logo

మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌

అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి అన్నారు.

Published : 01 Jul 2024 03:03 IST

ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణకు హాజరైన తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి, నాయకులు 

పెద్దముడియం, న్యూస్‌టుడే: అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం కొండసుంకేసుల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడా. తెలుగుజాతికి, తెలుగుభాషకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఎస్‌ఆర్‌బీసీ కాలువ పూర్తి చేపించాలని, పంట కాలువలకు రహదారులు, ప్రస్తుతం ఉన్న బస్సు సర్వీసులను అదనంగా పెంచాలంటూ, పింఛన్లు, పలు రకాల సమస్యలను గ్రామస్థులు భూపేష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తప్పకుండా ఈ సమస్యలు పరిష్కరించేలా చూస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు ధనిరెడ్డి కొండారెడ్డి, తెదేపా నేతలు కోట శంకర్‌రెడ్డి, బాసం మహేశ్వరరెడ్డి, కైఫా అశోక్‌వర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మేడగం వెంకటరామిరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, భూమిరెడ్డి నాగిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని