కేవీకే వాకిట.. స్వర్ణోత్సవం
దేశంలో వ్యవసాయ రంగం, రైతులను బలోపేతం చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) కీలక పాత్ర పోషిస్తున్నాయి.
స్వర్ణోత్సవ జ్యోతిని అందుకుంటున్న విస్తరణ సంచాలకురాలు కరుణ శ్రీ
తాడేపల్లిగూడెం పట్టణం (ఉద్యాన విశ్వవిద్యాలయం), న్యూస్టుడే: దేశంలో వ్యవసాయ రంగం, రైతులను బలోపేతం చేయడంలో కృషి విజ్ఞాన కేంద్రాలు (కేవీకే) కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని ఏర్పాటు చేసి, 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతుల భాగస్వామ్యంతో స్వర్ణోత్సవం నిర్వహిస్తున్నారు. దేశంలో మొట్టమొదటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని 1974 మార్చి 21న పుదుచ్చేరిలో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా 731 కేవీకేలు ఏర్పాటయ్యాయి. స్వర్ణోత్సవాల్లో భాగంగా స్వర్ణోత్సవ జ్యోతి యాత్ర నిర్వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పందిరిమామిడి కేవీకే నుంచి స్వర్ణోత్సవ జ్యోతి గురువారం రాత్రి తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రానికి చేరుకుంది. ఈ నెల 5,6 తేదీల్లో కేవీకేలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విస్తరణ సంచాలకురాలు ఇ.కరుణ శ్రీ తెలిపారు. వెంకట్రామన్నగూడెం కేవీకే 14 వసంతాలు పూర్తి చేసుకుందని పేర్కొన్నారు.
అన్నదాతలకు ఊతం.. వెంకట్రామన్నగూడెం వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 2010లో ఏర్పాటైన కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు వరంగా మారింది. సంప్రదాయ సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు ఆధునిక సేద్యంతో అధిక దిగుబడులు సాధించడానికి సహకరిస్తోంది. నూతన సాంకేతిక పరిజ్ఞానం, సాగు రంగంలో ఉపాధి మార్గాలు చూపుతోంది. ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేసి కొత్త పరిశోధనలను అన్నదాతలకు చేరువ చేస్తోంది.
కేవీకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేడియో స్టేషన్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విలక్షణ కార్యక్రమాలు, వినూత్న సేవలతో కేవీకే కర్షకుల మన్నన పొందుతోంది. ఉద్యానం, వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి, కోళ్లు, తేనెటీగలు, నర్సరీ మొక్కలు, పెరటి తోటల పెంపకం, చేపల పెంపకంలో రైతులకు సలహాలు, సూచనలిస్తోంది. కమ్యూనిటీ రేడియో స్టేషన్, యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా సేవలందిస్తోంది. నూతన సాంకేతిక పద్ధతులు, మేలైన యాజమాన్యంతో రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ మేరకు జాతీయ, జోనల్ స్థాయిలో పలు పురస్కారాలను దక్కించుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పూరీ జగన్నాథుని రత్న భాండాగారంపై 9వ తేదీన నిర్ణయం
-
జగన్ వినకపోవడం వల్లే ఓడిపోయా: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
-
‘మీరు భలే ఉంటారు...’! ఓ పోలీసు అధికారి విపరీత ప్రవర్తన
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అశ్వారావుపేట ఎస్సై మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/07/24)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?