బాగున్న బస్సులన్నీ పుంగనూరుకు వెళ్లాయి
ఆర్టీసీ డిపోల్లో బాగున్న బస్సులన్నీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పుంగనూరుకు తరలించారని, వాటిని తిరిగి రప్పించాలని బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ మదనపల్లె 1, 2 డిపోల నాయకులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
మళ్లీ డిపోలకు పంపాలని మంత్రికి వినతి
మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డితో మాట్లాడుతున్న ఆర్టీసీ బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు అర్జున్నాయక్, శివ, నరసింహులు
మదనపల్లె అర్బన్, న్యూస్టుడే : ఆర్టీసీ డిపోల్లో బాగున్న బస్సులన్నీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రోద్బలంతో పుంగనూరుకు తరలించారని, వాటిని తిరిగి రప్పించాలని బహుజన ఎంప్లాయీస్ ఫెడరేషన్ మదనపల్లె 1, 2 డిపోల నాయకులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాయచోటిలో శుక్రవారం నాయకులు అర్జున్నాయక్, నరసింహులు, శివ, రమణ తదితరులు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ కారణాలతో మదనపల్లె నుంచి పుంగనూరు డిపోకు 20 బస్సులు తరలించుకుపోయారని తెలిపారు. ఈ క్రమంలో బస్సులు పుంగనూరు నుంచి నడపటం వల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో 50 కిలోమీటర్ల మేర ఖాళీగా తిరుగుతూ, ఆర్టీసీకి నష్టాన్ని కలుగజేస్తున్నాయని వివరించారు. కడప, చెన్నై, హైదరాబాద్, విజయవాడ, చిత్తూరు, కదిరి ప్రాంతాల మధ్య తిరిగే బస్సులను తిరిగి మదనపల్లె డిపోలకే పంపించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మంత్రి పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కడప క్రీడలు : ఉమ్మడి కడప జిల్లాలో వ్యాయామోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డికి సంఘం ప్రతినిధులు కోరారు. రాయచోటిలో శుక్రవారం మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూజీపీఈడీ డిగ్రీ అర్హత ఉన్న ఉపాధ్యాయులను ఒక ఏడాది బ్రిడ్జి కోర్సు ఏర్పాటు చేసి పాఠశాల సహాయకులుగా పదోన్నతి కల్పించాలన్నారు. రైల్వే, ఆర్టీసీ బస్సులో క్రీడాకారులకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని, జీవో 117ను రద్దు చేసి ఉన్నత పాఠశాలల్లో పీఈటీ పోస్టులను పునరుద్ధరించాలని వారంతా విన్నవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెరిగిన దిగుబడులు దిగుతున్న టమాట ధరలు
[ 01-07-2024]
మార్కెట్ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి. -
రహదారి కబ్జా... సాగుతో దర్జా
[ 01-07-2024]
మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. -
వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!
[ 01-07-2024]
గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు రెండోస్థానం
[ 01-07-2024]
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. -
ఇంటి వద్దకే నడిపింఛను
[ 01-07-2024]
ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు. -
అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!
[ 01-07-2024]
జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. -
మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
[ 01-07-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పోలేరమ్మకు బోనాలు
[ 01-07-2024]
పెద్దకప్పలపల్లెలో ఆదివారం పోలేరమ్మకు బోనాలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. -
మూడేళ్లుగా నిర్లక్ష్యం...లీకేజీలతో సతమతం
[ 01-07-2024]
అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది. -
మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
[ 01-07-2024]
అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/07/24)
-
రికార్డులు సృష్టిస్తున్న ‘కల్కి’.. రూ.500 కోట్ల క్లబ్లో చేరిక
-
దీదీ.. ఈ ఘోరం మీకు కనిపించలేదా?ఇదేనా మీ పాలన?
-
ఖుషీ స్వెట్టర్ కోరిక.. చీరలో వేదిక.. కోర్టులో రెజీనా
-
జలపాతం సందర్శనకు వెళ్లి.. ఒకే కుటుంబంలో అయిదుగురు గల్లంతు!
-
కేదార్నాథ్లో మంచు ఉప్పెన.. వీడియో వైరల్