దాడులు.. దౌర్జన్యాలు.. దారుణ హత్యలు..!
రెండో ముంబయిగా ఖ్యాతి గడించిన ప్రొద్దుటూరు పట్టణంలో శాంతిభద్రతలు క్షీణించి నేరాలకు అడ్డాగా మారింది.
ప్రొద్దుటూరులో క్షీణించిన శాంతిభద్రతలు
న్యూస్టుడే, ప్రొద్దుటూరు నేరవార్తలు
వైఎంఆర్ కాలనీలో హత్యకు గురైన వెంకట మహేశ్వరరెడ్డి (పాత చిత్రం)
రెండో ముంబయిగా ఖ్యాతి గడించిన ప్రొద్దుటూరు పట్టణంలో శాంతిభద్రతలు క్షీణించి నేరాలకు అడ్డాగా మారింది. దీంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైంది. తరచూ దాడులు, దౌర్జన్యాలతో పాటు వరుసగా దారుణ హత్యలు జరుగుతున్నాయి. ఎంతో ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత అయిదేళ్ల వైకాపా పాలనలో శాంతి భద్రతలు క్షీణించడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగాయి. క్రికెట్ బెట్టింగ్, మట్కా, ఇసుక అక్రమ రవాణా కార్యకలాపాలు యథేచ్ఛగా సాగాయి. పెన్నానది నుంచి నిత్యం అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. నేరాల కట్టడికి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల హత్యకు గురైన అర్షద్ (పాతచిత్రం)
- 2024, జూన్ 7న ప్రొద్దుటూరు పట్టణం ఇస్లాంపురం వీధికి చెందిన ఓ యువకుడు తెదేపా నేతలతో తిరుగుతున్నాడని వైకాపా నాయకులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలు కాగా ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
- 2024, జూన్ 15న ప్రొద్దుటూరులోని ఆర్టీపీపీ రోడ్డులో ఇసుక తరలింపు వ్యవహారంలో వైకాపా ముఖ్య నేత అనుచరులు దౌర్జన్యానికి దిగారు. తమ ప్రాంతంలో తాము మాత్రమే ఇసుక తరలించాలని ఇతరులు వస్తే ఊరుకునేది లేదంటూ కొందరి వ్యక్తులతో వాగ్వాదానికి దిగి దాడికి యత్నంచారు.
- 2024, జూన్ 21న స్థానిక రామేశ్వరం రోడ్డులో దారుణ హత్య జరిగింది. దర్గాబజార్కు చెందిన అర్షద్ను పుల్లయ్యసత్రం వీధికి చెందిన వెంకటసుబ్బయ్య బండరాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులను అర్షద్ తిట్టడంతో దాన్ని మనసులో పెట్టుకుని మద్యం తాగి పడిపోయి ఉన్న అర్షద్ను కొట్టి చంపేశాడు.
- 2024, జూన్ 23న రాత్రి వైఎంఆర్ కాలనీలో మహేశ్వరరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పడుకున్న మహేశ్వరరెడ్డిని భూమిరెడ్డి రామచంద్రారెడ్డి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపేశాడు. ఆపై శరీరాన్ని ముక్కలుగా చేసి రెండు సంచులో నింపి వాటిని ద్విచక్రవాహనంలో తీసుకెళ్లి పట్టణ శివారు ప్రాంతంలో పడేశాడు. ఇళ్లంతా రక్తపు మరకలు ఉండటంతో యువకుడి తల్లి గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ దారుణం వెలుగులోకి వచ్చింది.
ఇటీవల వైకాపా నాయకుల దాడిలో గాయపడిన యువకుడు
నేరాల కట్టడికి చర్యలు
ప్రొద్దుటూరులో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రాత్రి సమయంలో గస్తీ ముమ్మరం చేశాం. రౌడీషీట్లు తెరిచాం. ఇటీవల జరిగిన రెండు హత్య కేసుల్లో 24 గంటల్లోనే నిందితులను గుర్తించాం. నేరాల కట్టడి చేసేందుకు పలువురి సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి రంగంలోకి దింపాం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదు.
మురళీధర్, డీఎస్పీ, ప్రొద్దుటూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యం వధ.. ధర్మం చెర!
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. -
శీతంపేటలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
[ 01-07-2024]
అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని తాటిగుంటపల్లి పంచాయతీ శీతంపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెరిగిన దిగుబడులు దిగుతున్న టమాట ధరలు
[ 01-07-2024]
మార్కెట్ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి. -
రహదారి కబ్జా... సాగుతో దర్జా
[ 01-07-2024]
మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. -
వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!
[ 01-07-2024]
గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు రెండోస్థానం
[ 01-07-2024]
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. -
ఇంటి వద్దకే నడిపింఛను
[ 01-07-2024]
ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు. -
అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!
[ 01-07-2024]
జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. -
మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
[ 01-07-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పోలేరమ్మకు బోనాలు
[ 01-07-2024]
పెద్దకప్పలపల్లెలో ఆదివారం పోలేరమ్మకు బోనాలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. -
మూడేళ్లుగా నిర్లక్ష్యం...లీకేజీలతో సతమతం
[ 01-07-2024]
అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది. -
మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
[ 01-07-2024]
అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు.