సొంత సొమ్ముతో రోడ్డు నిర్మాణం
కుప్పనపూడి పరిధి తాళ్లకోడు ప్రాంతంలోని 74 ఎకరాల జగనన్న లేఅవుట్లో తాగునీరు, రహదారులు, మురుగు కాలువలు తదితర వసతుల్లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
74 ఎకరాల జగనన్న లేఅవుట్లో జనం పాట్లు
రోడ్డును బాగు చేసుకుంటున్న నివాసితులు
ఆకివీడు, న్యూస్టుడే: కుప్పనపూడి పరిధి తాళ్లకోడు ప్రాంతంలోని 74 ఎకరాల జగనన్న లేఅవుట్లో తాగునీరు, రహదారులు, మురుగు కాలువలు తదితర వసతుల్లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతర్గత రహదారులన్నీ మట్టి రోడ్లుగా దర్శనమిస్తుండటంతో లబ్ధిదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికీ బురదమయంగా మారుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. వైకాపా సర్కారు అసమర్థ పాలనకు ఈ లేఅవుట్ నిదర్శనంగా మారుతోంది. గత పాలకుల తీరుతో విసిగి వేసారిపోయిన స్థానికులు సొంత నిధులతో సుమారు రెండు కిలోమీటర్ల పొడవున్న రహదారి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గురువారం కంకర, వ్యర్థ ఇటుకలు తెప్పించుకొని... జేసీబీ సాయంతో శ్రమదానం చేసి రహదారి ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 50 మంది నివాసితులుండగా... ఒక్కొక్కరు రూ.2 వేలు నుంచి రూ.3 వేలు మేర నగదు వెచ్చించినట్లు స్థానికులు షేక్ బాజీ, జి.నానాజీ, ఎం.సూర్యనారాయణరాజు, ప్రకాశ్, చంద్రశేఖర్, శ్రీను, రమణ తదితరులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంస్కరణల మాట.. విధ్వంస బాట!
[ 08-07-2024]
భీమవరంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు ఇలా నాచుపట్టి, తలుపులు ఊడిపోయి ఉన్నాయి. -
అయిదేళ్లుగా ఆదరణ కరువు
[ 08-07-2024]
ఆదరణ పథకానికి దరఖాస్తు చేసుకుని నగదు చెల్లించినా పరికరాలు ఇవ్వలేదు.. తమకు న్యాయం చేయాలని దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలానికి చెందిన వందల మంది ఇటీవల కలెక్టరేట్లో నిర్వహించిన ‘మీకోసం’లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
ఇక దారికొచ్చినట్లే..!
[ 08-07-2024]
కృష్ణా జిల్లా పామర్రు నుంచి పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు వరకు విస్తరించి ఉన్న 165వ నంబరు జాతీయ రహదారి అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. -
ఏపీకి అండగా కేంద్రం: శ్రీనివాస వర్మ
[ 08-07-2024]
ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
అక్రమాలు కనిపింఛనేలేదు!
[ 08-07-2024]
పింఛన్ పొందడానికి సరిపడా వయసు లేకపోయినా ఆధార్ కార్డుల్లో వయసు మార్చేయడంలో సిద్ధహస్తులు అనేక మంది ఉన్నారు. -
ఊపిరిపోసిన వర్షాలు
[ 08-07-2024]
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో ఖరీఫ్ సాగుకు ఊపిరిపోశాయి. పంట కాలువలకు జూన్ 1న నీటిని విడుదల చేయగా శివారు ప్రాంతాలకు జలాలు సకాలంలో చేరకపోవడంతో సాగు కొంత ఆలస్యమైంది. -
కానరాని చేప నారు ఉత్పత్తి
[ 08-07-2024]
ఉంగుటూరు మండలం బాదంపూడిలోని మత్స్య కేంద్రం చేప నారు ఉత్పత్తి కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలో పేరుగాంచింది. దీన్ని 1961లో 14.06 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. -
తెర వెనుక దాటేశారు!
[ 08-07-2024]
నరసాపురం పట్టణం మాధవాయిపాలెం ఫెర్రీ రేవు పాట సొమ్ము వసూలు చేయాల్సిన అధికారులు మొన్నటి వరకూ వైకాపా నాయకుల ఒత్తిడితో వెనుకడుగు వేశారు. -
ఇసుక ఉచితం
[ 08-07-2024]
వైకాపా సర్కారు దోపిడీతో అయిదేళ్లుగా ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగం కుదేలై.. ఉపాధి లేక వేల కుటుంబాలకు జీవనం కష్టంగా మారిన విషయం తెలిసిందే. -
అరకొర వసతులు.. అవస్థల చదువులు
[ 08-07-2024]
నాడు-నేడు రెండో విడతలో జిల్లాలోని పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలు ఒక్కటంటే ఒక్కటీ పూర్తి కాలేదు. -
కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి
[ 08-07-2024]
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో భూమి విలువ రోజురోజుకు పెరుగుతుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.