బద్వేలు... భూదందాలు!
గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా బద్వేలు నియోజకవర్గంలో భూదందాలు సాగాయి.
ఎక్కడా లేనంతగా ఆక్రమణలు
సిట్ ఏర్పాటు దిశగా సన్నాహాలు
గతంలో చంద్రబాబు, లోకేశ్ హామీ
కొత్త సర్కారుపైనే బాధితుల ఆశలు
బద్వేలు-పోరుమామిళ్ల మార్గంలో చదును చేసిన ప్రభుత్వ భూమి
బద్వేలు నియోజకవర్గంలో వైకాపా నేతలు భూదందాలు సాగించారు. ప్రభుత్వ భూములతోపాటు పేదలకు చెందినవీ కాజేశారు. వీటిపై తెదేపా అధికారంలోకి రాగానే విచారణ కమిటీ నియమించి ఆక్రమిత భూముల్ని వెనక్కి తీసుకుని బాధితులకు పంచి పెడతాం. భూఆక్రమణలకు వత్తాసు పలుకుతున్న అధికారులను వదిలిపెట్టం.
బద్వేలులో గతేడాది ఏప్రిల్ 19న జరిగిన తెదేపా విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబునాయడు
బద్వేలు నియోజకవర్గంలో వైకాపా నేతల వారీగా భూదందాల వివరాలను ప్రకటించారు. ప్రభుత్వ భూములను భారీ ఎత్తున కాజేశారు. వీటన్నింటిపై విచారణ చేపట్టి వెనక్కి తీసుకుంటాం. నకిలీ పత్రాలను సృష్టించి ప్రైవేటు భూములను లాక్కున్నారు. వీటిపైనా విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేస్తాం.
గతేడాది జూన్ 12న బద్వేలు పాదయాత్ర సభలో నారా లోకేశ్ హామీ
ఈనాడు, కడప: గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా బద్వేలు నియోజకవర్గంలో భూదందాలు సాగాయి. వైకాపా నేతలు వేలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను కాజేశారు. పేదలకు చెందిన భూములు చాలావరకు వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇందుకోసం నకిలీ పట్టాలు సృష్టించే ముఠా సైతం నియోజకవర్గంలో పట్టుబడింది. కేసును రాజకీయ నేతల అండదండలతో నిర్వీర్యం చేశారు. నకిలీ పట్టాల ఆధారంగా క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు చేయడం సాగించారు. వైకాపాకు చెందిన కీలక నేతలు, వారి పీఏలు దందా సాగించారు. రూ.కోట్ల విలువైన సంపదను వెనకేసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి మండలంలోనూ భూ ఆక్రమణలు ఇష్టారాజ్యంగా సాగాయి. బద్వేలు, గోపవరం, బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, అట్లూరు మండలాల్లో ప్రభుత్వ భూములను నేతలు కాజేశారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములను ఆక్రమించుకున్న దాఖలాలున్నాయి. నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అక్రమంగా ప్రవేశించడం, వారికి రెవెన్యూ అధికారులు వత్తాసు పలికారు. వందలాది మంది బాధితులు రోడ్డున పడ్డారు. నియోజకవర్గంలో జాతీయ రహదారుల విస్తరణ, కొత్తగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటి కోసం చేపట్టిన భూసేకరణలోనూ అక్రమాలు జరిగాయి. ఒకరి స్థానంలో మరొకరికి పరిహారం అందజేశారు. ప్రభుత్వ భూములకు సైతం పరిహారం చెల్లించిన దాఖలాలున్నాయి. ఇలాంటి అక్రమాలు, ఆక్రమణల తరుణంలో ఎన్నికలు రావడం, వైకాపా ప్రభుత్వం అధికారం కోల్పోవడం, తెదేపా చేతికి అధికార పగ్గాలు రావడంతో బాధితులకు ధైర్యం వచ్చింది. తమకు న్యాయం జరుగుతుందనే ధైర్యంతో ఉన్నారు. ఇదే తరుణంలో తెదేపా నియోజకవర్గ నేత రితీష్రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ దృష్టికి వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ప్రభుత్వం కాస్త కుదుట పడిన వెంటనే సిట్ లేదా.. దాని సమాన స్థాయి విచారణ కమిటీని నియమించి దర్యాప్తు చేయిస్తామనే హామీ ఇచ్చారు. ఈ మేరకు త్వరలో కార్యరూపం దాల్చేవిధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యం వధ.. ధర్మం చెర!
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. -
శీతంపేటలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
[ 01-07-2024]
అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని తాటిగుంటపల్లి పంచాయతీ శీతంపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెరిగిన దిగుబడులు దిగుతున్న టమాట ధరలు
[ 01-07-2024]
మార్కెట్ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి. -
రహదారి కబ్జా... సాగుతో దర్జా
[ 01-07-2024]
మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. -
వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!
[ 01-07-2024]
గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు రెండోస్థానం
[ 01-07-2024]
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. -
ఇంటి వద్దకే నడిపింఛను
[ 01-07-2024]
ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు. -
అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!
[ 01-07-2024]
జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. -
మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
[ 01-07-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పోలేరమ్మకు బోనాలు
[ 01-07-2024]
పెద్దకప్పలపల్లెలో ఆదివారం పోలేరమ్మకు బోనాలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. -
మూడేళ్లుగా నిర్లక్ష్యం...లీకేజీలతో సతమతం
[ 01-07-2024]
అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది. -
మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
[ 01-07-2024]
అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు.