పట్టిసీమ పరవళ్లు
కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది.
కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు నీటి విడుదల
ఎత్తిపోతల పథకానికి పూర్వ వైభవం
ఈనాడు, ఏలూరు, న్యూస్టుడే-పోలవరం, జంగారెడ్డిగూడెం పట్టణం : కూటమి ప్రభుత్వంతో జలవనరులకు జవసత్వాలొచ్చాయి. వైకాపా అసమర్థతతో కొన ఊపిరితో ఉన్న సాగునీటి నిర్వహణకు ప్రాణం లేచి వచ్చింది. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి బుధవారం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీరు విడుదల చేశారు. వైకాపా విచ్ఛిన్నం చేసిన ఎత్తిపోతల పథకాలను నెత్తిన పెట్టుకుని కాపాడుకుంటామని భరోసా నింపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే లోగా వరద నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టి పట్టిసీమ ద్వారా రైతు అవసరాలు తీరుస్తామని హామీ ఇచ్చారు. పదిలక్షల ఎకరాలకు ఆయువు పట్టులా ఉండే పథకాన్ని వైకాపా గాలికొదిలేసిందని విమర్శించారు.
పూజలు చేస్తున్న మంత్రి రామానాయుడు, చిత్రంలో కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బాలరాజు తదితరులు
కార్యక్రమం సాగిందిలా.. ఉదయం 7 గంటలకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకున్న మంత్రి నిమ్మల అధికారులు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పండితుల వేదాశ్వీరాదం అనంతరం 7.27 గంటలకు ఎత్తిపోతలకు సంబంధించిన మూడు మోటార్ల మీట నొక్కి నీటిని విడుదల చేశారు. ఒక్కో మోటార్ నుంచి 350 క్యూసెక్కుల చొప్పున 1050 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. అక్కడి నుంచి ఎత్తిపోతల నీరు కుడికాలువ ద్వారా ప్రవహించే విధానాన్ని చూసే నమూనా ప్రదర్శనను చూసి అధికారుల ద్వారా సందేహాలు నివృత్తి చేసుకున్నారు. నీటి డిశ్ఛార్జ్ పాయింట్ దగ్గరకు వెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. నీరు కుడి కాలువలోకి చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని ఎత్తిపోతల పథకాల్లో నీరు విడుదల చేసేందుకు వెళ్లారు.
అన్నదాతల్లో ఆశల చిగురింత..
వైకాపా ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల నిర్వహణ విస్మరించడంతో కృష్ణా డెల్టాలోని శివారు ప్రాంతాలకు నీరు చేరటం అసాధ్యమైంది. దీంతో పొలాలు నెర్రెలు తీసి రైతులను కష్టాల్లో ముంచాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఎత్తిపోతల పథకాలకు పూర్వ వైభవం వస్తుందని అన్నదాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకు తగట్టుగానే వరద నీరు వచ్చిన వెంటనే పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టాకు తరలించారు. పట్టిసీమ ఎత్తిపోతలకు మొత్తం 24 పంపులు ఉండగా..బుధవారం నాలుగు పంపుల ద్వారా నీటిని విడుదల చేశారు. క్రమంగా గోదావరిలోకి వచ్చి చేరే వరద నీటి సామర్థ్యాన్ని బట్టి కృష్ణాడెల్టా అవసరాలకు అనుగుణంగా మిగిలిన పంపుల ద్వారా 8500 క్యూసెక్కులు విడుదల చేస్తామని మంత్రి నిమ్మల, సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ నీటి ద్వారా కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. వేలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది. గోదావరి పరవళ్లతో అన్నదాతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మళ్లీ మంచిరోజులొచ్చాయంటూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పత్సమట్ల ధర్మరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, కలెక్టర్ వెట్రిసెల్వి, ఐటీడీఏ పీవో సూర్యతేజ, జలవనరుల శాఖ అధికారులు, తెదేపా, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెరక పనుల్లోనూ.. మేసేశారు
[ 07-07-2024]
పేదలందరికీ గూడు కట్టిస్తామంటూ వైకాపా సర్కారు అడుగడుగునా గూడుపుఠాణి చేసింది. జగనన్న కాలనీల స్థలాల కొనుగోలు విషయంలో రూ.కోట్లు కొల్లగొట్టిన అధికార పార్టీ నేతలు.. మెరక పనుల్లోనూ భారీగా మేసేశారు. -
ఉద్యోగాలు అయిదు.. అధికారి ఒకరు!
[ 07-07-2024]
ఏటా సుమారు రూ.25 కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు నిర్వహించే కేఆర్పురం గిరిజన సహకార సంస్థ(జీసీసీ)కు రెగ్యులర్ అధికారి లేక.. ఇన్ఛార్జితో నెట్టుకొస్తున్నారు. -
ఇక నుంచి నేరుగా గిరిజన విద్యార్థులకే
[ 07-07-2024]
కేఆర్పురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఇక నుంచి నేరుగా వారి చేతికే కాస్మొటిక్ వస్తువులు అందనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జగన్ పాలనలో గాడితప్పిన విద్యా వ్యవస్థ
[ 07-07-2024]
రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లు బీఆర్ఎంవీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. -
ఉచిత ఇసుక అమలుకు కసరత్తు
[ 07-07-2024]
నూతన ఇసుక విధానాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. తొలి దశలో రీచ్ల అనుమతులపై దృష్టి సారించారు. -
సమస్యలుంటే చెప్పండి.. పరిష్కరిస్తా!
[ 07-07-2024]
చదువులో రాణించడంతో పాటు క్రమశిక్షణతో మెలిగితే ఉజ్వల భవిష్యత్తు సొంతమవుతుందని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. -
టీడీఆర్ అక్రమాలపై విచారణ
[ 07-07-2024]
తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై విచారణకు కమిటీని నియమించినట్లు కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. -
15 రోజుల్లో పనులు పూర్తి చేయాలి
[ 07-07-2024]
జిల్లాలో పంట కాల్వలు, డ్రెయిన్లకు సంబంధించిన పనులను వచ్చే సోమవారం ప్రారంభించి 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. -
కృత్రిమ మేధతో ప్రత్యేక స్థానం
[ 07-07-2024]
పోటీ ప్రపంచంలో కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీతో ప్రత్యేక స్థానం సాధించవచ్చని ఐసీఏఆర్- ఎన్ఏఏఆర్ఎం విద్యా వ్యవస్థల విభాగం సీఈవో డాక్టర్ సెంథిల్ వినాయగం తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్యకర్తల కేరింతల నడుమ ఎన్టీఆర్ భవన్కు సీఎం చంద్రబాబు
-
ధోనీ కాళ్లకు నమస్కరించిన సాక్షి.. ‘బర్త్డే’ బాయ్ రియాక్షన్ చూశారా..?
-
గోల్కొండలో ఆషాఢం బోనాల సందడి
-
మందలించారని టీచర్నే పొడిచి చంపిన విద్యార్థి
-
కెరీర్కు WWE స్టార్ జాన్ సీనా గుడ్బై.. చివరి పోరు ఎప్పుడంటే?
-
ప్రభాస్ పెళ్లిపై స్పందించిన శ్యామలా దేవి.. సక్సెస్ రాదన్నారు వచ్చింది