ఆసుపత్రుల నిధులనూ వదల్లేదు!
భీమవరంలో ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణ ఇలా అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా కేంద్రం ద్వారా కాయకల్ప నిధులు విడుదలవుతాయి.
అడ్డగోలుగా మళ్లించిన వైకాపా సర్కారు
భీమవరం పట్టణం, కైకలూరు, చింతలపూడి, న్యూస్టుడే: ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులనూ వైకాపా సర్కారు వదల్లేదు. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా కేటాయించిన సొమ్మును అడ్డగోలుగా ఇతర అవసరాలకు మళ్లించింది. అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చకుండా, వసతులు కల్పించకుండా ఆసుపత్రులను గుల్ల చేసింది.
భీమవరంలో ప్రాంతీయ ఆసుపత్రి ఆవరణ ఇలా అపరిశుభ్రంగా దర్శనమిస్తోంది. పారిశుద్ధ్య నిర్వహణకు ఏటా కేంద్రం ద్వారా కాయకల్ప నిధులు విడుదలవుతాయి. కొన్నేళ్లుగా ఈ నిధులు మళ్లించడంతో పారిశుద్ధ్య నిర్వహణ కొండెక్కింది. ఆసుపత్రికి వెళ్తే అదనపు రోగం అంటుకునేలా ఆవరణ తయారైంది.
బాలింతలు శిశువులతో ఆసుపత్రులకు వచ్చినప్పుడు పాలిచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. దీని కోసం గతంలో గదులు నిర్మించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో వాటిని సద్వినియోగంచేసే నిధులు లేక చాలా చోట్ల ఇలా నిరుపయోగంగా మిగిలాయి.
లెక్కాపత్రం లేదు.. ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ ఎష్యూరెన్స్ స్టాండర్డ్), లక్ష్య, ముస్కాన్, కాయకల్ప నిధులను కేంద్ర ప్రభుత్వం ఏటా ఆసుపత్రులకు విడుదల చేస్తుంది. వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పేందుకు, రోగులను తరలించే చక్రాల కుర్చీలు, ట్రాలీల కొనుగోలుకు ఆసుపత్రి స్థాయిని బట్టి ఏటా రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఎన్క్వాస్ నిధులు విడుదలవుతాయి. ఆపరేషన్ థియేటర్, లేబర్వార్డుల్లో వసతులు, పరికరాలను సమకూర్చేందుకు ‘లక్ష్య’ నిధులు రూ.3 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు విడుదలవుతాయి. గర్భిణులు, చిన్నపిల్లలకు అవసరమయ్యే వసతులకు ‘ముస్కాన్’ ద్వారా రూ. 3.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వస్తాయి. వీటితో నవజాత శిశువులకు అవసరమైన వైద్య పరికరాలు కొనుగోలు చేయొచ్చు. ఆసుపత్రి ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణకు కాయకల్ప నిధులు రూ.5 లక్షలకు పైగా వస్తాయి. ఒక్కో పడకకు రూ.10 వేలుచొప్పున ఆయా ఆసుపత్రులకు నిధులు విడుదలవుతాయి. ఇలాంటి నిధులన్నింటినీ ఆసుపత్రి గుమ్మం చేరకుండానే వైకాపా ప్రభుత్వం మళ్లించేసింది.
2019 నుంచి.. ఉమ్మడి పశ్చిమగోదావరిలో తణుకు, ఏలూరులలో జిల్లా ఆసుపత్రులున్నాయి. తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, నరసాపురంలలో ప్రాంతీయ, ఆకివీడు, పెనుగొండ, ఆచంట, భీమడోలు, పోలవరం, దెందులూరు, చింతలపూడి, కైకలూరులలో సామాజిక ఆసుపత్రులున్నాయి. వీటిని కేంద్ర బృందాలు ఏటా తనిఖీ చేస్తాయి. 2019 నుంచి గతేడాది వరకు ఆయా ఆసుపత్రులకు కేంద్రం నుంచి విడుదలైన మొత్తంతో పాటు జేఎస్ఎస్కే, ఆసుపత్రి అభివృద్ధి నిధులను కూడా ఇతర అవసరాలకు మళ్లించారు. ఈ నిధులను ఎలాంటి అవసరాలకు మళ్లించారో కూడా ఎలాంటి లెక్కాపత్రం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని ఆసుపత్రులకు గతంలో విడుదల కావాల్సిన నిధుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని డీసీహెచ్ఎస్ పి.సూర్యనారాయణ చెప్పారు.
- చింతలపూడి మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 2022లో ఎన్క్యూఎస్ గుర్తింపు పొందినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆసుపత్రిలో మౌలిక వసతుల కల్పనకు ఏటా రూ.3 లక్షల చొఫ్పున కేటాయించాల్సి ఉన్నా ముందడుగు పడలేదు. ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడంతో పాటు ఆసుపత్రి వెనుక భారీ గొయ్యి కూడా ఏర్పడింది. నిధుల లేమితో అభివృద్ధి పనులు సాగడం లేదు.
సొంత ఖర్చులతో..
ఏటా కేంద్ర బృందాలు ఆసుపత్రులను తనిఖీ చేసి కేంద్రానికి నివేదిక ఇస్తారు. దీని ఆధారంగానే నిధులు విడుదలవుతాయి. ఈ నేపథ్యంలో తనిఖీల సమయంలో ఆసుపత్రులను శుభ్రంగా తీర్చిదిద్దడం, ఇతర ఏర్పాట్లకు వైద్యాధికారులు సొంత నిధులు వెచ్చించేవారు. తరువాత నిధులు ఖాతాల్లో పడగానే రాష్ట్ర ప్రభుత్వం మళ్లించేయడంతో ఆసుపత్రులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
- కైకలూరు సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని కేంద్ర బృందం సందర్శించి రోగుల అభిప్రాయాలను సేకరించింది. ఈ క్రమంలో శానిటైజేషన్, రోగులకు అందిస్తున్న సేవల విభాగంలో ఉత్తమ అవార్డు అందించారు. అభివృద్ధి నిధులను వైకాపా సర్కారు ఇప్పటి వరకు జమ చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.