ఆగడం లేదు... ఆపడం లేదు!
గత వైకాపా ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడిన వైకాపా నాయకులు నేటికీ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు.
జిల్లాలోని నదుల్లో కొనసాగుతున్న వైకాపా నేతల ఇసుక దందా
న్యూస్టుడే, రాజంపేట గ్రామీణ, వీరబల్లి, రామాపురం
గత వైకాపా ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడిన వైకాపా నాయకులు నేటికీ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమి పాలై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వైకాపా నేతల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. ఇసుక మాఫియాలా తయారై రాత్రి వేళ అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వైకాపా ప్రభుత్వం అవలంభిస్తున్న ఇసుక పాలసీపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ అగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఇసుక క్వారీలను తాత్కాలికంగా మూసి వేశారు. ఈ నేపథ్యంలో రాజంపేట పట్టణానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోని చెయ్యేరు నదీతీరంలోని మందరం రేవు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోక పోవడం గమనార్హం. ట్రాక్టరు ఇసుక రూ.6 వేల నుంచి రూ.8 వేలు వరకు, టిప్పరు రూ.15 వేలు నుంచి రూ.22 వేల వరకు పలుకుతోంది.
రాజంపేట మండలం మందరం, కొత్తపల్లి, పెనగలూరు మండలం కోమంతరాజుపురం, నారాయణనెల్లూరు, నందలూరు మండలం పాటూరు, తోగురుపేట పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగుతున్నాయి. చెయ్యేరు నదిలో రాత్రి వేళల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపి టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. తాజాగా సోమవారం రాత్రి 10 గంటల నుంచి మంగళవారం ఉదయం వరకు మందరం, కొత్తపల్లి గ్రామాల వద్ద ఉన్న చెయ్యేరు నది నుంచి రాజంపేట, చిట్వేలి ప్రాంతాలకు ఇసుక తరలించారు. ఈ విషయమై రాజంపేట ఎన్ఫోర్స్మెంట్ అధికారి పవన్కుమార్ మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు అందిందని, దాడులు చేసి యంత్రాలు, వాహనాలు ఉంటే జప్తు చేస్తామన్నారు.
ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న తెదేపా నాయకులు
వీరబల్లి సమీపంలోని మాండవ్య నది నుంచి వైకాపా నాయకులు ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారని తెదేపా మండల నాయకులు అధికారులు, పోలీసులకు ఫిర్యాదులు చేశారు. తాజాగా మంగళవారం రాత్రి రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న వాహనాలను అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. రామాపురం మండలం రాచపల్లె పంచాయతీ మంగళపల్లె సమీపంలోని వంకలో ఎలాంటి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ.ప్రసాద్రెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలువపై కన్నేశారు.. దర్జాగా కాజేశారు!
[ 05-07-2024]
ఆయనో వైకాపా కీలక నేత... నీతివంతుడిగా అందరి ముందు చక్కగా నటిస్తారు. తానో గొప్ప వ్యక్తినని, నిత్యం ప్రజాసేవలో తరిస్తానంటూ గొప్పలు చెబుతుంటారు. -
కుంచె పోసిన ప్రాణం... సుందర గ్రామీణ జీవనం
[ 05-07-2024]
పుట్టుకతోనే ఎవరూ చిత్రకారులు కాలేరు. ఎంతో శ్రమించాలి. గురువుల శిక్షణ అవసరం. అప్పుడే పరిణితి చెందిన నైపుణ్య కళాకారులు కాగలరు. -
అభివృద్ధికి అడ్డుపడం... అక్రమాలు సహించం...!
[ 05-07-2024]
కడప నగరంలో వరదనీటి ప్రవాహ వ్యవస్ధ పనులు సకాలంలో పూర్తి కావాలి. బుగ్గవంక సుందరీకరణ పనులు సత్వరం పూర్తి చేయాలి. -
పోలీసుశాఖ స్థలాల ధారాదత్తంపై నివ్వెరపోయిన డీజీపీ
[ 05-07-2024]
కడప నగరంలోని పోలీసుశాఖ స్థలాలను వైకాపా నేతలకు ధారాదత్తం చేయడంపై డీజీపీ ద్వారకా తిరుమలరావు నివ్వెరపోయారు. -
ఎన్సీసీ బెటాలియన్ తరలించొద్దని వినతి
[ 05-07-2024]
కడప నగర శివారు తెలుగు గంగ కాలనీలోని ఆంధ్రా బెటాలియన్ను తిరుపతికి తరలించొద్దని సీనియర్ ఎన్సీసీ క్యాడెట్లు కోరారు. -
వైకాపా పాపం... విద్యార్థులకు శాపం!
[ 05-07-2024]
బి.కోడూరు మండలం సగిలేరు అంబేడ్కర్ గురుకుల కళాశాల గదులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. -
మాజీ సీఎం చిత్రాలపై ఫిర్యాదు
[ 05-07-2024]
వేంపల్లె మండలం కుప్పాలపల్లెలో మాజీ సీఎం జగన్ చిత్రాలతో ఉన్న ఎండీయూ వాహనం ద్వారా ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. -
మంగంపేట గనులపై విచారణ చేపట్టాలి
[ 05-07-2024]
ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట గనుల్లో సుమారు రూ.2 వేల కోట్ల మేర అవకతవకలు జరిగాయని, నిధుల స్వాహాతోపాటు అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటిపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ విజిలెన్స్ ఎన్ఫోర్సుమెంట్ డీజీకి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి లేఖ రాశారు. -
మారని పంథా... ఆగని దందా!
[ 05-07-2024]
జిల్లాలో వైకాపా నేతల దందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ఓటమిపాలై ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వీరి పంథా మారడంలేదు. -
హంద్రీనీవా కాలువకు మహర్దశ!
[ 05-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా కాలువ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సుమారు 4 వేల కోట్లతో తవ్వించిన కాలువ పూర్తిస్థాయిలో ఆదుకోలేకపోయింది. -
పరిహారం... పరిహాసం!
[ 05-07-2024]
జలాశయం నిర్మాణానికి సొంతూరిని వీడిన నిర్వాసితుల జీవితాలు దుర్భరంగా మారాయి. కనీస మౌలిక వసతుల్లేక అసౌకర్యాల మధ్య దయనీయ జీవనం అనుభవిస్తున్నారు. -
గురిపెడితే... పతకాలే
[ 05-07-2024]
రైఫిల్ షూటింగులో బుల్లెట్లా దూసుకెళుతున్నారు పసిడిపురి విద్యార్థులు. గురి పెడితే బంగారు పతకాలు రావాల్సిందే. పట్టుదల, క్రమశిక్షణ, ఏకాగ్రతతో పని చేస్తే దేనినైనా సాధించ వచ్చని ఆ విద్యార్థులు నిరూపిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
-
‘మీర్జాపూర్’ ఎంతో ప్రేక్షకాదరణ పొందింది.. వాటిని పట్టించుకోవద్దు: విజయ్ వర్మ
-
అమరావతి నిర్మాణానికి తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విరాళం
-
బుమ్రాను ఎనిమిదో వింతగా గుర్తించాలి: పిటిషన్పై సంతకం చేస్తానన్న కోహ్లీ
-
పెద్ద అంబర్పేట సమీపంలో పోలీసుల కాల్పులు