కరెంట్ కష్టాల్లో కర్షకులు
2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరా చేస్తామని ఊరూరా ప్రచారం చేశారు.
వ్యవసాయానికి ఏడు గంటలే విద్యుత్తు
సరఫరాలో అంతరాయాలతో అవస్థలు
తొమ్మిది గంటలివ్వాలంటూ వేడుకోలు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై గంపెడాశలు
2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో జగన్ వ్యవసాయానికి తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరా చేస్తామని ఊరూరా ప్రచారం చేశారు. ప్రజా మద్దతుతో అధికారంలోకి వచ్చిన అనంతరం మాట మార్చేశారు. మడమ తిప్పేశారు. వాస్తవంగా ఒకే విడతలో ఏడు గంటలు సరఫరా చేయడమే గగనమైంది. దీనికితోడు అప్రకటిత కోతలు మరింత వేదనకు గురి చేయడంతో అన్న దాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలకు సకాలంలో నీటితడులు అందించడానికి నానా తంటాలు పడుతున్నారు.
న్యూస్టుడే, కడప
ఉమ్మడి కడప జిల్లాలో 1,88,837 వ్యవసాయ సర్వీసులున్నాయి. దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ పర్యవేక్షణలో ఉన్న కడప డివిజన్లో 10,745, ప్రొద్దుటూరులో 24,092, పులివెందులలో 32,187, రాయచోటిలో 33,133, రాజంపేటలో 43,873, మైదుకూరులో 44,807 కనెక్షన్లు ఉన్నాయి. పంటల సాగుకు విద్యుత్తు సరఫరా కోసం 857 ఫీడర్లను ఏర్పాటు చేశారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత వైకాపా పాలనలో చోటుచేసుకున్న విధానపరమైన లోపాలను సరిదిద్దే పనిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిమగ్నమయ్యారు. ఖరీఫ్లో కరెంటు కష్టాలు రాకుండా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని కర్షకులు కోరుతున్నారు. పెన్నానది, చిత్రావతి, పాపఘ్ని, సగిలేరు, కుందూ, చెయ్యేరు, గుంజనేరు, పింఛ నదుల పరివాహక ప్రాంతంలో రైతులు విస్తారంగా పంటలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పైర్లకు సకాలంలో నీరందాలంటే ప్రస్తుతం ఇస్తున్న ఏడు గంటల విద్యుత్తు చాలడం లేదు. అన్ని ఫీడర్లలో కాకపోయినా ఎక్కువగా అవసరమైన ప్రాంతాల్లో తొమ్మిది గంటల పాటు విద్యుత్తు సరఫరా చేయాలని కర్షకులు కోరుతున్నారు. ఎస్పీడీఎసీల్ అధికారులను కలిసి ఇప్పుడు ఇస్తున్న ఏడు గంటలే కాకుండా అదనంగా మరో రెండు గంటలు ఇవ్వాలని రైతులు విన్నవిస్తున్నారు. ఇప్పుడు ఏ గ్రూపులో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, బి గ్రూపులో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరఫరా చేస్తున్నారు. మోస్తరుగా వర్షం కురిసినా, గాలి వీచినా, సాంకేతిక లోపాలు తలెత్తినా విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో రైతులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. తాము కోల్పోయిన విద్యుత్తును తిరిగి ఇవ్వడం లేదని రైతులు ఆక్రోశిస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం
వ్యవసాయానికి ఒకే విడతలో తొమ్మిది గంటలు విద్యుత్తు సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఏడు గంటలు సరఫరా చేస్తున్నాం. అదనంగా మరో రెండు గంటలు కావాలని అన్నదాతల నుంచి వస్తున్న అభ్యర్థనలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. ఉన్నతస్థాయి నుంచి అనుమతి రాగానే 9 గంటలు ఇస్తాం. సరఫరాలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటాం.
రమణ, ఎస్ఈ, ఎస్పీడీసీఎల్, కడప
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యం వధ.. ధర్మం చెర!
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. -
శీతంపేటలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
[ 01-07-2024]
అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని తాటిగుంటపల్లి పంచాయతీ శీతంపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెరిగిన దిగుబడులు దిగుతున్న టమాట ధరలు
[ 01-07-2024]
మార్కెట్ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి. -
రహదారి కబ్జా... సాగుతో దర్జా
[ 01-07-2024]
మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. -
వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!
[ 01-07-2024]
గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు రెండోస్థానం
[ 01-07-2024]
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. -
ఇంటి వద్దకే నడిపింఛను
[ 01-07-2024]
ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు. -
అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!
[ 01-07-2024]
జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. -
మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
[ 01-07-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పోలేరమ్మకు బోనాలు
[ 01-07-2024]
పెద్దకప్పలపల్లెలో ఆదివారం పోలేరమ్మకు బోనాలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. -
మూడేళ్లుగా నిర్లక్ష్యం...లీకేజీలతో సతమతం
[ 01-07-2024]
అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది. -
మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
[ 01-07-2024]
అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/07/24)
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్