ఏళ్లుగా అరణ్యరోదనగానే..
పట్టాలిచ్చి ఏళ్లు గడిచిపోతున్నాయి..కాని తమ భూములకు హద్దులు చూపడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హద్దులు చూపాలంటూ లబ్ధిదారుల డిమాండ్
అల్లంచర్లరాజుపాలెంలో పేదలకు పంపిణీ చేసిన భూమి
టి.నరసాపురం, న్యూస్టుడే: పట్టాలిచ్చి ఏళ్లు గడిచిపోతున్నాయి..కాని తమ భూములకు హద్దులు చూపడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టి.నరసాపురం మండలం అల్లంచర్లరాజుపాలెంలో ప్రభుత్వ భూమి సర్వే నం.70లోని 120 ఎకరాల్లో 80 ఎకరాలను పేదలకు, మరొక 40 ఎకరాలను విత్తనాభివృద్ధి క్షేత్రానికి 2005లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. 80 ఎకరాల భూమిని 160 మంది పేదలకు (50 సెంట్లు చొప్పున) పంపిణీ చేసి పట్టాలు కూడా ఇచ్చింది. సాగు కోసం మూడు బోర్లు కూడా వేసింది. నాటి నుంచి అధికారులు ఆయా భూములకు సబ్డివిజన్ చేయలేదు. లబ్ధిదారులకు సరిహద్దులు చూపలేదు. అనంతరం వాటిలో కొందరు పేదలు అనుకూలమైన పంటల సాగు చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో భూముల్లోకి వెళ్లేందుకు దారులు లేకపోవడంతో 2014లో 50 సెంట్లను 40 సెంట్లకు కుదించి మళ్లీ పట్టాలిచ్చారు. కొందరికి ఆన్లైన్ కూడా చేశారు. ప్రభుత్వ పథకాలు(రైతు భరోసా, పీఎం కిసాన్) సైతం అందుతున్నాయి. కానీ భూములు ఎక్కడున్నాయో లబ్ధిదారులకు చూపించలేదు.
తమ భూములు చూపాలంటూ కోరుతున్న లబ్ధిదారులు
వారు ఎలా కొన్నారు
లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమికి ఇంకా హద్దులు చూపలేదు. ఇతర గ్రామాలకు చెందిన వారు ఒక్కొక్కరు 4 ఎకరాలు 80 సెంట్లు చొప్పున కొనుగోలు చేసి ఆయిల్పాం తోటలు పెంచడం విచారకరం.’ అని అల్లంచర్లరాజుపాలెం సర్పంచి నార్ని వెంకట్రావు అన్నారు.
ఎదురు చూస్తూనే ఉన్నా
‘గతంలో కొద్దిపాటి భూమిలో నేను జీడితోట పెంచుకున్నా. ప్రభుత్వం దాన్ని తొలగించి 40 సెంట్ల భూమికి పట్టా ఇచ్చింది. దానికి రైతు భరోసా పథకం కూడా వర్తిస్తోంది. 18 ఏళ్లుగా నా భూమి ఎక్కడుందో నాకు చూపుతారని ఎదురు చూస్తూనే ఉన్నా’ అని అల్లంచర్లరాజుపాలెంకు చెందిన ఉప్పులూరి చిట్టెమ్మ తెలిపారు.
విచారణ నిర్వహిస్తాం
‘అల్లంచర్లరాజుపాలెంలో పేదలకు పంపిణీ చేసిన భూములకు సంబంధించి విచారణ నిర్వహించి చర్యలు చేపడతాం’ అని జంగారెడ్డిగూడెం ఆర్డీవో అద్దయ్య తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.