కన్నేశారు... కాజేశారు!
పీలేరులోని నూనె విత్తుల కర్మాగారం భూములను గత వైకాపా ప్రభుత్వ అండతో నేతలు కాజేశారు.
వైకాపా నాయకుల ఆక్రమణలో నూనె విత్తుల కర్మాగారం
రైతులిచ్చిన 55.19 ఎకరాల విలువ రూ.500 కోట్ల పైమాటే
న్యూస్టుడే, పీలేరు గ్రామీణ
పీలేరులోని నూనె విత్తుల కర్మాగారం ఆవరణలోనిర్మిస్తున్న ఆసుపత్రి భవనం
పీలేరులోని నూనె విత్తుల కర్మాగారం భూములను గత వైకాపా ప్రభుత్వ అండతో నేతలు కాజేశారు. భూముల చుట్టూ ఉన్న కంచె తొలగించి విచ్చలవిడిగా కబ్జాలకు తెరలేపారు. వీటిని కాపాడాల్సిన రెవెన్యూ శాఖాధికారులు అక్రమార్కులకు వంత పాడారు. ఆక్రమణదారులు వారు అడిగిన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలకు పొజిషన్ ధ్రువపత్రాలు జారీ చేసి అక్రమాలకు కొమ్ముకాశారు. కర్మాగారంలోని గోదాములు తప్ప మిగతా భూములను ఆక్రమించేసి విలాసవంతమైన భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఇలా ఆక్రమణకు గురైన భూముల విలువ రూ.500 కోట్లకుపైగా ఉంటుందని అంచనా.
కర్మాగారం ఆవరణలో అక్రమ భవన నిర్మాణాలు
రాయలసీమ జిల్లాల్లో అధిక శాతం మంది రైతులు వేరుసెనగ సాగుచేస్తుంటారు. వీరు పండించిన పంటను దళారులకు వచ్చిన కాడికి అమ్ముకునేవారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించాలనే ఆలోచనతో 1987లో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రభుత్వ హయాంలో పీలేరు-తిరుపతి మార్గంలో శ్రీకృష్ణ దేవరాయల పేరిట నూనె విత్తుల కర్మాగారం ఏర్పాటు నిమిత్తం భూసేకరణకు శ్రీకారం చుట్టారు. దీంతో మొత్తం 21 మంది రైతులు 55.19 ఎకరాల భూములివ్వడంతో పరిశ్రమ స్థాపించారు. అప్పట్లో పరిశ్రమ చుట్టూ కంచె ఏర్పాటు చేసి భూములకు రక్షణ కల్పించారు. అనంతరం పరిస్థితుల ప్రభావంతో సంస్థ మూతపడడంతో కర్మాగార భూములపై వైకాపా నేతల కన్ను పడింది. కర్మాగార భూముల్లో అక్రమ నిర్మాణాలను ఇటీవల పరిశీలించిన తెదపా ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డి ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ చేపట్టిన అక్రమ కట్టడాలను తొలగించి భూములను స్వాధీనం చేసుకోవడం లేదా తమకే దక్కే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భూములిచ్చిన రైతులు కోరుతున్నారు.
విచారణ జరుపుతున్నాం : పీలేరు పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ, డీకేటీ భూములు ఆక్రమణలకు గురయ్యాయనేదానిపై సర్వే చేస్తున్నాం. సర్వే పూర్తయిన అనంతరం జిల్లాస్థాయి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం. వారిచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
మహబూబ్బాషా, తహసీల్దారు, పీలేరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యం వధ.. ధర్మం చెర!
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. -
శీతంపేటలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
[ 01-07-2024]
అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని తాటిగుంటపల్లి పంచాయతీ శీతంపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెరిగిన దిగుబడులు దిగుతున్న టమాట ధరలు
[ 01-07-2024]
మార్కెట్ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి. -
రహదారి కబ్జా... సాగుతో దర్జా
[ 01-07-2024]
మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. -
వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!
[ 01-07-2024]
గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు రెండోస్థానం
[ 01-07-2024]
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. -
ఇంటి వద్దకే నడిపింఛను
[ 01-07-2024]
ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు. -
అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!
[ 01-07-2024]
జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. -
మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
[ 01-07-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పోలేరమ్మకు బోనాలు
[ 01-07-2024]
పెద్దకప్పలపల్లెలో ఆదివారం పోలేరమ్మకు బోనాలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. -
మూడేళ్లుగా నిర్లక్ష్యం...లీకేజీలతో సతమతం
[ 01-07-2024]
అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది. -
మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
[ 01-07-2024]
అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు.