ఆందోళనొద్దు.. ఆదుకుంటాం
నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం నూజివీడు మార్కెట్ యార్డులో నిర్వహించిన మామిడి రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు.
నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపునకు కృషి
రైతులకు మంత్రి పార్థసారథి భరోసా
మాట్లాడుతున్న కొలుసు
నూజివీడు రూరల్, న్యూస్టుడే: నూజివీడు మామిడికి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించేందుకు సమష్టిగా కృషి చేద్దామని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం నూజివీడు మార్కెట్ యార్డులో నిర్వహించిన మామిడి రైతుల సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రపంచ స్థాయి మార్కెట్ నూజివీడు మామిడికి ఉందని, దాని స్థాయి మరింత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రానున్న రోజుల్లో మామిడికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ప్రభుత్వపరంగా రైతులకు లబ్ధి చేకూరుస్తామన్నారు. ఎగుమతుల ద్వారా రైతులు లాభం పొందేలా ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. బీమా సమస్యను పరిష్కరిస్తామన్నారు. మామిడి పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తలు, సిబ్బంది కొరత కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నామని, క్షేత్రస్థాయిలో ఫలితాలు రైతులకు అందినప్పుడే శాస్త్రవేత్తల పరిశోధనకు సార్థకత చేకూరుతుందన్నారు. పంట సాగులో మెలకువలపై యువ రైతులకు శిక్షణ ఇస్తామన్నారు. కాయకు తొడిగే కవర్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మామిడి సాగు సమస్యలు వివరించి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకుంటామన్నారు. పలువురు రైతులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యానాధికారి ఎస్.రామ్మోహన్, ఏపీ ఎంఐపీ ప్రాజెక్టు అధికారి పి.రవికుమార్, శాస్త్రవేత్త కనకమహాలక్ష్మి, ఏఎంసీ కార్యదర్శి శ్రీనివాస్రావు, నూజివీడు ఏఎంసీ మాజీ ఛైర్మన్ కాపా శ్రీనివాసరావు, గొల్లపూడి ఏఎంసీ మాజీ ఛైర్మన్ నూతక్కి రామప్రసాద్, పారిశ్రామికవేత్త కోటగిరి శ్రీనివాస్, విజయబాబు, మామిడి రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంస్కరణల మాట.. విధ్వంస బాట!
[ 08-07-2024]
భీమవరంలోని సాంఘిక సంక్షేమ కళాశాల బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు ఇలా నాచుపట్టి, తలుపులు ఊడిపోయి ఉన్నాయి. -
అయిదేళ్లుగా ఆదరణ కరువు
[ 08-07-2024]
ఆదరణ పథకానికి దరఖాస్తు చేసుకుని నగదు చెల్లించినా పరికరాలు ఇవ్వలేదు.. తమకు న్యాయం చేయాలని దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలానికి చెందిన వందల మంది ఇటీవల కలెక్టరేట్లో నిర్వహించిన ‘మీకోసం’లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
ఇక దారికొచ్చినట్లే..!
[ 08-07-2024]
కృష్ణా జిల్లా పామర్రు నుంచి పశ్చిమగోదావరి జిల్లా దిగమర్రు వరకు విస్తరించి ఉన్న 165వ నంబరు జాతీయ రహదారి అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. -
ఏపీకి అండగా కేంద్రం: శ్రీనివాస వర్మ
[ 08-07-2024]
ఏపీ అభివృద్ధికి కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. -
అక్రమాలు కని‘పింఛనే’లేదు!
[ 08-07-2024]
పింఛన్ పొందడానికి సరిపడా వయసు లేకపోయినా ఆధార్ కార్డుల్లో వయసు మార్చేయడంలో సిద్ధహస్తులు అనేక మంది ఉన్నారు. -
ఊపిరిపోసిన వర్షాలు
[ 08-07-2024]
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాలో ఖరీఫ్ సాగుకు ఊపిరిపోశాయి. పంట కాలువలకు జూన్ 1న నీటిని విడుదల చేయగా శివారు ప్రాంతాలకు జలాలు సకాలంలో చేరకపోవడంతో సాగు కొంత ఆలస్యమైంది. -
కానరాని చేప నారు ఉత్పత్తి
[ 08-07-2024]
ఉంగుటూరు మండలం బాదంపూడిలోని మత్స్య కేంద్రం చేప నారు ఉత్పత్తి కేంద్రంగా ఉమ్మడి రాష్ట్రంలో పేరుగాంచింది. దీన్ని 1961లో 14.06 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. -
తెర వెనుక దాటేశారు!
[ 08-07-2024]
నరసాపురం పట్టణం మాధవాయిపాలెం ఫెర్రీ రేవు పాట సొమ్ము వసూలు చేయాల్సిన అధికారులు మొన్నటి వరకూ వైకాపా నాయకుల ఒత్తిడితో వెనుకడుగు వేశారు. -
ఇసుక ఉచితం
[ 08-07-2024]
వైకాపా సర్కారు దోపిడీతో అయిదేళ్లుగా ఇసుక సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో నిర్మాణ రంగం కుదేలై.. ఉపాధి లేక వేల కుటుంబాలకు జీవనం కష్టంగా మారిన విషయం తెలిసిందే. -
అరకొర వసతులు.. అవస్థల చదువులు
[ 08-07-2024]
నాడు-నేడు రెండో విడతలో జిల్లాలోని పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణాలు ఒక్కటంటే ఒక్కటీ పూర్తి కాలేదు. -
కబ్జా కోరల్లో ప్రభుత్వ భూమి
[ 08-07-2024]
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో భూమి విలువ రోజురోజుకు పెరుగుతుండటంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు.