అటవీ అధికారులను అడ్డుకున్న ఆక్రమణదారులు
ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీ అటవీ ప్రాంత భూముల ఆక్రమణదారులందరికీ శుక్రవారం తాఖీదులు ఇచ్చేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను అడ్డుకున్నారు.
ఎఫ్బీవో రాజేష్తో వాగ్వాదానికి దిగిన పెన్నానగర్ వాసులు
ప్రొద్దుటూరు, న్యూస్టుడే: ప్రొద్దుటూరు మండలం సోములవారిపల్లె పంచాయతీ అటవీ ప్రాంత భూముల ఆక్రమణదారులందరికీ శుక్రవారం తాఖీదులు ఇచ్చేందుకు వెళ్లిన అటవీశాఖ అధికారులను అడ్డుకున్నారు. గుడిసెలు వేసే సమయంలో అడ్డుకోకుండా 30 ఏళ్ల తర్వాత వచ్చి ఖాళీ చేయాలంటే, తాము ఎక్కడికి వెళ్లి బతకాలని వారంతా అధికారులను నిలదీశారు. తమ విధులను అడ్డుకోవద్దని ఇది లోకాయుక్త కోర్టు ఆదేశాలని అందరూ సహకరించాలని అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం జేశారు. వాగ్వాదానికి దిగిన వారంతా పోలీసుల జోక్యంతో సద్దుమణిగారు. ఈ విషయమై ఎఫ్ఆర్వో హేమాంజలి మాట్లాడుతూ రామేశ్వరం రిజర్వు అటవీ ప్రాంతం భూములన్నీ అన్యాక్రాంతమయ్యాయని, వాటిని సంరక్షించాలని లోకాయుక్త కోర్టు ఆదేశించింది. తమ పరిశీలనలో సర్వే సంఖ్య 542/1లో 16.23 ఎకరాల భూములను 219 మంది ఆక్రమించి ఇళ్లు, పరిశ్రమల వంటి కట్టడాలు నిర్మించినట్లు గుర్తించాం. వారికి తాఖీదులిచ్చి నిర్ణీత గడువులోపు ఖాళీ చేయించి అటవీ భూములను స్వాధీనం చేసుకునేలా 172 మందికి తాఖీదులిచ్చామని, 15 రోజుల్లో ఖాళీ చేయకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సత్యం వధ.. ధర్మం చెర!
[ 01-07-2024]
అయిదేళ్ల వైకాపా పాలనలో అధికారులు ఆ పార్టీ నాయకులతో కలిసి చేసిన పాపాలు వారిని వెంటాడుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారదన్న ధీమాతో కొంతమంది అధికారులు వైకాపా నాయకులతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంగా భావించి పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. -
శీతంపేటలో ప్రభుత్వ స్థలం ఆక్రమణ
[ 01-07-2024]
అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారుల్లో ఏ మాత్రం చలనం లేదని తాటిగుంటపల్లి పంచాయతీ శీతంపేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పెరిగిన దిగుబడులు దిగుతున్న టమాట ధరలు
[ 01-07-2024]
మార్కెట్ యార్డుకు గత సోమవారం నుంచి క్రమంగా టమాట దిగుబడులు పెరుగుతున్నాయి. -
రహదారి కబ్జా... సాగుతో దర్జా
[ 01-07-2024]
మండలంలోని కలిచెర్ల గ్రామానికి చెందిన పాపిరెడ్డిచెరువు ఆయకట్టు భూములకు వెళ్లే దారిని ఆక్రమించుకుని చుట్టూ కంచె ఏర్పాటు చేశాడు. -
వైకాపా పాపం.. నీటి పథకాలకు శాపం!
[ 01-07-2024]
గ్రామీణులకు రక్షిత జలాలు సరఫరా చేస్తున్న తాగునీటి పథకాల పనితీరు అధ్వానంగా ఉంది. ఏటా వార్షిక నిర్వహణ కోసం ముందస్తుగా గుత్తపత్రాలను పిలుస్తున్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు రెండోస్థానం
[ 01-07-2024]
జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో కడప రెండో స్థానంలో నిలిచిందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీదేవి ఆదివారం తెలిపారు. -
ఇంటి వద్దకే నడిపింఛను
[ 01-07-2024]
ఎన్నికల ముందు పింఛనుదారులకు నరకం చూపించడంతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పింఛను ఇంటి వద్దకు రాదని వైకాపా నాయకులు వాలంటీర్లను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేశారు... పలువురు వృద్ధుల మరణాలకు కారకులయ్యారు. -
అంటకాగారు... ఆస్తులు అంటగట్టారు!
[ 01-07-2024]
జిల్లా పరిషత్ కార్యనిర్వహణాధికారి (సీఈవో) సుధాకర్రెడ్డి గత అయిదేళ్లుగా వైకాపాతో అంటకాగుతూ ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసేశారు. -
మెగా డీఎస్సీతో నిరుద్యోగుల్లో చిగురిస్తున్న ఆశలు
[ 01-07-2024]
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే కూటమితో నిరుద్యోగుల ఆశలు చిగురిస్తున్నాయి. సీఎంగా చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పోలేరమ్మకు బోనాలు
[ 01-07-2024]
పెద్దకప్పలపల్లెలో ఆదివారం పోలేరమ్మకు బోనాలు సమర్పించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేశారు. -
మూడేళ్లుగా నిర్లక్ష్యం...లీకేజీలతో సతమతం
[ 01-07-2024]
అట్లూరు మండలంలోని రెడ్డిపల్లె ఎస్సీ కాలనీలోని ఉపరితల జలాశయం మూడేళ్లగా నిర్లక్ష్యానికి గురైంది. -
మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్
[ 01-07-2024]
అసలు సిసలైన ప్రజానాయకుడు, పట్టుదలకు, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని తెదేపా నియోజకవర్గ బాధ్యుడు చదిపిరాళ్ల భూపేష్రెడ్డి అన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి
-
బాలికల విషాద ‘ప్రేమలు’
-
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం