logo

జాతీయ లోక్‌ అదాలత్‌లో జిల్లాకు రెండోస్థానం

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు.

Published : 01 Jul 2024 03:34 IST

కడప న్యాయవిభాగం, న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. మొత్తం 2367 కేసులు పరిష్కారమయ్యాని, పరిహారంగా రూ.16,57,23,983 బాధితులకు ఇచ్చేందుకు ఆవార్డులు మంజూరు చేశామని వివరించారు. ఇందుకు సహకరించిన న్యాయవాదులు, రెవెన్యూ, పోలీసు, ఇన్యూరెన్స్, బ్యాంకు చిట్‌ ఫండ్‌ అధికారులు, సిబ్బందికి ఛైర్‌పర్సన్‌ శ్రీదేవి, సీనియర్‌ జడ్జి బాబా ఫకృద్దీన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని