల్లేక అసౌకర్యాల మధ్య దయనీయ జీవనం అనుభవిస్తున్నారు. -
గురిపెడితే... పతకాలే
[ 05-07-2024]
రైఫిల్ షూటింగులో బుల్లెట్లా దూసుకెళుతున్నారు పసిడిపురి విద్యార్థులు. గురి పెడితే బంగారు పతకాలు రావాల్సిందే. పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రతతో పని చేస్తే దేనినైనా సాధించ వచ్చని ఆ విద్యార్థులు నిరూపిస్తున్నారు.