కేటాయింపులే.. విడుదల్లేవ్!
జిల్లాలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) నిధులతో చేపట్టిన రహదారుల పనులు నిధులు విడుదల కాక నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
పనులు నిలిపేసిన గుత్తే‘దారులు’
వెంటాడుతున్న గత వైకాపా సర్కారు వైఫల్యాలు
తణుకు, న్యూస్టుడే: జిల్లాలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) నిధులతో చేపట్టిన రహదారుల పనులు నిధులు విడుదల కాక నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
రహదారుల నిర్మాణానికి గత వైకాపా ప్రభుత్వం రూ. 87.5 కోట్లు మంజూరు చేసింది. 30 శాతం పనులు పూర్తి చేసిన గుత్తేదారులు..అనంతరం బిల్లులు విడుదల కాకపోవడంతో పనులను నిలిపేశారు. కొన్ని ఆర్అండ్బీ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. విస్తరణతో పాటు నూతన రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు 2021లో పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. దీంతో అటు ప్రయాణికులు, ఇటు స్థానికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు.
‘‘కానూరు- లంకలకోడేరు, పెనుమంట్ర- వీరవాసరం రహదారి పనులు పూర్తి చేశాం. మిగిలినవి 30 శాతం మేర పూర్తయ్యాయి. బిల్లులు విడుదల కాకపోవడంతో గుత్తేదారులు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు.’’ అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు లోకేశ్వరరావు అన్నారు.
కె.సముద్రగట్టు వద్ద గోతులుపై ప్రయాణికుల అవస్థలు
ఎక్కడెక్కడ అంటే..
- కానూరు - లంకలకోడేరు రోడ్డును గోటేరు నుంచి ఇరగవరం వరకు రూ.4కోట్లతో 2 కి.మీ మేర నిర్మించారు. దీనిలో భాగంగా కొంత దూరం సీసీ రోడ్డు వేశారు. 90 శాతం పనులు పూర్తయినా నిధులు మంజూరు కాలేదు.
- పెనుమంట్ర-నవుడూరు రహదారిని 600 మీటర్ల మేర రూ.1.4కోట్లతో నిర్మాణం పూర్తి చేశారు.
- పెనుమంట్ర- వీరవాసరం, పాలకొల్లు- ఆచంట, మేడపాడు- నరసాపురం, తణుకు- భీమవరం, తణుకు-ఇరగవరం మార్గాల్లోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పనులు 30 శాతం పూర్తయాయి. గవర్లపాలెం నుంచి మోగల్లు వరకు 14.5 కి.మీ మేర నిర్మాణానికి రూ. 33 కోట్లు మంజూరు చేశారు. 1600 మీటర్ల మేర 5 మీటర్ల వెడల్పున ఉన్న రహదారిని 7 మీటర్ల వరకు విస్తరించి సిమెంట్ రహదారి నిర్మించారు. ప్రస్తుతం జేసీబీలతో తవ్వి రహదారిని చదును చేసి వదిలేశారు.
- పాలకొల్లు నుంచి ఆచంట వరకు రూ.5.5 కోట్లతో నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మేడపాడు నుంచి నరసాపురం వరకు రెండు బిట్లుగా చేయడానికి రూ.40 కోట్లు మంజూరయ్యాయి. కానీ విడుదల కాకపోవడంతో రెండేళ్లుగా పనులు నిలిచిపోయాయి.
- తణుకు నుంచి భీమవరం వెళ్లే మార్గం ఇది. ఇరగవరం మండలం గవర్లపాలెం నుంచి అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు వరకు రహదారి విస్తరణ పనులు చేపట్టారు. ఇవి అసంపూర్తిగా వదిలేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.