అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం యావత్తు జాతికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రైతు నాయకుడు వి.శ్రీనివాసరావు అన్నారు.
సీతారామరాజు కాంస్య విగ్రహం వద్ద నినాదాలు చేస్తున్న ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు
భీమవరం పట్టణం, పాలకోడేరు, న్యూస్టుడే: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం యావత్తు జాతికి స్ఫూర్తిదాయకమని రాష్ట్ర రైతు నాయకుడు వి.శ్రీనివాసరావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా స్థానిక ఏఎస్ఆర్ నగర్లోని కాంస్య విగ్రహానికి గురువారం పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ... సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరితో సత్సంబంధాలున్న ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి, మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ... అల్లూరి జీవితం విద్యార్థులకు ఆదర్శనీయమన్నారు. అల్లూరి స్ఫూర్తితో తెలుగు ప్రజలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బి.బలరాం, మంతెన సీతారాం, కూనపరాజు కుమార్, గాదిరాజు సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు.. అల్లూరి జయంతిని పురస్కరించుకొని నిర్వహణ కమిటీ ఆధ్వర్యాన ద్విచక్ర వాహన ప్రదర్శన చేపట్టారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, పెనుమంట్ర, పెనుగొండ, అత్తిలి, పోడూరు మండలాల్లోని వివిధ ప్రాంతాల నుంచి ప్రదర్శనగా మోగల్లు చేరుకున్నారు. అక్కడ సీతారామరాజు విగ్రహనికి పుష్పాంజలి ఘటించారు. అక్కణ్నుంచి భీమవరంలోని అల్లూరి స్మృతివనం వద్ద ఏర్పాటు చేసిన సభకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
భీమవరం కలెక్టరేట్, న్యూస్టుడే: ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొని... ప్రాణాలు కోల్పోయిన అల్లూరి సీతారామరాజు యువతరానికి స్ఫూర్తి ప్రదాత అని కలెక్టర్ నాగరాణి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో అల్లూరి జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్ పుష్పాంజలి ఘటించారు. మన్యం వీరుడు అల్లూరి త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, డీఆర్వో ఉదయ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని నుంచి ఆ ఒక్క ఫోన్ కాల్తో రిలాక్స్ అయిపోయా : రిషభ్ పంత్
-
పోటీపై బైడెన్ త్వరలో నిర్ణయం.. హవాయి గవర్నర్ కీలక వ్యాఖ్యలు!
-
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
-
అమ్మానాన్న మనసు వెన్న.. మమత మిన్న.. ఆలోచన రేకెత్తించిన విద్యార్థుల ప్రాజెక్టు
-
సూరత్లో భవనం కుప్పకూలిన ఘటన.. ఏడుకు చేరిన మృతులు
-
2 నెలల్లో అమరావతికి స్వచ్ఛ శోభ