పేరుకే రైతులకు అవగాహన... అంతా జగన్ నామస్మరణ..!
జిల్లాలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేరు గొప్ప...ఊరు దిబ్బ అన్నట్లు సాగింది రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) నిర్వహణ.
జిల్లాలో 396 ఆర్బీకేల్లో రూ.1.66 కోట్లతో టీవీల ఏర్పాటు
న్యూస్టుడే, రాజంపేట గ్రామీణ
రాజంపేట మండలం మందరం రైతు భరోసా కేంద్రంలో నిరుపయోగంగా టీవీ
జిల్లాలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో పేరు గొప్ప...ఊరు దిబ్బ అన్నట్లు సాగింది రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) నిర్వహణ. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, పంటల సాగుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతోపాటు పంటలు కొనుగోలు చేసి నగదును నేరుగా రైతుల ఖాతాల్లో వేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వైకాపా నాయకులు ఊదరగొట్టారు. దీనిలో భాగంగా రైతులకు సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ప్రతి కేంద్రానికి టీవీ, పెన్డ్రైవ్, అంతర్జాల సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇవి ఒక్కరోజూ రైతులకు ఉపయోగ పడిన దాఖలాల్లేవు. జిల్లాలోని 396 రైతు భరోసా కేంద్రాల్లో రూ.42 వేల చొప్పున ఖర్చు చేసి 396 టీవీలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం సుమారు రూ.1.66,32,000 వెచ్చించారు. అంతర్జాల సౌకర్యం నిమిత్తం ఒక్కో కేంద్రానికి రూ.1,470-రూ.1560 వంతున రూ.6,17,760 ఖర్చు చేశారు. ఇలా మొత్తం రూ.1,72,49,760 ఖర్చు చేసినా తమకెలాంటి ఉపయోగం లేదని రైతులు వాపోతున్నారు. వీటిని గ్రామ స్థాయిలో రైతులకు సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేశామని వైకాపా నేతలు ప్రచారం చేసినా అప్పటి సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు చూసే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. కేవలం జగన్ భజన కార్యక్రమాలకే భారీఎత్తున నిధులు ఖర్చు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టీవీలు వినియోగంలోకి తెస్తాం : జిల్లా వ్యాప్తంగా 396 ఆర్బీకేల్లో టీవీలు సద్వినియోగం చేసేవిధంగా చర్యలు తీసుకుంటాం. రైతులకు సాంకేతిక పద్ధతులపై అవగాహన కల్పించేవిధంగా ఏర్పాట్లు చేస్తాం.
చంద్రనాయక్, డీఏవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యం వధ.. ధర్మం చెర!
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. -
శీతంపేటలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
[ 01-07-2024]
అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని తాటిగుంటపల్లి పంచాయతీ శీతంపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెరిగిన దిగుబడులు దిగుతున్న టమాట ధరలు
[ 01-07-2024]
మార్కెట్ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి. -
రహదారి కబ్జా... సాగుతో దర్జా
[ 01-07-2024]
మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. -
వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!
[ 01-07-2024]
గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు రెండోస్థానం
[ 01-07-2024]
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. -
ఇంటి వద్దకే నడిపింఛను
[ 01-07-2024]
ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు. -
అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!
[ 01-07-2024]
జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. -
మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
[ 01-07-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పోలేరమ్మకు బోనాలు
[ 01-07-2024]
పెద్దకప్పలపల్లెలో ఆదివారం పోలేరమ్మకు బోనాలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. -
మూడేళ్లుగా నిర్లక్ష్యం...లీకేజీలతో సతమతం
[ 01-07-2024]
అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది. -
మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
[ 01-07-2024]
అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు.