వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!
గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు.
నిద్ర మత్తులో జిల్లా పరిషత్ యంత్రాంగం
కొత్త ప్రభుత్వం రాకతో గుత్తపత్రాలకు ఆహ్వానం
గండికోట జలాశయంలో ముద్దనూరు తాగునీటి పథకం
న్యూస్టుడే, కడప, కొండాపురం: గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. నిర్దేశిత ఒప్పందం గడువు ముగిసేలోపు మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉంది. ఈసారి జిల్లా పరిషత్తు ఉన్నతాధికారులు ఈ మాటను మరిచారు. గత వైకాపా పాలన అధికారంలో ఉన్న సమయంలో ఈ ఏడాది జనవరి 20న పరిపాలన అనుమతిచ్చారు. అనంతరం అప్పట్లో అధికార పార్టీ కీలక నేతల నుంచి ఒత్తిడి రావడంతో పక్కన పెట్టేశారు. జడ్పీలో చక్రం తిప్పుతున్న కీలక అధికారి నిర్వాకంతో రూ.కోట్లు విలువ చేసే పనులను సకాలంలో గుత్తేదారులకు అప్పగించలేని దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో నిద్రపోయారు. ఎన్డీయే అధికారంలోకి రావడంతో ఇప్పుడేమో తెగ హడావుడి చేస్తున్నారు. ఇదే ఇప్పుడు అధికారుల్లో చర్చనీయాంశమైంది. ఉమ్మడి కడప జిల్లాలో సీపీడబ్ల్యూ పథకాలు 22 ఉన్నాయి. వీటి ద్వారా 1,096 గ్రామాల్లో నివాసం ఉంటున్న అయిదు లక్షల మందికి శుద్ధి జలాలు సరఫరా చేయాల్సి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో నిర్వహణ కోసం రూ.13.06 కోట్లు కావాలని అంచనా వేశారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి మార్చి వరకు ఏడాది పాటు గడువు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ సాంకేతిక నిపుణులు అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించాలి. జిల్లా పరిషత్తు అధికారులు పరిపాలన అనుమతిచ్చి టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఈసారి ముందస్తుగానే జనవరి 20న జడ్పీలో నిర్వహణ కోసం రూ.13.66 కోట్లు, కరెంటు బిల్లుల చెల్లించడానికి మరో రూ.16.06 కోట్లు చెల్లించడానికి పాలనామోదం ఇచ్చారు. వెంటనే ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగం నుంచి ఏ స్కీంలో ఏ పనులు చేయడానికి ఎంత సొమ్ము కావాలని అంచనాలు (ఎస్టిమెట్లు) తెప్పించి టెండర్లు పిలవాలనే మాటను మరిచారు.
సార్వత్రిక పోరు సాకు
సార్వత్రిక పోరు రావడంతో టెండర్లు పిలవడానికి వీలు కాలేదని జడ్పీ యంత్రాంగం చెబుతోంది. ఈ ఏడాది జనవరి 20న పరిపాలనమోదం ఇవ్వగా మార్చి 16న ఎన్నికల కోడ్ కూసింది. ఈ మధ్యలో 55 రోజులు ఉంది. మరి ఇన్నాళ్లు ఏం చేశారు, ఎందుకు టెండర్లు పిలవలేదని ప్రశ్నిస్తే జడ్పీ యంత్రాంగం నోరు మెదపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ గుత్తపత్రాలను పిలవలేదు కదా అంటూ దాటవేసే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఎన్నికలను సాకు చూపడం జడ్పీ యంత్రాంగం చేతగానితనానికి నిదర్శనం. క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షణ చేస్తున్న తాగునీటి సరఫరా శాఖ, జడ్పీ అధికారుల పనితీరు చూస్తే ఎవరిదారి వారిదే అన్నట్లు ఉంది. రెండు విభాగాల యంత్రాంగం మధ్య అసలు సమన్వయం లేదు. అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపడం వరకే మా పని. టెండర్లు పిలిచి పనులు పొందిన గుత్తేదారుతో జడ్పీ అధికారులు ఒప్పందం చేసుకుంటే తర్వాత పర్యవేక్షణ చేయడం మా విధి అంటున్నారు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు.
ఒంటిమిట్ట మండలం కొండమాచుపల్లె శివారులో కొత్తమాధవరం తాగునీటి పథకం పంపుహౌస్
కొత్త ప్రభుత్వం రాకతో...
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడంతో ఎట్టకేలకు ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 22 సీపీడబ్ల్యూ స్కీంల నిర్వహణకు గత నెల 25న రూ.13.06 కోట్లకు అనుమతిచ్చారు. ఈ మేరకు టెండర్లు పిలిచారు. మాధవరం-1 రూ.41 లక్షలు, పొందలూరు రూ.42 లక్షలు, కమలాపురం రూ.42 లక్షలు, వేంపల్లె రూ.43.50 లక్షలు, పులివెందుల అప్ల్యాండ్స్ రూ.48 లక్షలు, గాలివీడు రూ.53 లక్షలు, వైవీయూ రూ.63 లక్షలు, బ్రహ్మంగారిమఠం రూ.65 లక్షలు, కొండాపురం రూ.69 లక్షలు, ముద్దనూరు రూ.80.5 లక్షలు, మైలవరం రూ.92 లక్షలు, మైదుకూరు రూ.105 లక్షలు, పులివెందుల రూ.145 లక్షలు, లక్కిరెడ్డిపల్లె పథకానికి రూ.226 లక్షలకు అనుమతిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఏప్రిల్, మే, జూన్ నెలలు కరిగిపోయాయి. వచ్చే నెల నుంచి 2025 మార్చి వరకు తొమ్మిది నెలలే మిగిలి ఉంది. మరి టెండర్లు వచ్చే ఏడాది మార్చి వరకు నిర్వహిస్తారా, అదనపు గడువు ఇస్తారా అనేది గుత్తేదారుల్లో చర్చ జరుగుతోంది.
నాటి పాలకుల వైఫల్యాలివి
వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో తాత్కాలికంగా టెండర్లు పిలవకుండా ఆపేశారు. వాస్తవంగా ఈ ఏడాది మార్చి 31 లోపు గుత్తపత్రాలు పిలవాలి. ఎవరైతే తక్కువ నమోదు చేస్తారో నిబంధనలను అనుసరించి వారిని ఎంపిక చేసి ఏప్రిల్ 1 నుంచి గుత్తేదారులకు బాధ్యతలు అప్పగించాలి. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా పనులు దక్కించుకోవడానికి పోటీపడి తక్కువగా (లెస్ ఎక్కువ) నమోదు చేస్తే తమ వర్గీయులకు నిర్వహణ బాధ్యతలు దక్కవని వైకాపా నాయక గణం కొత్త ఎత్తుగడ వేసింది. సార్వత్రిక ఎన్నికల వరకు నెట్టుకు రావాలని ఉన్నతస్థాయి నుంచి మౌఖీక ఆదేశాలు రావడంతో మనోళ్లు కూడా కాదనకుండా తలాడించేశారు. జిల్లా పరిషత్తులో కీలక అధికారి అంతాతానై కథ నడిపిస్తున్నారు.
అయిదేళ్లూ వేధింపులే
వైకాపా ప్రభుత్వం (2019-2024) పాలనలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొంతమంది గుత్తేదారులు ముందుకొస్తే వారిని దరిదాపుల్లోకి రాకుండా అధికార పార్టీ నాయకులు భయపెట్టారు. మా సామ్రాజ్యంలో సీపీడబ్ల్యూ స్కీం నిర్వహణ దక్కించుకొంటే పనులు చేయలేవు. మీ పైన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. బిల్లులు రాకుండా అడ్డుకుంటాం అంటూ ఆయా ప్రాంతంలోని వైకాపా నేతలు హెచ్చు స్వరంతో మాట్లాడటంతో చాలామంది వెనకడుగు వేశారు. కొంతమంది టెండరు వేసినా ఒత్తిడి తట్టుకోలేక, వేధింపులు భరించలేక చేతికొచ్చిన పనులను అధికార పార్టీకి వారికే కట్టబెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
అంచనాలు రావడంలో జాప్యంతోనే : ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న 22 సీపీడబ్ల్యూ పథకాలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ కోసం ఈ ఏడాది జనవరిలో పరిపాలన అనుమతిచ్చాం. ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారుల నుంచి పథకం వారీగా ఏ పనులను చేయాలి, ఇందుకోసం రూ.ఎన్ని లక్షలు కావాలో అంచనాలు రూపొందించి సకాలంలో ప్రతిపాదనలు అందించలేదు. ఈ కారణంగా ముందస్తుగా టెండర్లు పిలవలేకపోయాం. ఈలోపు సార్వత్రిక ఎన్నికలు రావడంతో గుత్తపత్రాలను ఆహ్వానించలేకపోయాం. గత వారం టెండర్లు పిలవడానికి ఉత్తర్వులిచ్చాం.
సుధాకర్రెడ్డి, సీఈవో, జిల్లా పరిషత్తు, కడప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రి భవనానికి రూ.కోట్లు... తెరిచిన ఆరు నెలలకే తూట్లు...!
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయనడానికి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలే నిదర్శనం. -
పెచ్చులూడిన పాఠశాల భవనం పైకప్పు!
[ 03-07-2024]
కడప నగరంలోని ఐటీఐ కూడలి సమీపంలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో మంగళవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడిన ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. -
నాడేమో మమకారం.. నేడేది సహకారం?
[ 03-07-2024]
అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శం. ఈ రోజు సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణం. -
ఎండీయూ వాహనాల తనిఖీ
[ 03-07-2024]
చౌక దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం, వాటిని కూడా ఆలస్యంగా అందజేయడం, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో జేసీ గణేష్కుమార్, డీఎస్వో చాముండేళ్వరీ మంగళవారం ఎండీయూ వాహనాలను తనిఖీ చేశారు. -
నేల ఆరోగ్యానికి భరోసా!
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ పాలనలో భూసార పరీక్షలపై అంతులేని నిర్లక్ష్యం చేశారు. మాది రైతురాజ్యం అంటూ గొప్పగా ప్రచారం చేసిన జగన్మోహన్రెడ్డి ఏలుబడిలో కాసులివ్వకుండా దగా చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. -
వెలిగల్లు.. ఆయకట్టుకేవీ నీళ్లు?
[ 03-07-2024]
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామని ఊదరగొట్టిన గత వైకాపా ప్రభుత్వం జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిధుల లేమితో వెలిగల్లు జలాశయం కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో గత అయిదేళ్లుగా ఆయకట్టుదారులు సాగునీటికి కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. -
ఆగడం లేదు... ఆపడం లేదు!
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడిన వైకాపా నాయకులు నేటికీ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. -
ప్రమాద వంతెన... ప్రయాణ యాతన!
[ 03-07-2024]
పోరుమామిళ్ల - మైదుకూరు ప్రధాన రహదారిలోని వంకమర్రి సగిలేరు వంతెన శిథిలావస్థకు చేరింది. కాంక్రీటు లేచి గుంతలేర్పడ్డాయి. -
విద్యారంగ పరిరక్షణకు వినతి
[ 03-07-2024]
విద్యారంగం పరిరక్షణకు సహకరించాలని కోరుతూ కడప నగరంలో మంగళవారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డికి యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. -
కర్ర తిప్పుతూ.. కత్తి దూస్తూ
[ 03-07-2024]
మన సంప్రదాయ యుద్ధ కళలైన కర్రసాము, కత్తిసాముల్లో యువతులు సత్తా చాటుతున్నారు. ఇది వారికి స్వీయ రక్షణతో పాటు, శారీరక దృఢత్వం, క్రమ శిక్షణను పెంపొందించడానికి దోహదపడుతుంది. -
తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు
[ 03-07-2024]
విజయవాడ రైలునిలయం సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమల ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు (వారం రోజుల పాటు) రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టరు ఎ.జనార్దన్ తెలిపారు. -
విద్యార్థినుల అస్వస్థత ఘటనలో బాధ్య హెచ్ఎం సస్పెన్షన్
[ 03-07-2024]
కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై బాలికల ఉన్నత పాఠశాల బాధ్య ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేశారు. -
రాహుల్గాంధీ వ్యాఖ్యలు తగవు
[ 03-07-2024]
లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ భారతీయ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ డిమాండు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో.. పోలీసుల అదుపులో పలువురు నిందితులు
-
జగన్ బినామీ స్వరూపానందేంద్ర: పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి
-
మల్రెడ్డి.. దానం.. ఎవరో ఒకరికి స్థానం!
-
మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి వీరంగం
-
వైకాపా నిర్వాకంతో ఆర్థిక సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్: ఎంపీ బైరెడ్డి శబరి