వైకాపాతో అంటకాగిన ఆర్టీసీ అధికారులు
వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఆర్టీసీలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించారు.
చిన్నచౌకు (కడప), న్యూస్టుడే : వైకాపా ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఆర్టీసీలో కొంతమంది అధికారులు, ఉద్యోగులు వైకాపా కార్యకర్తల్లా వ్యవహరించారు. వీరికి ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వారికి వేరే విధులు కేటాయించడం, బదిలీ చేయడం, కేసులు నమోదు చేయడం లాంటివి ఘటనలు చోటుచేసుకోగా, నేతల మద్దతు ఉంటే విధులకు వెళ్లకపోయినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. కడప ఆర్టీసీ డిపోలో వైకాపా మద్దతుతో కండక్టరు స్థాయిలోని ఓ ఉద్యోగి డిపోను తన చేతుల్లో పెట్టుకున్నారు. చివరకు అధికారులు కూడా ఆయన చెప్పినట్లే వ్యవహరించిన దాఖలాలున్నాయి. ఎన్నికల సందర్భంగా ఏకంగా కొంతమంది రాష్ట్రస్థాయి ఉద్యోగులు కడప బస్టాండు, గ్యారేజీకి వచ్చి వైకాపాకు ఓట్లేయాలని ప్రచారం చేశారు. ఇందులో కడప డిపో అధికారులు, ఉద్యోగులు సైతం పాల్గొన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి చివరకు సస్పెన్షన్లకు గురయ్యారు. ఇలా ప్రచారం చేయడం తప్పు అని ఉన్నతాధికారులు వారిని వారించలేదు. కడప డిపోలో కొంత మంది చిన్నస్థాయి అధికారులు కూడా వైకాపాకు చెందిన సంఘం నాయకులు చెప్పినట్లు విని తమ పనులు కూడా చేయించుకున్నారు.
ఆర్టీసీ ఆసుపత్రిలో అంతా ఆయన మనుషులే : వైకాపా అధికారంలోకి వచ్చాక కడపకు చెందిన ఓ నాయకుడు ఆర్టీసీలో రాష్ట్రస్థాయి పదవి పొందారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఆసుపత్రిలో ఎక్కువగా ఆయనకు కావాల్సిన వారే ఉద్యోగాలు పొందారు. అప్పటివరకు అక్కడ పనిచేస్తున్న వారిని ఏదో ఒక సాకు చూపించి బయటకు పంపించేశారు. ఎలాంటి అర్హత లేకపోయినప్పటికీ తన అనుచరులను వివిధ పోస్టుల్లో నియమించుకున్నారు. జిల్లా స్థాయి అధికారులకు తెలిసినా ఆయన చెప్పారని ఉద్యోగాల్లో చేర్చుకున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎక్కువ మంది సదరు నాయకుడి అనుచరులు, వైకాపాకు చెందిన వారే ఉన్నారు.
ఆ సంఘానికి మాత్రమే అనుమతి : ఆర్టీసీ అధికారులు ఐదేళ్లలో కేవలం వైకాపా సంఘం నాయకులకు మాత్రమే తమ కార్యాలయాల్లోకి అనుమతించారు. వేరే సంఘాల వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. వారు చెప్పిన సమస్యలను కనీసం విన్న పాపాన పోలేదు. వైకాపా సంఘం నాయకులు చెప్పినట్లే కొంతమంది అధికారులు నడుచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యం వధ.. ధర్మం చెర!
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. -
శీతంపేటలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
[ 01-07-2024]
అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని తాటిగుంటపల్లి పంచాయతీ శీతంపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెరిగిన దిగుబడులు దిగుతున్న టమాట ధరలు
[ 01-07-2024]
మార్కెట్ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి. -
రహదారి కబ్జా... సాగుతో దర్జా
[ 01-07-2024]
మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. -
వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!
[ 01-07-2024]
గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు రెండోస్థానం
[ 01-07-2024]
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. -
ఇంటి వద్దకే నడిపింఛను
[ 01-07-2024]
ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు. -
అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!
[ 01-07-2024]
జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. -
మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
[ 01-07-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పోలేరమ్మకు బోనాలు
[ 01-07-2024]
పెద్దకప్పలపల్లెలో ఆదివారం పోలేరమ్మకు బోనాలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. -
మూడేళ్లుగా నిర్లక్ష్యం...లీకేజీలతో సతమతం
[ 01-07-2024]
అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది. -
మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
[ 01-07-2024]
అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు.