logo

రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు తగవు

లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ భారతీయ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్‌ డిమాండు చేశారు.

Published : 03 Jul 2024 03:29 IST

కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ భారతీయ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్‌ డిమాండు చేశారు. హిందువులపై రాహుల్‌గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం కడప అంబేడ్కర్‌ కూడలి వద్ద బీజేవైఎం, భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. విజయ్‌ మాట్లాడుతూ  పార్లమెంటులో రాహుల్‌గాంధీ హిందువులను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదన్నారు. భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు పవన్, ప్రవీణ్‌నాయుడు తదితరులున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని