logo

వ్యాయామోపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ఉమ్మడి కడప జిల్లాలో వ్యాయామోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి సంఘం ప్రతినిధులు కోరారు.

Published : 29 Jun 2024 03:19 IST

 మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న వ్యాయామోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు

కడప క్రీడలు, న్యూస్‌టుడే : ఉమ్మడి కడప జిల్లాలో వ్యాయామోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి సంఘం ప్రతినిధులు కోరారు. రాయచోటిలో శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూజీపీఈడీ డిగ్రీ అర్హత ఉన్న ఉపాధ్యాయులను ఒక ఏడాది బ్రిడ్జి కోర్సు ఏర్పాటు చేసి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కల్పించాలన్నారు. రైల్వే, ఆర్టీసీ బస్సులో క్రీడాకారులకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని, జీవో 117ను రద్దు చేసి ఉన్నత పాఠశాలల్లో పీఈటీ పోస్టులను పునరుద్ధరించాలని వారంతా విన్నవించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని