మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బోధిస్తున్న ఉపాధ్యాయుడు
కడప విద్య, మదనపల్లె విద్య, న్యూస్టుడే : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైకాపా పాలనలోని అయిదు సంవత్సరాల్లో ఒక్క టీచరు పోస్టు కూడా భర్తీ చేయకపోవడంతో చాలా మంది డీఎస్సీ పూర్తి చేసి టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉద్యోగావకాశాలు లేక ఇబ్బందులు పడ్డారు. కొంతమంది ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తుండగా చాలా మంది వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఎన్నికల ముందు వైకాపా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6 వేల పోస్టులు భర్తీ చేస్తామని నోటిఫికేషన్ ఇచ్చింది. అది కూడా ఎన్నికల కోడ్ ముందు ఇవ్వడంతో అది కాస్త పెండింగ్ పడిపోయింది. దీంతో ఎంతోమంది దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆశపై నీళ్లు చల్లినట్లైంది. తాము అధికారంలోకి వస్తూనే తొలి సంతకం మెగా డీఎస్సీపై పెడతామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన ఇచ్చిన మాట మేరకు బాధ్యతలు తీసుకున్న రోజే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేసి 16,347 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కంటే రెండు రెట్లు అధికంగా పోస్టులు భర్తీ చేస్తుండటంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. ఎలాగైనా తాము డీఎస్సీలో ఉద్యోగం పొందాలని చూస్తున్నారు. జులై 1వ తేదీన ప్రకటన వెలువడనుండటంతో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు.
గొడ్డలిపెట్టుగా జీవో 117 : జీవో నెంబర్ 117 అమలు, పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు పేరేదైనా వైకాపా ప్రభుత్వ హయాంలో పాఠశాల విద్య ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలపై విధ్వంసం జరిగింది. వీటి పేరుతో అనేక పాఠశాలలు మూసివేయడం, ఎస్జీటీ పోస్టులను పూర్తిగా లేకుండా చేయడం తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని ఉపాధ్యాయ లోకం ఎంత ఆవేదన వ్యక్తం చేసినా, రోడ్డెక్కి గళమెత్తినా ఏ మాత్రం పట్టించుకున్న పాపానపోలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం, మెగా డీఎస్సీ ప్రకటనలతో విద్యాశాఖ, ఉపాధ్యాయుల్లో ఆశలు చిగురించాయి. ప్రాథమిక విద్య గాడిలో పడేందుకు ప్రస్తుత ప్రభుత్వం తగిన చర్యలతో ముందుకెళ్లనుందని వారంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ చర్యలతో ఎస్జీటీ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న విషయంపై శాఖలో సందిగ్ధం నెలకొంది. ప్రభుత్వ చర్యలతో వీటి సంఖ్య తేలనుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ జిల్లాలో బయాలజీ 21, ఆంగ్లం 33, హిందీ 35, గణితం 42, ఫిజికల్ ఎడ్యుకేషన్ 63, ఫిజికల్ సైన్స్ 19, సాంఘిక శాస్త్రం 28, తెలుగు 59 ఉర్దూ 3 చొప్పున స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికార వర్గాల సమాచారం.
ఎన్నాళ్లో వేచిన ఉదయం
అయిదు సంవత్సరాలు డీఎస్సీ నోటిపికేషన్ విడుదల కాక ఎంతో మంది డీఎస్సీ అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తూనే మెగా డీఎస్సీపై సంతకం చేయడం చాలా సంతోషంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో చంద్రబాబును మించిన నాయకుడు లేడు. నిరుద్యోగుల కష్టాలు ఆయనకు మాత్రమే తెలుసుకాబట్టి మెగా డీఎస్సీ విడుదల చేశారు. ఉపాధ్యాయుడు కావాలన్నదే నా లక్ష్యం.
శ్రీనివాసులు, డీఎస్సీ అభ్యర్థి, మదనపల్లె
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసుపత్రి భవనానికి రూ.కోట్లు... తెరిచిన ఆరు నెలలకే తూట్లు...!
[ 03-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో చేపట్టిన పనులు నాసిరకంగా ఉన్నాయనడానికి కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనాలే నిదర్శనం. -
పెచ్చులూడిన పాఠశాల భవనం పైకప్పు!
[ 03-07-2024]
కడప నగరంలోని ఐటీఐ కూడలి సమీపంలో వైకాపా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి చెందిన సాయిబాబా పాఠశాలలో మంగళవారం తరగతి గది పైకప్పు పెచ్చులూడిన ప్రమాదంలో 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. -
నాడేమో మమకారం.. నేడేది సహకారం?
[ 03-07-2024]
అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శం. ఈ రోజు సొంత గడ్డపై ముఖ్యమంత్రిగా నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణం. -
ఎండీయూ వాహనాల తనిఖీ
[ 03-07-2024]
చౌక దుకాణాల ద్వారా కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం, వాటిని కూడా ఆలస్యంగా అందజేయడం, అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో జేసీ గణేష్కుమార్, డీఎస్వో చాముండేళ్వరీ మంగళవారం ఎండీయూ వాహనాలను తనిఖీ చేశారు. -
నేల ఆరోగ్యానికి భరోసా!
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ పాలనలో భూసార పరీక్షలపై అంతులేని నిర్లక్ష్యం చేశారు. మాది రైతురాజ్యం అంటూ గొప్పగా ప్రచారం చేసిన జగన్మోహన్రెడ్డి ఏలుబడిలో కాసులివ్వకుండా దగా చేశారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. -
వెలిగల్లు.. ఆయకట్టుకేవీ నీళ్లు?
[ 03-07-2024]
సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేస్తున్నామని ఊదరగొట్టిన గత వైకాపా ప్రభుత్వం జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నిధుల లేమితో వెలిగల్లు జలాశయం కాలువల నిర్మాణం పూర్తి చేయకపోవడంతో గత అయిదేళ్లుగా ఆయకట్టుదారులు సాగునీటికి కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తున్నారు. -
ఆగడం లేదు... ఆపడం లేదు!
[ 03-07-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు పాల్పడిన వైకాపా నాయకులు నేటికీ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. -
ప్రమాద వంతెన... ప్రయాణ యాతన!
[ 03-07-2024]
పోరుమామిళ్ల - మైదుకూరు ప్రధాన రహదారిలోని వంకమర్రి సగిలేరు వంతెన శిథిలావస్థకు చేరింది. కాంక్రీటు లేచి గుంతలేర్పడ్డాయి. -
విద్యారంగ పరిరక్షణకు వినతి
[ 03-07-2024]
విద్యారంగం పరిరక్షణకు సహకరించాలని కోరుతూ కడప నగరంలో మంగళవారం ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డికి యూటీఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు. -
కర్ర తిప్పుతూ.. కత్తి దూస్తూ
[ 03-07-2024]
మన సంప్రదాయ యుద్ధ కళలైన కర్రసాము, కత్తిసాముల్లో యువతులు సత్తా చాటుతున్నారు. ఇది వారికి స్వీయ రక్షణతో పాటు, శారీరక దృఢత్వం, క్రమ శిక్షణను పెంపొందించడానికి దోహదపడుతుంది. -
తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు
[ 03-07-2024]
విజయవాడ రైలునిలయం సమీపంలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న నేపథ్యంలో తిరుమల ఎక్స్ప్రెస్ రైలును ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు (వారం రోజుల పాటు) రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టరు ఎ.జనార్దన్ తెలిపారు. -
విద్యార్థినుల అస్వస్థత ఘటనలో బాధ్య హెచ్ఎం సస్పెన్షన్
[ 03-07-2024]
కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటనపై బాలికల ఉన్నత పాఠశాల బాధ్య ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేశారు. -
రాహుల్గాంధీ వ్యాఖ్యలు తగవు
[ 03-07-2024]
లోక్సభలో ప్రతిపక్షనేత రాహుల్గాంధీ భారతీయ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ డిమాండు చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు